Budget 2023: మధ్య తరగతికి తీపి కబురందేనా?
దేశంలో మధ్యతరగతి కుటుంబాలు పెరుగుతూనే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థపై స్పష్టమైన ప్రభావాన్ని చూపే స్థాయికి మధ్యతరగతి చేరింది. ప్రస్తుతం ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు మధ్యతరగతికి చెందిన వారుండగా.. వచ్చే పాతికేళ్లలో వీరి సంఖ్య రెట్టింపు కానుంది.
బడ్జెట్ 2023-24
దేశంలో మధ్యతరగతి కుటుంబాలు పెరుగుతూనే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థపై స్పష్టమైన ప్రభావాన్ని చూపే స్థాయికి మధ్యతరగతి చేరింది. ప్రస్తుతం ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు మధ్యతరగతికి చెందిన వారుండగా.. వచ్చే పాతికేళ్లలో వీరి సంఖ్య రెట్టింపు కానుంది. ఇంత కీలకమైన మధ్యతరగతి ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వాలు నెరవేర్చడం లేదనే నిరాశ ప్రతి బడ్జెట్ (Budget 2023) సమయంలోనూ వ్యక్తమవుతోంది.
మా సంపాదనపై కడుతున్న పన్ను భావ్యమేనా?
మధ్య తరగతి ప్రజలు ఎపుడూ చేసే ఫిర్యాదు ఏమిటంటే.. తాము సంపాదిస్తున్న మొత్తంతో పోలిస్తే, కడుతున్న పన్నుల శాతం ఎక్కువ అని. సంపన్నులతో పోలిస్తే తామే ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నామనే ఆవేదన వ్యక్తమవుతోంది. అసంఘటిత రంగంలో, తమకంటే ఎంతో ఎక్కువ సంపాదిస్తున్న వారు పైసా పన్ను చెల్లించకపోగా, ప్రభుత్వ రాయితీలు పొందుతుండటాన్ని ఎత్తి చూపుతున్నారు. సంపన్నులకేమో వేర్వేరు పన్ను రాయితీలూ లభిస్తున్నాయి. కానీ నెలవారీ ఖర్చులు గడవడమే, గగనమవుతున్న తమ సంపాదనపై పన్నులు అధికం కావడంతో పాటు, ఏ విధమైన ప్రభుత్వ సాయానికీ నోచుకోక, అనారోగ్యం వస్తే అప్పుల పాలవుతున్నామని చెబుతున్నారు.
పొదుపు తగ్గితే ఏమవుతుందంటే
దేశీయ గృహస్థుల పొదుపు 2021-22లో అయిదేళ్ల కనిష్ఠానికి చేరింది. స్థూలంగా వ్యక్తుల ఆర్థిక పొదుపు 2020-21లో 15.9 శాతంగా నమోదైంది. ధరలు పెరుగుతున్నందున, ఖర్చులకే సంపాదనలో అధికమొత్తం వెచ్చిస్తున్నందున, పొదుపు కాస్తా 2021-22 నాటికి 10.8 శాతానికి పరిమితమైంది. ‘పొదుపు తగ్గడం వల్ల, దిగువ మధ్య తరగతి ప్రజల ఆర్థిక స్థితి మరింత దిగజారుతుంద’ని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఏదైనా అత్యవసర ఖర్చు వస్తే, ఇంట్లోని బంగారు ఆభరణాలు తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం, లేదా చిన్నపాటి ఆస్తులను అమ్ముకోవడమే వీరికి దిక్కవుతోంది.
దిగువ మధ్యతరగతిపైనే భారమంతా: రఘురామ్ రాజన్
‘కొవిడ్ సమయంలో ఎగువ మధ్య తరగతి ప్రజలు (సంస్థల నిర్వాహకులు, ఉన్నతాధికారులు) ఇంటి నుంచే పని చేసి సంపాదించారు. అయితే నేరుగా వెళ్లి పనిచేయాల్సిన దిగువ మధ్యతరగతి ప్రజలు, ఏమీ చేయలేకపోయారు. పని చేయనందున, ఇలాంటి వారికి ప్రైవేటు కంపెనీలు జీతాలు చెల్లించలేదు. అదే పేదలుగా నమోదైన వారికి, ఆహారం విషయంలో ఇబ్బంది లేకుండా కేంద్రం రేషన్ ఉచితంగా అందజేసింది. ఎటువంటి సాయం అందక దిగువ మధ్య తరగతి ప్రజలే ఎక్కువ బాధలు పడ్డారు, పడుతున్నారు. అందుకే వారిపైనే ఎక్కువ దృష్టి సారించాల’ని ఆర్బీఐ పూర్వ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచిస్తున్నారు.
వినియోగం తగ్గుతోంది..
మధ్యతరగతి వర్గాల వినియోగం పెరిగితేనే, దేశాన్ని ‘నిజమైన అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ’గా తీర్చిదిద్దొచ్చని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఇటీవల చూస్తే ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలు భారీగా ఉద్యోగ కోతలకు పాల్పడుతున్నాయి. ఇలా బాధితులవుతున్న వారిలో ఎక్కువమంది మధ్యతరగతి వారే. గ్రామీణ రైతుల స్థితీ ఇంతే. మధ్యతరగతిలోని అన్ని వృత్తుల వారికీ మేలు చేయాల్సిన బాధ్యత బడ్జెట్ (Budget 2023)పై ఉంది.
ఇవి అవసరం
‘అసంఘటిత రంగంలో గిరాకీని పెంచాలి. ఫలితంగా మందగమనం పాలవుతున్న సంస్థాగత రంగం వేగంగా పుంజుకుంటుంది. ఇందు కోసం జీఎస్టీని సంస్కరించాలి. పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశ పెట్టడంతో పాటు, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అధిక కేటాయింపులు జరగాలి’ అని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.
* మధ్యతరగతిపై కొత్త పన్నులు విధించబోవడం లేదని ఆర్థిక మంత్రి హామీనిచ్చారు. అయితే పన్ను మినహాయింపు పరిమితి, స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలనే డిమాండ్ అత్యధికుల నుంచి వస్తోంది.
* డిపాజిట్లు, బాండ్లు, గృహ రుణం, పీపీఎఫ్ వంటి పెట్టుబడులపై వర్తించే మినహాయింపు పరిమితిని పెంచాలని; మూలధన పన్ను నిబంధనలను సరళీకరించడంతో పాటు వైద్య-జీవిత బీమా ప్రీమియానికి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని కోరుకుంటున్నారు.
సమస్యలు పరిష్కరిస్తేనే..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం ‘నేనూ మధ్య తరగతి వ్యక్తినే. ఈ వర్గం ప్రజలపై ఉండే ఒత్తిళ్లు నాకూ తెలుసు. వాటిని అర్థం చేసుకోగలన’నని ఇటీవల పేర్కొన్నారు. ఇందువల్ల వచ్చే బడ్జెట్ (Budget 2023)లో ఏవైనా ప్రయోజనాలు కల్పిస్తారా.. అనే ఆకాంక్ష మధ్యతరగతి నుంచి వ్యక్తమవుతోంది.
బడ్జెట్పై మరిన్ని కథనాల కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య