స్థిరాస్తిలోకి రూ.64,000 కోట్ల పెట్టుబడులు
దేశంలో స్థిరాస్తి పెట్టుబడులు భారీగా ఊపందుకుంటున్నాయి. గత ఏడాది ఇవి జీవన కాల గరిష్ఠమైన 7.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ.64,000 కోట్లు)కు చేరాయని కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ దక్షిణాసియా నివేదిక వెల్లడించింది.
జీవన కాల గరిష్ఠానికి చేరిక
2022లో 32% పెరిగాయ్
సీబీఆర్ఈ దక్షిణాసియా నివేదిక
దిల్లీ: దేశంలో స్థిరాస్తి పెట్టుబడులు భారీగా ఊపందుకుంటున్నాయి. గత ఏడాది ఇవి జీవన కాల గరిష్ఠమైన 7.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ.64,000 కోట్లు)కు చేరాయని కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ దక్షిణాసియా నివేదిక వెల్లడించింది. భారత స్థిరాస్తి పెట్టుబడులు 2022 అక్టోబరు-డిసెంబరులో 2.3 బి.డాలర్లుగా నమోదయ్యాయి. త్రైమాసిక ప్రాతిపదికన 64 శాతం, వార్షిక ప్రాతిపదికన 115 శాతం ఇవి పెరిగాయని ‘ఇండియా మార్కెట్ మానిటర్ 2022’ పేరుతో రూపొందించిన నివేదికలో సీబీఆర్ఈ తెలిపింది. దీని ప్రకారం..
* 2022లో మొత్తం స్థిరాస్తి పెట్టుబడుల పరిమాణంలో విదేశీ పెట్టుబడిదార్లు 57 శాతం వాటాతో ముందున్నారు. కెనడా నుంచి విదేశీ నిధులు 37 శాతం వచ్చాయి. అమెరికా నుంచి 15 శాతం పెట్టుబడులు దేశీయ స్థిరాస్తి రంగంలోకి తరలివచ్చాయి.
* దేశీయ పెట్టుబడిదార్ల నుంచి 40 శాతం పెట్టుబడులు వచ్చాయి.
* మొత్తం పెట్టుబడుల్లో సంస్థాగత మదుపర్ల వాటా 51 శాతంగా ఉంది. డెవలపర్లు 32 శాతం పెట్టుబడులు పెట్టారు.
* దిల్లీ-ఎన్సీఆర్లో పెట్టుబడి కార్యకలాపాలు ఎక్కువగా జరిగాయి. తర్వాత స్థానంలో ముంబయి ఉంది. ఈ రెండు నగరాలు కలిపి 56 శాతం పెట్టుబడుల్ని ఆకర్షించాయి.
* భూమి, డెవలప్మెంట్ సైట్లలోకి అధికంగా 48 శాతం పెట్టుబడులు వచ్చాయి. కార్యాలయ విభాగంలోకి 35 శాతం నిధులు వచ్చాయి.
* ఇళ్ల నిర్మాణం/అభివృద్ధి కోసం స్థలం/భూమి కొనుగోలు కోసం 44 శాతం నిధులు వెచ్చించారు. మిశ్రమ వినియోగ డెవలప్మెంట్ కోసం 25 శాతం నిధులు చొప్పించారు.
* ‘స్థిరాస్తి రంగంలోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తరలి రావడం విశేషం. భారత స్థిరాస్తి రంగంలో వృద్ధికి ఉన్న అవకాశాలను ఇది సూచిస్తోంద’ని సీబీఆర్ఈ (ఇండియా, ఆగ్నేయాసియా, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా) ఛైర్మన్, సీఈఓ అన్షుమాన్ మాగజైన్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. -
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?