రిలయన్స్ లాభం రూ.15,792 కోట్లు
సవాలుభరిత వాతావరణంలోనూ మా అన్ని వ్యాపారాలూ బలంగా రాణించాయి. జియో రికార్డు స్థాయి ఎబిటా, ఆదాయాలను అందించింది. 5జీ సేవలు ఆవిష్కరించి, 134 నగరాలకు విస్తరించాం.
ఆర్థిక వ్యయాల కారణంగా 15% క్షీణత
ఆదాయం రూ.2.2 లక్షల కోట్లు
28% పెరిగిన జియో లాభం
కొత్తగా 789 రిటైల్ స్టోర్లు
రూ.3,03,530 కోట్లకు స్థూల రుణాలు
సవాలుభరిత వాతావరణంలోనూ మా అన్ని వ్యాపారాలూ బలంగా రాణించాయి. జియో రికార్డు స్థాయి ఎబిటా, ఆదాయాలను అందించింది. 5జీ సేవలు ఆవిష్కరించి, 134 నగరాలకు విస్తరించాం. రిటైల్ వ్యాపారం మెరుగ్గా సాగుతోంది. దేశీయ ఇంధన మార్కెట్లో ఊగిసలాటలున్నా.. సరైన ఇంధన భద్రతను అందించేలా ఎమ్జే క్షేత్రాన్ని ప్రారంభించాం. జామ్ నగర్లో గిగా ఫ్యాక్టరీల ఏర్పాటులో వేగవంత ప్రగతి ఉంది. మా బలమైన బ్యాలెన్స్ షీట్లు, నగదు నిల్వలు.. ప్రస్తుత వ్యాపార వృద్ధికి, కొత్త అవకాశాల్లో పెట్టుబడులకు వీలు కల్పిస్తున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) రూ.2,20,592 కోట్ల ఆదాయంపై రూ.15,792 కోట్ల నికర లాభాన్ని (ఒక్కో షేరుకు రూ.23.34) ఆర్జించింది. 2021-22 ఇదే త్రైమాసికంలో రూ.1,91,271 కోట్ల ఆదాయంపై రూ.18,549 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని (ఒక్కో షేరుకు రూ.28.08) పొందింది. అంటే నికర లాభం 15% తగ్గితే, ఆదాయాలు 15% పెరిగాయి.
లాభం ఎందుకు తగ్గిందంటే..
రుణ వ్యయాలు పెరగడం, తరుగుదల కారణంగా లాభం తగ్గిందని కంపెనీ పేర్కొంది. ఆర్థిక వ్యయాలు 36.4% పెరిగి రూ.5,201 కోట్లకు: ఇతర వ్యయాలు రూ.5,421 కోట్ల మేర పెరిగాయి. అన్ని వ్యాపారాల్లో ఆస్తులను విస్తృతం చేయడంతో, తరుగుదల 32.6% పెరిగి రూ.10,187 కోట్లకు చేరింది. డీజిల్, విమాన ఇంధన ఎగుమతులపై విధించిన పన్ను వల్ల, లాభంపై రూ.1898 కోట్ల ప్రభావం కనిపించింది.
జిల్జిల్.. జియో
రిలయన్స్ జియో నికర లాభం రూ.3,615 కోట్ల నుంచి 28.3% వృద్ధితో రూ.4638 కోట్లకు చేరుకుంది. ఆదాయం రూ.19,347 కోట్ల నుంచి 18.8% పెరిగి రూ.22,998 కోట్లుగా నమోదైంది. వినియోగదార్ల సంఖ్య 17.5% పెరిగి 43.3 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయం (ఆర్పు) రూ.151.6 నుంచి రూ.178.2కు చేరింది. ‘పరిమాణం పరంగా భారత్ వంటి ఏ దేశంలోనూ లేని విధంగా, అత్యంత వేగంతో కూడిన 5జీ సేవలను 3 నెలల్లోనే 134 నగరాలకు అందుబాటులోకి తెచ్చాం. డిసెంబరు కల్లా దేశవ్యాప్తంగా విస్తరిస్తామ’ని జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు.
ఇ-కామర్స్లో 38% వృద్ధి
రిలయన్స్ రిటైల్ నికర లాభం 6.4% వృద్ధితో రూ.2,400 కోట్లుగా నమోదైంది. ఆదాయం రూ.50,654 కోట్ల నుంచి 18.64% వృద్ధితో రూ.60,096 కోట్లకు పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో 789 జతచేరడంతో, మొత్తం స్టోర్ల సంఖ్య 17,225కు చేరింది. ఈ త్రైమాసికంలో 20.1 కోట్ల మంది తమ స్టోర్లను సందర్శించారని కంపెనీ తెలిపింది. డిజిటల్ కామర్స్, సరికొత్త కామర్స్ వ్యాపారాలు 38% పెరిగి ఆదాయంలో 18% వాటా అందించాయని పేర్కొంది. ‘సోస్యో, లోటస్ చాక్లెట్ కొనుగోళ్లతో పాటు ‘ఇండిపెండెన్స్’ బ్రాండ్ ఆవిష్కరణతో పోర్ట్ఫోలియో మరింత బలోపేతం అయిన’ట్లు రిలయన్స్ రిటైల్ పేర్కొంది.
రూ.20,000 కోట్ల సమీకరణ
హరిత ఇంధన ఉత్పత్తి నిమిత్తం గిగా ఫ్యాక్టరీల నిర్మాణంతో పాటు 5జీ సేవలు, రిటైల్ వ్యాపారాల విస్తరణ నిమిత్తం రూ.20,000 కోట్ల నిధులను ఎన్సీడీల జారీ ద్వారా సంస్థ సమీకరించనుంది. ఈ విభాగాలపై ఇప్పటికే పెట్టిన భారీ పెట్టుబడుల కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థూల రుణాలు ఏడాది క్రితంతో పోలిస్తే రూ.59,000 కోట్లు పెరిగి రూ.3,03,530 కోట్లకు చేరుకున్నాయి. నగదు నిల్వలు రూ.1,93,282 కోట్లుగా ఉన్నాయి. దీంతో నికర రుణాలు వార్షిక ఎబిటా కంటే తక్కువగా నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్మన్కు 25 ఏళ్ల జైలు శిక్ష
Sam Bankman Fried: క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఆర్థిక మోసాలు, అక్రమ నగదు చలామణి వంటి నేరాలకు పాల్పడ్డట్లు నవంబరులో తేల్చిన న్యూయార్క్ కోర్టు తాజాగా ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ