89% మంది చిన్న మదుపర్లకు నష్టాలే
గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఈక్విటీ ఫ్యూచర్స్, ఆప్షన్ల (ఎఫ్&ఓ) విభాగంలో ట్రేడ్ చేసిన చిన్న మదుపర్లలో 89 శాతం మంది నష్టాలనే చవిచూశారని సెబీ అధ్యయనం వెల్లడించింది.
ఈక్విటీ ఎఫ్&ఓ ట్రేడింగ్పై సెబీ అధ్యయనం
దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఈక్విటీ ఫ్యూచర్స్, ఆప్షన్ల (ఎఫ్&ఓ) విభాగంలో ట్రేడ్ చేసిన చిన్న మదుపర్లలో 89 శాతం మంది నష్టాలనే చవిచూశారని సెబీ అధ్యయనం వెల్లడించింది. అంటే ప్రతి 10 మందిలో తొమ్మిది మందికి నష్టాలేనన్నమాట. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని.. నష్టముప్పు నివారణకు సంబంధించి బ్రోకర్లు, ఎక్స్ఛేంజీలు చేపట్టాల్సిన అదనపు చర్యలపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని సెబీ పేర్కొంది. ఎప్పటికప్పుడు మదుపర్ల లాభ/నష్ట వివరాలను విశ్లేషించి, వెల్లడించడం ద్వారా.. మార్కెట్లో ఉన్న ముప్పుపై వాళ్లలో అవగాహన మరింత పెంచే అవకాశం ఉంటుందని సెబీ పేర్కొంది. కొవిడ్-19 ముందు ఆర్థిక సంవత్సరమైన 2018-19; కొవిడ్-19 పరిణామాల తదుపరి సంవత్సరమైన 2021-22లలో ఈక్విటీ ఎఫ్ఖీఓ విభాగంలో చిన్న మదుపర్లకు నికరంగా వచ్చిన లాభం లేదా నష్టం ఆధారంగా సెబీ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందుకోసం అత్యుత్తమ 10 మంది స్టాక్ బ్రోకర్లకు చెందిన మదుపర్ల ట్రేడింగ్ను పరిగణనలోకి తీసుకుంది. ఈ అధ్యయనం ప్రకారం..
* 2021-22లో ఈక్విటీ ఎఫ్ఖీఓలో 89 శాతం మంది చిన్న మదుపర్లు నష్టపోయారు. సగటున ఒక్కొక్కరి నష్టం రూ.1.1 లక్షలు. బాగా క్రియాశీలకంగా ఉండే ట్రేడర్లలో 90 శాతం మంది సగటున రూ.1.25 లక్షలు పోగొట్టుకున్నారు.
* కేవలం 11 శాతం మందే లాభాలు ఆర్జించారు. వీరి సగటు లాభం రూ.1.5 లక్షలు. క్రియాశీలకంగా ట్రేడ్ చేసే వారి విషయానికొస్తే.. లాభాలొచ్చిన వాళ్లు 10 శాతం మంది ఉండగా, సగటు లాభం రూ.1.9 లక్షలు.
* అత్యుత్తమ 10 బ్రోకరేజీ సంస్థల వద్ద ఈక్విటీ ఎఫ్ఖీఓ విభాగంలో ట్రేడ్ చేస్తున్న చిన్న మదుపర్ల సంఖ్య 2021-22లో 45.2 లక్షలుగా ఉంది. 2018-19లోని 7.1 లక్షల మందితో పోలిస్తే ఈ సంఖ్య 6 రెట్లకు పైగా పెరిగింది.
* ట్రేడింగ్ చేసే చిన్న మదుపర్లలో 30-40 ఏళ్ల వయస్సున్న వాళ్లే ఎక్కువ మంది. మొత్తం సంఖ్యలో వీళ్లు 39 శాతం. ఇక 20-30 ఏళ్ల వయస్సున్న వాళ్లు 36 శాతం మంది ఉంటారు. 2018-19లో వీళ్లు 11 శాతమే.
* 2018-19లోను, 2021-22లోనూ ఈక్విటీ ఎఫ్ఖీఓ ట్రేడింగ్ చేస్తున్న వాళ్లలో మగవాళ్లే ఎక్కువ (80%).
* 2021-22లో ఆప్షన్లలో ట్రేడ్ చేసిన చిన్న మదుపర్లు 98 శాతం మంది కాగా.. ఫ్యూచర్లలో ట్రేడ్ చేసిన వాళ్లు 11 శాతం మంది. 2018-19లో ఆప్షన్ల ట్రేడర్లు 89%, ఫ్యూచర్ల ట్రేడర్లు 43 శాతంగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!