హిండెన్బర్గ్పైౖ న్యాయ పరమైన చర్యలకు చూస్తున్నాం
అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్బర్గ్పై న్యాయపరమైన చర్యలు చేపట్టడానికి గల అవకాశాలను చూస్తున్నట్లు అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
అదానీ గ్రూప్
దిల్లీ
అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్బర్గ్పై న్యాయపరమైన చర్యలు చేపట్టడానికి గల అవకాశాలను చూస్తున్నట్లు అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అదానీ గ్రూప్, తమ కంపెనీల షేర్ల విలువలు పెంచడంలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతా పుస్తకాల్లోనూ మోసాలు చేస్తోందని ఆరోపిస్తూ హిండెన్బర్గ్ నివేదిక వెలువరించింది. ఈ నివేదిక అదానీ గ్రూప్, వాటాదార్లు, మదుపర్లపై ప్రతికూల ప్రభావం చూపిందని, భారత పౌరుల్లో అనవసర భయాలను సృష్టించిందని అదానీ గ్రూప్ లీడ్ హెడ్ జతిన్ జలుంధ్వాలా పేర్కొన్నారు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువలపై ప్రతికూల ప్రభావం పడేలా, నివేదికలోని అంశాలను రూపొందించారని, ఇందుకోసం నిరాధార అంశాలను పొందుపర్చారని తెలిపారు. పెట్టుబడిదార్ల సమూహాన్ని, అదానీ గ్రూప్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఒక విదేశీ సంస్థ చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నం బాధ కలిగించిందని వెల్లడించారు. భారత, అమెరికా చట్టాల ప్రకారం చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. అదానీ గ్రూప్ ప్రధాన సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.20,000 కోట్ల ఎఫ్పీఓ (ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్) ఈనెల 27న ప్రారంభం కానున్న నేపథ్యంలో, దానికి ఆదరణ దక్కకూడదనే ఉద్దేశంతోనే హిండెన్బర్గ్ ఇలా చేసిందని పేర్కొన్నారు.
* కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారే కానీ, హిండెన్బర్గ్పై అదానీ గ్రూప్ దావా వేసే ఆలోచనలు ఉన్నట్లు సంస్థ ప్రకటన స్పష్టం చేయలేదు.
ఒకరోజులో రూ.48,000 కోట్ల నష్టం
హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ కంపెనీల షేర్లు బుధవారం ఒక్కరోజే 3-8 శాతం కుదేలయ్యాయి. ఫలితంగా బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీలో గౌతమ్ అదానీ సంపద విలువ 6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.48,600 కోట్లు) తగ్గింది. ప్రస్తుతం 113 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానంలో అదానీ ఉన్నారు.
అజర్ బైజాన్లో అదానీ పెట్టుబడులు
అజర్బైజాన్లో పెట్రోరసాయనాలు, గనుల ప్రాజెక్టులను దక్కించుకోవాలని అదానీ గ్రూప్ చూస్తోంది. భారత వెలుపల కూడా వ్యాపారాన్ని విస్తరించాలని సంస్థ భావిస్తోంది. గతవారం దావోస్లో అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియెవ్తో జరిగిన భేటీలో, అదానీ ఈ ప్రణాళికలపై చర్చించారని అధ్యక్షుడి కార్యాలయం తెలిపింది.
అదానీ గ్రూప్పై నివేదికకు కట్టుబడి ఉన్నాం: హిండెన్బర్గ్
న్యాయపరమైన చర్యలు చేపట్టే మార్గాలు పరిశీలిస్తున్నట్లు, అదానీ గ్రూప్ హెచ్చరించిన నేపథ్యంలో హిండెన్బర్గ్ స్పందించింది. అదానీ గ్రూప్పై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని, ఇందుకు ఆధారాలుగా తమ వద్ద పలు పత్రాలు ఉన్నాయని గురువారం స్పష్టం చేసింది. నివేదికలో తాము సూటిగా వేసిన 88 ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా అదానీ గ్రూప్ సమాధానం ఇవ్వలేదని వెల్లడించింది. ‘నివేదిక విడుదల చేసి 36 గంటలు గడిచినా, కంపెనీ పారదర్శకంగా ఉందని చెప్పడానికి అడిగిన 88 ప్రశ్నల్లో ఒక్కదానికీ సమాధానం ఇవ్వలేదు’ అని హిండెన్బర్గ్ పేర్కొంది. తమపై ఏ న్యాయపరమైన చర్యకు ప్రయ త్నించినా, అది సఫలం కాదని అభిప్రాయపడింది. అదానీ గ్రూప్ కనుక అమెరికా కోర్టులో దావా వేస్తే, ఆ కంపెనీకి చెందిన మరిన్ని పత్రాలు ఇమ్మని కోరతామని తేల్చి చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం