2024లో భారత్ వృద్ధి 6.7శాతం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రస్తుతం వెలిగిపోతోందని, వచ్చే ఏడాది 6.7 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆర్థికవేత్త హమీద్ రషీద్ వెల్లడించారు.
ఈ ఏడాది 5.8 శాతమే
ఐక్యరాజ్యసమితి ఆర్థికవేత్త హమీద్ రషీద్
ఐక్యరాజ్యసమితి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రస్తుతం వెలిగిపోతోందని, వచ్చే ఏడాది 6.7 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆర్థికవేత్త హమీద్ రషీద్ వెల్లడించారు. జి20 సభ్య దేశాలతో పోలిస్తే ఇదే అత్యధిక వృద్ధి రేటు అని పేర్కొన్నారు. ఈయన గ్లోబల్ ఎకనమిక్ మానిటరింగ్ బ్రాంచ్, ఆర్థిక విశ్లేషణ, విధాన విభాగం, యూఎన్ ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగాలకు అధిపతిగా వ్యవహరిస్తున్నారు. ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు-2023’ నివేదికను విడుదల చేసిన సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘2023లో భారత జీడీపీ వృద్ధి 5.8 శాతంగా నమోదు కావొచ్చు. అధిక వడ్డీ రేట్లు, అంతర్జాతీయ ఆర్థిక మందగమనం వంటివి దేశీయ పెట్టుబడులు, ఎగుమతులపై ప్రభావం చూపించొచ్చు. దక్షిణాసియా దేశాలు అత్యధిక సవాళ్లు ఎదుర్కొంటున్నా, భారత్లో ఆర్థిక వృద్ధి బలంగా ఉండనుంది. 2024లో 6.7 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. ప్రపంచంలో అత్యధిక వేగంతో వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ముందుంది. స్వల్పకాలంలో దేశీయ గిరాకీ బలంగా ఉండటంతో ఆర్థిక వ్యవస్థ బలమైన పునాదులు కలిగి ఉంద’ని హమీద్ రషీద్ వివరించారు.
* జి20 (గ్రూప్ ఆఫ్ 20)లో 19 దేశాలు (అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, యూఎస్)తో పాటు ఐరోపా సమాఖ్య ఉంది.
పేదరికమూ ఉంది!: భారత్లో స్థిరమైన వృద్ధి ఉన్నప్పటికీ గణనీయ సంఖ్యలో ప్రజలు పేదరికంలో జీవనం సాగిస్తున్నారని హమీద్ వెల్లడించారు. ఒకవేళ భారత్ గనుక ఈ వృద్ధి రేటును స్థిరంగా సాధించగలిగితే స్వల్ప కాలంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, అంతర్జాతీయంగా పేదరిక తగ్గింపునకు మంచిదని పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో భారత్లో నిరుద్యోగ రేటు 6.4 శాతానికి దిగి వచ్చిందని, ఇది దేశీయ గిరాకీ బలంగా ఉండటాన్ని సూచిస్తోందని ఆయన వివరించారు.
* ద్రవ్యోల్బణం కూడా క్రమంగా తగ్గుతోందని, ఈ ఏడాది 5.5 శాతం, 2024లో 5 శాతానికి పరిమితం కావొచ్చని అంచనా వేస్తున్నట్లు హమీద్ వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్య శ్రేణిలోనే ఉన్నందున, వడ్డీర్లేను మరింత పెంచక పోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
* భారత్ దిగుమతుల బిల్లు కూడా తగ్గుతోందని, ముఖ్యంగా ఇంధన దిగుమతి వ్యయం గత కొన్నేళ్లతో పోస్తే బాగా తగ్గిందని 2022, 2023లో వృద్ధి అవకాశాలు మెరుగవ్వడానికి ఇది కూడా దోహదం చేసిందని హమీద్ రషీద్ వెల్లడించారు.
* సమీప కాలంలో భారత్ వృద్ధి అవకాశాలపై అధిక వడ్డీ రేట్లు ప్రభావం చూపొచ్చని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ గిరాకీ నెమ్మదించడం కూడా భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది కలిగించొచ్చన్నారు. ఐరోపా, అమెరికాల్లో వృద్ధి రేటు నెమ్మదిస్తే భారత్కు నష్టం కలగొచ్చని తెలిపారు.
* ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2022లో అంచనా వేసిన 3 శాతం కంటే తక్కువ వృద్ధిని నమోదు కావొచ్చని, 2023లో ఇది 1.9 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇటీవల కొన్ని దశాబ్దాల్లోనే ఇది అత్యల్ప వృద్ధి రేటు అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇస్రో కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్ఈసీ ఇండస్ట్రీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) వినియోగించే జీఎస్ఎల్వీ మార్క్-3 లాంచ్ వెహికల్ కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్ (ఐటీఎస్)ను ఎస్ఈసీ ఇండస్ట్రీస్ రూపొందించింది. -
మూడో రోజూ ముందుకే
వరుసగా మూడో రోజూ దేశీయ సూచీలు రాణించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో టెలికాం, టెక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే చమురు ధరలు పెరగడానికి తోడు విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. -
మా ఉత్పత్తులపై నిషేధం లేదు
తమ అన్ని ఉత్పత్తులు భద్రమైనవి, అత్యంత నాణ్యమైనవని ఎవరెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్స్ తెలిపింది. ఈ సంస్థ ఎగుమతి చేస్తున్న స్పైస్-మిక్స్ ఉత్పత్తుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, కంపెనీ పై విధంగా స్పందించింది. -
బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు ‘అమరరాజా’ సహా 7 కంపెనీల బిడ్
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద బ్యాటరీ ప్లాంట్లు స్థాపించేందుకు అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సహా 7 కంపెనీల నుంచి బిడ్లు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
కాస్త దిగొచ్చిన బంగారం
ఇటీవలి గరిష్ఠాలతో పోలిస్తే బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొంతమేర చల్లారడం ఇందుకు కారణం. -
ఇండిగోలో ఇన్ఫ్లైట్ వినోదం
మే 1 నుంచి దిల్లీ-గోవా విమానాల్లో, తన యాప్ ద్వారా ఇన్-ఫ్లైట్ వినోద కంటెంట్ను విమానయాన సంస్థ ఇండిగో ఆవిష్కరించనుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ద్రవ్యోల్బణానికి వాతావరణ ముప్పు
దీర్ఘకాలం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం.. వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ముడి చమురు ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ బులెటిన్ అభిప్రాయ పడింది. -
ఇంటిపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు ఇండియన్ బ్యాంక్తో టాటా పవర్ భాగస్వామ్యం
నివాస గృహాల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు, టాటా వపర్ సోలార్ సిస్టమ్స్ ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
వచ్చే 6 నెలల్లో మ్యాజిక్పిన్లో 250 నియామకాలు
ఫ్యాషన్, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు.. ఇలా వివిధ విభాగాల్లో బ్రాండ్లు, వ్యాపార సంస్థల అన్వేషణకు ఉపయోగపడే ఇ-కామర్స్ సంస్థ మ్యాజిక్పిన్ వచ్చే ఆరు నెలల్లో 250 మందిని నియమించుకునే యోచనలో ఉంది. -
నేటి నుంచి నిఫ్టీ నెక్స్ట్50లో డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్
నిఫ్టీ నెక్స్ట్ 50 సూచీలో డెరివేటివ్ కాంట్రాక్టులను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) బుధవారం ప్రారంభించనుంది. -
సీపీ గుర్నానీ కంపెనీతో ఇంటర్గ్లోబ్ భాగస్వామ్యం
టెక్ దిగ్గజం సీపీ గుర్నానీకి చెందిన అసాగోతో, ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్యం కుదుర్చుకుని, కృత్రిమ మేధ (ఏఐ) వ్యాపార వెంచర్ ‘అలాన్ఓఎస్’ను ఏర్పాటు చేసింది. -
టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ లాభం రూ.212 కోట్లు
కన్జూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (టీసీపీఎల్) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.212.26 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది -
ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి అడుగులేస్తాం!
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి వ్యవహరిస్తామని, పుణె కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మధ్య స్థాయి ఐటీ సేవల కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సీఈఓ సందీప్ కల్రా వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు(8)
ఫోక్స్వ్యాగన్ తన స్పోర్ట్ వినియోగ వాహనం (ఎస్యూవీ) టైగన్లో రెండు కొత్త వేరియంట్లను విపణిలోకి విడుదల చేసింది. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది?
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్