ఆరంభ లాభాలు ఆవిరి
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు ఆరంభ లాభాలను పొగొట్టుకున్నాయి. బ్యాంకింగ్, ఇంధన షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురవ్వగా.. వాహన షేర్లు మెరిశాయి.
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు ఆరంభ లాభాలను పొగొట్టుకున్నాయి. బ్యాంకింగ్, ఇంధన షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురవ్వగా.. వాహన షేర్లు మెరిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 28 పైసలు తగ్గి 81.70 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.7 శాతం నష్టంతో 87.57 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ లాభపడింది. చైనా మార్కెట్లు పనిచేయలేదు. ఐరోపా సూచీలు డీలాపడ్డాయి.
సెన్సెక్స్ ఉదయం 61,122.20 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 325 పాయింట్లు పెరిగిన సూచీ, 61,266.06 వద్ద గరిష్ఠాన్ని తాకింది. గరిష్ఠాల్లో లాభాల స్వీకరణ ఎదురు కావడంతో, ఒకదశలో 60,849.12 పాయింట్లకు పడిపోయింది. చివరకు 37.08 పాయింట్లు పెరిగి 60,978.75 వద్ద ముగిసింది. నిఫ్టీ ఎటువంటి మార్పులేకుండా 18,118.30 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,078.65- 18,201.25 పాయింట్ల మధ్య కదలాడింది.
నీ డిసెంబరు త్రైమాసిక ఫలితాలు మెప్పించకపోవడంతో యాక్సిస్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 2.50% నష్టపోయి రూ.910.05 వద్ద, గ్లాండ్ఫార్మా షేరు 1.48% తగ్గి రూ.1357 వద్ద, టాటా కమ్యూనికేషన్స్ షేరు 4.26% కోల్పోయి రూ.1324 వద్ద ముగిశాయి.
* మెరుగైన త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో పూనావాలా ఫిన్కార్ప్ 4.08% లాభపడి రూ.302.50 దగ్గర స్థిరపడింది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 15 లాభపడ్డాయి. టాటా మోటార్స్ 3.34%, మారుతీ 3.27%, హెచ్సీఎల్ టెక్ 1.47%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.35%, హెచ్డీఎఫ్సీ 0.92%, ఏషియన్ పెయింట్స్ 0.88% చొప్పున రాణించాయి. యాక్సిస్ బ్యాంక్ 2.50%, పవర్గ్రిడ్ 1.78%, టాటా స్టీల్ 1.35%, కోటక్ బ్యాంక్ 1.31%, ఎల్ అండ్ టీ 1.18%, ఎస్బీఐ 1.02%, సన్ఫార్మా 0.81% డీలాపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో.. లోహ 1.21%, ఆరోగ్య సంరక్షణ 1.01%, స్థిరాస్తి 0.95%, యుటిలిటీస్ 0.82%, విద్యుత్ 0.78%, యంత్ర పరికరాలు 0.75% పడ్డాయి. వాహన, ఐటీ, వినియోగ, మన్నికైన వినిమయ వస్తువులు 1.17% వరకు పెరిగాయి. బీఎస్ఈలో 2043 షేర్లు నష్టపోగా, 1482 స్క్రిప్లు లాభపడ్డాయి. 125 షేర్లలో ఎటువంటి మార్పులేదు.
* భారత్లో వ్యవసాయంపై దృష్టితో 18.2 మిలియన్ డాలర్ల మహిళా సాధికారత కార్యక్రమాన్ని పెప్సికో ఫౌండేషన్, కేర్ సంయుక్తంగా ప్రారంభించాయి. పశ్చిమ బెంగాల్లోని రెండు జిల్లాల్లో ‘షీ ఫీడ్స్ ది వరల్డ్’ కార్యక్రమం పేరిట దీన్ని ప్రారంభించిన సంస్థ, తర్వాత ఉత్తర ప్రదేశ్కు విస్తరించనుంది.
నేటి బోర్డు సమావేశాలు: డాక్టర్ రెడ్డీస్, సిప్లా, టాటా మోటార్స్, అమరరాజా బ్యాటరీస్, బజాజ్ ఆటో, ఇండియన్ బ్యాంక్, డీఎల్ఎఫ్, వీఎస్టీ, టాటా ఎలెక్సి, బ్లూడార్ట్, సియెట్, చెన్నై పెట్రో, డిక్సన్ టెక్నాలజీస్, ఈక్విటాస్ హోల్డింగ్స్, ఇంద్రప్రస్థ గ్యాస్, జ్యోతి ల్యాబ్స్, టీమ్లీజ్, టొరెంట్ ఫార్మా, వీఐపీ ఇండస్ట్రీస్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు