సంక్షిప్త వార్తలు(3)
జెన్ టెక్నాలజీస్ ఆకర్షణీయమైన ఫలితాలను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఈ సంస్థ రూ.34.84 కోట్ల ఆదాయాన్ని, రూ.7.58 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది.
జెన్ టెక్నాలజీస్కు రూ.7.58 కోట్ల లాభం
ఈనాడు, హైదరాబాద్: జెన్ టెక్నాలజీస్ ఆకర్షణీయమైన ఫలితాలను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఈ సంస్థ రూ.34.84 కోట్ల ఆదాయాన్ని, రూ.7.58 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. త్రైమాసిక ఈపీఎస్ రూ.0.95గా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.13.33 కోట్లు, నికరలాభం రూ.11.83 లక్షలుగా ఉన్నాయి. వీటితో పోల్చితే ప్రస్తుత త్రైమాసికంలో ఆదాయం, నికరలాభం భారీగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలానికి జెన్ టెక్నాలజీస్ ఆదాయం రూ.94.15 కోట్లు, నికరలాభం రూ.20.36 కోట్లకు చేరుకున్నాయి. గత నెలాఖరు నాటికి కంపెనీ చేతిలో రూ.404 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి.
52% పెరిగిన డీసీబీ బ్యాంక్ లాభం
దిల్లీ: ప్రైవేటు రంగ డీసీబీ బ్యాంక్ డిసెంబరు త్రైమాసికంలో రూ.114 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే సమయంలో బ్యాంకు ఆర్జించిన నికర లాభం రూ.75 కోట్లతో పోలిస్తే ఇది 52 శాతం అధికం. మొత్తం ఆదాయం రూ.463 కోట్ల నుంచి రూ.541 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం రూ.345 కోట్ల నుంచి రూ.446 కోట్లకు చేరింది. ఆస్తుల నాణ్యత విషయానికొస్తే స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్పీఏలు) 4.78 శాతం నుంచి 3.62 శాతానికి మెరుగయ్యాయి. నికర ఎన్పీఏలు 2.55 శాతం నుంచి 1.37 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 16.26 శాతానికి చేరింది.
సంక్షిప్తంగా
* బీఎండబ్ల్యూ ఇండియా.. సరికొత్త బీఎండబ్ల్యూ ఎక్స్1 స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ (ఎస్ఏవీ)ను దేశీయంగా విడుదల చేసింది. పెట్రోల్ వేరియంట్ ధర రూ.45.90 లక్షలు కాగా, డీజిల్ వాహనం ధర రూ.47.90 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధరలు). బీఎండబ్ల్యూ డీలర్షిప్ నెట్వర్క్, షాప్.బీఎండబ్ల్యూ.ఇన్లో బుకింగ్లు చేసుకోవచ్చు. డీజిల్ వాహనాలను మార్చి నుంచి, పెట్రోల్ వాహనాలను జూన్ నుంచి డెలివరీ చేస్తారు.
* ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్లపై వినియోగదార్లు చేసే ఫిర్యాదుల పరిశీలనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీలు (జీఏసీలు) మార్చి 1 నుంచి పని చేస్తాయని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
* యూకే ఎయిర్లైన్ ఫ్లైబి మూడేళ్లలో రెండోసారి దివాలా ప్రక్రియను ఎదుర్కొంటోంది. 2020 మార్చిలో ఒకసారి దివాలా తీసిన ఈ ఎయిర్లైన్స్, గతేడాది ఏప్రిల్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. మళ్లీ తాజాగా దివాలా తీసింది.
* హై-టెక్ పైప్స్ డిసెంబరు త్రైమాసికంలో రూ.13.02 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.10.16 కోట్లతో పోలిస్తే ఇది 28% అధికం.
* అధిక నాణ్యత కలిగిన సముద్ర డీజిల్ ఇంజిన్లను రాంచీ ప్లాంటులో తయారు చేసేందుకు రక్షణ పీఎస్యూ గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ), జర్మనీకి చెందిన రోల్స్ రాయిస్ సొల్యూషన్స్తో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్