Adani Stocks: అదానీ మదుపర్లు లబోదిబో
అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు...అదానీ గ్రూపు షేర్లను కుదిపేస్తున్నాయి. శుక్రవారం మరో 5- 20% వరకు ఇవి పతనమయ్యాయి.
గ్రూపు కంపెనీల షేర్లకు హిండెన్బర్గ్ ఆరోపణల సెగ
శుక్రవారం 5- 20% వరకు పతనం
రెండు రోజుల్లోనే రూ.4.17 లక్షల కోట్ల మార్కెట్ విలువ ఆవిరి
స్టాక్ మార్కెట్లపైనా ప్రభావం
ప్రపంచ కుబేరుల జాబితాలో ఏడో స్థానానికి దిగొచ్చిన గౌతమ్!
అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు...అదానీ గ్రూపు షేర్లను కుదిపేస్తున్నాయి. శుక్రవారం మరో 5- 20% వరకు ఇవి పతనమయ్యాయి. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని.. ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్బర్గ్ నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలు నిరాధారమైనవని, తమ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఈ నివేదికను విడుదల చేశారని అదానీ గ్రూపు వివరణ ఇచ్చింది. అయినప్పటికీ శుక్రవారమూ షేర్ల పతనం ఆగలేదు. దీంతో రెండో రోజుల్లోనే అదానీ గ్రూపునకు చెందిన నమోదిత కంపెనీల షేర్ల మొత్తం మార్కెట్ విలువ రూ.4.17 లక్షల కోట్ల మేర ఆవిరైంది. హిండెన్బర్గ్ ఆరోపణల ప్రభావం నిన్న ప్రారంభమైన అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.20,000 కోట్ల మలి విడత పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ) పైనా పడింది. అదానీ గ్రూపు షేర్ల పతనంతో.. దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు రోజులుగా నష్టాలను చవిచూస్తున్నాయి. నివేదికలో అదానీ గ్రూపు రుణాల వ్యవహారానికి సంబంధించిన ఆరోపణలు ఉండటంతో బ్యాంకింగ్ షేర్లు డీలాపడటం సూచీల నష్టాలకు ఆజ్యం పోసిందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు అదానీ గ్రూపుపై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై సెబీ, ఆర్బీఐలు దర్యాప్తు చేసి వాస్తవాలను బయటపెట్టాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ డిమాండు చేస్తున్నారు.
100 బి.డాలర్ల దిగువకు గౌతమ్ సంపద
గౌతమ్ అదానీ సంపద ఈ ఏడాది ప్రారంభం నుంచి తగ్గుతూ వస్తోంది. హిండెన్బర్గ్ నివేదిక అనంతరం ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యింది. హిండెన్బర్గ్ నివేదిక వెల్లడైన బుధవారం నాడు షేర్ల పతనంతో బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీలో గౌతమ్ అదానీ సంపద విలువ దాదాపు 6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.48,600 కోట్లు) తగ్గి 113 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. శుక్రవారమూ షేర్లకు భారీ నష్టాలు కొనసాగడంతో ఆయన సంపద 100 బి.డాలర్ల దిగువకూ వచ్చింది. బుధవారం నాటితో పోలిస్తే 15% పతనమైంది. దీంతో ఫోర్బ్స్ రియల్టైం ప్రపంచవ్యాప్త శ్రీమంతుల జాబితాలో ఏడో స్థానానికి ఆయన దిగివచ్చినట్లు తెలుస్తోంది.
ఆరోపణలపై స్పందన సంతృప్తినివ్వలేదా!
హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై అదానీ గ్రూపు ఇచ్చిన వివరణ మదుపర్లకు సంతృప్తినివ్వలేదనే విషయం.. శుక్రవారం నాటి షేర్ల పతనంతో అర్థం చేసుకోవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే గతంలోనూ అదానీ గ్రూపు భారీ రుణ భారంపై ఫిచ్ గ్రూప్నకు చెందిన క్రెడిట్సైట్స్ లాంటి సంస్థలు కూడా ఆందోళనలు వెలిబుచ్చాయి. అటు అదానీ గ్రూపు కూడా వాటిని ఖండించుకుంటూనే వస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా హిండెన్బర్గ్ కూడా అదే తరహా ఆరోపణలు చేయడంతో.. మదుపర్లు ఈ వ్యవహారంపై అదానీ గ్రూపు నుంచి పూర్తి స్పష్టతను కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. అదే రెండో రోజూ షేర్ల పతనానికి దారి తీసిందని విశ్లేషిస్తున్నారు. దీనిపై సెబీ ఎలా స్పందిస్తుందోనని కూడా మదుపర్లు గమనిస్తున్నారు. ఒకవేళ అదానీ గ్రూపు షేర్ల పతనం మున్ముందూ కొనసాగితే.. ఆ ప్రభావం మార్కెట్పై ఉండకపోవచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సూచీల్లో పటిష్ఠమైన మూలాలున్న కంపెనీలు ఉండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. అయితే రుణాలపై ఆందోళనలకు కంపెనీ నుంచి సరైన సమాధానం రాకుంటే.. బ్యాంకింగ్ షేర్లకు ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు అమ్మకాల ఒత్తిడి కొనసాగొచ్చని, ఆ ప్రభావం మార్కెట్పైనా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
గతంలోనూ ఇదే తరహా నివేదికలు
ప్రపంచవ్యాప్తంగా కంపెనీల్లో జరిగే అవకతవకలను, మోసాలను గుర్తించేందుకు ఒక ‘ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ పరిశోధన’ కంపెనీని 2017లో నాథన్ అండర్సన్ ఏర్పాటు చేసి.. దానికి హిండెన్బర్గ్ రీసెర్చ్గా నామకరణం చేశారు. ఈ సంస్థ తన పరిశోధనల ఆధారంగా షార్ట్ సెల్లింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తుంటుంది. అంతకుముందు లార్డ్స్టోన్ మోటార్స్ కార్ప్ (యూఎస్), కండి (చైనా), నికోలా మోటార్ కంపెనీ (యూఎస్), క్లోవర్ హెల్త్ (యూఎస్), టెక్నోగ్లాస్ (కొలంబియా)లపైనా ఇదే తరహా అవకతవకలను గుర్తించి షార్ట్ సెల్లింగ్ చేసింది. ఇప్పుడు తాజాగా అదానీ గ్రూపుపై అవకతవకలు ఆరోపణలు చేసి భారత స్టాక్ మార్కెట్లో కలకలం సృష్టిస్తోంది.
టీ+1 సెటిల్మెంట్ విధానం అమల్లోకి
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం నుంచి పూర్తిగా టీ+1 సెటిల్మెంట్ విధానంలోకి మారాయి. టీ+1 సెటిల్మెంట్ వ్యవస్థ వల్ల మదుపర్లు షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు జరిపిన తర్వాత ఖాతాలోకి షేర్లు/నిధులు వేగంగా జమవుతాయి. మదుపర్లు ఎక్కువ లావాదేవీలు నిర్వహించుకునే సౌలభ్యం కలుగుతుంది. టీ+1 సెటిల్మెంట్తో లావాదేవీ జరిగిన ఒకరోజులోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పటివరకు టీ+2 సెటిల్మెంట్ పద్ధతి అమలవుతోంది. జనవరి 27 నుంచి అన్ని లావాదేవీల సెటిల్మెంట్ టీ+1 పద్ధతిలో పూర్తిచేయనున్నట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది.
* ఫిబ్రవరి 1 నుంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు టీ+2 సెటిల్మెంట్ వ్యవస్థకు మారనున్నాయి. ప్రస్తుతం రెడెమ్షన్ ప్రక్రియ పూర్తయిన 3 రోజుల్లోగా మదుపర్ల బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు బదిలీ అవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా