గూగుల్కు చుక్కెదురు
అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజం గూగుల్కు చుక్కెదురైంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గూగుల్పై విధించిన రూ.1337 కోట్ల అపరాధ రుసుముపై మధ్యంతర స్టే విధించడానికి జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) నిరాకరించింది.
సీసీఐ అపరాధ రుసుముపై స్టే ఇవ్వలేం
రూ.1337 కోట్లలో 10% కట్టండి
ఎన్సీఎల్ఏటీ ధర్మాసనం
దిల్లీ: అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజం గూగుల్కు చుక్కెదురైంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గూగుల్పై విధించిన రూ.1337 కోట్ల అపరాధ రుసుముపై మధ్యంతర స్టే విధించడానికి జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) నిరాకరించింది. ఆ మొత్తంలో 10 శాతాన్ని డిపాజిట్ చేయాలని ఆదేశించింది. తన ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) కున్న ఆధిపత్య హోదాను, భారత్లో గూగుల్ దుర్వినియోగం చేసిందన్నది ఆరోపణ. ఈ విషయమై సీసీఐ విధించిన అపరాధ రుసుమును సవాలు చేస్తూ గూగుల్ దాఖలు చేసుకున్న పిటిషన్ను ఎన్సీఎల్ఏటీ విచారణకు స్వీకరించి, ఈ వ్యాఖ్యలు చేసింది. తక్షణం స్టే జారీ చేయలేమని తెలిపింది. సీసీఐకి ఈ విషయంలో నోటీసులు జారీ చేసింది. సీసీఐ ఆదేశాలపై మధ్యంతర స్టేకు సంబంధించి ఫిబ్రవరి 13న విచారణ చేపడతామని తెలిపింది.
‘స్మార్ట్ఫోన్ల ధరలు పెరుగుతాయ్’: ఆండ్రాయిడ్ ప్లాట్ఫాంలో యాప్లను అన్ ఇన్స్టాల్ చేసి, తమకు ఇష్టమైన సెర్చ్ ఇంజిన్ను ఎంచుకునేందుకు గూగుల్ వీలు కల్పించాలని సీసీఐ గతేడాది అక్టోబరులో కోరింది. ఈ ఆదేశాలపై తక్షణం స్టే ఇవ్వాలని గూగుల్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి అభ్యర్థించారు. సీసీఐ ఆదేశాల వల్ల వినియోగదారు భద్రతకు ఇబ్బంది కలగడంతో పాటు, స్మార్ట్ఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉంటుందని గూగుల్ పేర్కొంది. సీసీఐ ఆదేశాలు ‘పేటెంట్ పరంగా తప్పు’, ‘పొరబాట్లతో నిండిపోయినవి’గా ఆయన అభివర్ణించారు. గూగుల్ తన ఆధిపత్యాన్ని ఎక్కడ దుర్వినియోగం చేసిందో సీసీఐ వివరించలేదని అన్నారు. యూరోపియన్ యూనియన్ కమిషన్ 2018లో జారీ చేసిన ఆదేశాల్లో కొంత భాగాన్ని సీసీఐ కాపీ కొట్టినట్లుగా ఉందనీ ఆరోపించారు.
‘అంత తొందరేం ఉంది’: సీసీఐ ఆదేశాలపై సత్వరం స్టే ఇవ్వాలని సింఘ్వి పట్టుపట్టగా.. ‘అంత తొందరేమి ఉంద’ని జస్టిస్ రాకేశ్ కుమార్, అలోక్ శ్రీవాస్తవలతో కూడిన ఎన్సీఎల్ఏటీ ధర్మాసనం ప్రశ్నించింది. సరైన విచారణ లేకుండా ఎటువంటి ఆదేశాలూ జారీ చేయలేమని స్పష్టం చేసింది. ‘మీరు ఆ ఆదేశాలపై పిటిషన్ దాఖలు చేయడానికి రెండు నెలల సమయం తీసుకుని, మమ్మల్ని రెండు నిమిషాల్లో ఆదేశాలు ఇవ్వమని కోరుతున్నారా? ఒకట్రెండు వారాల్లో మీరు ఈ పని చేసి ఉంటే బాగుండేద’ని వ్యాఖ్యానించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా