చందాతో కారు షికారు
కారు సొంతం కావాలంటే ఇకపై కొనాల్సిన పనిలేదు.. చందాదారుగా చేరి నచ్చిన కారులో షికారు చేయవచ్చు అంటున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు.
2023లో వాహన రంగంలో కొత్త ధోరణులు
ఈవీలకు కలిసిరావొచ్చంటున్న నిపుణులు
కారున్న కుటుంబాల జాతీయ సగటు 7.5 శాతమే
సబ్స్క్రిప్షన్తో మార్కెట్ను పెంచుకునే దిశగా సంస్థలు
ఈనాడు - హైదరాబాద్
కారు సొంతం కావాలంటే ఇకపై కొనాల్సిన పనిలేదు.. చందాదారుగా చేరి నచ్చిన కారులో షికారు చేయవచ్చు అంటున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు. నచ్చిన కొత్త కారు కొనేందుకు తగిన ఆర్థిక వెసులుబాటు లేక.. నిర్ణయాలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటారు. ఇలాంటివారు ఇకపై చందాకట్టి కారును ఇంటికి నడపుకుంటూ వెళ్లవచ్చు అని చెబుతున్నారు. కొవిడ్కు ముందు సర్వీస్ ప్రొవైడర్లు మొదలెట్టిన సబ్స్క్రిప్షన్ విధానం.. కొత్త సంవత్సరంలో మార్కెట్లోకి బాగా విస్తరించే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు అంటున్నారు.
కారు ఉండడం ఇదివరకు విలాసమైతే... ఇప్పుడు చాలామందికి అవసరంగా మారింది. హైదరాబాద్లో 20 నుంచి 50 కి.మీ.దూరంలోని పని ప్రదేశాలకు అధికాదాయ వర్గాలు కారులోనే వెళుతున్నారు. మధ్యతరగతి వర్గాలు వారాంతంలో మాత్రమే కారును బయటికి తీస్తున్నాయి. ఇప్పటికీ ప్రతి వందలో ఏడు కుటుంబాలే కారును కల్గి ఉన్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(2019-21) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో ఆరు కుటుంబాలకే కారు యోగ్యం ఉంది. హైదరాబాద్లో దీనికి రెట్టింపు కుటుంబాలు కార్లను కల్గి ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా 80 శాతం కుటుంబాలు కార్లకు దూరంగా ఉన్నాయి. ఆర్థికంగా కారు కొనేంత వెసులుబాటు లేకపోవడంతో వీరంతా కారుకు దూరంగా ఉన్నారు. ఆటోమొబైల్ కంపెనీలు వీరిని లక్ష్యంగా పథకాలతో ముందుకొస్తున్నాయి. ఇన్వెంటరీని వదిలించుకునేందుకు కూడా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చిందే సబ్స్క్రిప్షన్ మోడల్. కార్ల విక్రయాల్లో అత్యధిక వాటా కలిన మారుతీ సుజుకీనే సబ్స్క్రిప్షన్ మోడల్ను ప్రోత్సహిస్తోంది. దీంతో కారు యోగం మరింత మందికి పట్టనుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. విద్యుత్తు వాహనాలు కొనాలని చూస్తున్నా.. ఖరీదు కావడంతో వెనకడుగు వేస్తున్నారు. చందా విధానంలో వీటి విక్రయాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
నెలవారీ రుసుముతో..
ప్రస్తుతం మనవాళ్లు ఎక్కువగా ఎస్యూవీలు కొంటున్నారు. హ్యాచ్బ్యాక్లు, సెడాన్లను ఇష్టపడేవారు ఉన్నారు. వీటిలో దేనికైనా నెలవారీ చందా చెల్లించి ఇంటికి తీసుకెళ్లవచ్చు. కొత్తకారు కొనాలంటే సాధారణంగా డౌన్పేమెంట్ కొంత చెల్లించి.. మిగతా మొత్తం రుణం తీసుకుంటుంటారు. ఆ తర్వాత బీమా, రిజిస్ట్రేషన్ ఛార్జీలు తడిసి మోపెడవుతుంది. రూ.10 లక్షల విలువైన కారు కొంటే ఏడాది పూర్తి బీమా, మూడేళ్లు థర్డ్పార్టీ బీమాతో పాటూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కలిపి రెండు లక్షలు అవుతున్నాయి. కారు ధర కంటే పన్నులే ఎక్కువ అ‘ధర’గొడుతున్నాయి. అంత వెచ్చించే స్థోమత లేక కొంతమంది వెనక్కి తగ్గుతున్నారు. సబ్స్క్రిప్షన్ విధానంలో నచ్చిన కారును ఎంపిక చేసుకుని.. నెలవారీ చందా మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఎంపిక చేసుకున్న కాలవ్యవధి వరకు కారు మీ వద్దే ఉంటుంది. దానికి యాజమాని కూడా మీరే అంటున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు. డౌన్పేమెంట్ కోసం వెతుక్కుకోవాల్సిన పనిలేదు. బ్యాంకు రుణం తీసుకుని నెలవారీ ఈఎంఐ చెల్లించాల్సిన అవసరమే కాదు. నేరుగా ఆయా కంపెనీలకే చందా చెల్లిస్తే సరిపోతుంది.
ఎప్పటికప్పుడు కొత్త కారు..
ఆటోమొబైల్ రంగంలో పోటీ పెరగడంతో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. రెండు మూడేళ్లలో అప్గ్రేడ్ చేస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులు మూడు నాలుగేళ్లకే మోడల్ను మారుస్తున్నారు. చాలామంది స్థోమత లేక పాత మోడల్ కారునే నడిపిస్తున్నారు. చందా విధానంలో 12 నెలల నుంచి 48 నెలల కాలంలో అనువైన దాన్ని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి 24 నెలలకు చందాదారుడిగా చేరి.. గడువు తర్వాత నచ్చిన మరో కారును ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే పాతగడువును పొడిగించుకోవచ్చు. మీ దగ్గర ఉన్నంత కాలమే చందా చెల్లిస్తారు. రూ.13,000 నుంచి చందాలు మొదలవుతాయి. ఆటోమొబైల్ సంస్థలే కాదు ఏఎల్డీ, ఆటోమోటివ్, మైల్స్, ఓరిక్స్ వంటి సబ్స్క్రిప్షన్ అందిస్తున్న సంస్థల్లో చేరి చందాదారుగా మారవచ్చు.
* కొత్త కారు కొంటే ఏడాదిలో రూ.లక్ష దాకా వాహన విలువ తగ్గుతుంది. బీమా, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కలుపుకుంటే ఇంకా ఎక్కువ. అదే చందా విధానంలో నెలకు రూ.14,000.. అంటే ఏడాదికి రూ.1.60 లక్షలతో కారును ఏడాది పాటూ నడుపుకోవచ్చు.
* డ్రైవింగ్ లైసెన్స్తో పాటూ బ్యాంకు రుణం తీసుకునే సమయంలో ఎలాంటి పత్రాలు అడుగుతారో వాటిని తీసుకెళ్లాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓపెన్ ఏఐకి భారత్లో తొలి ఉద్యోగి.. ఎవరీ ప్రగ్యా మిశ్రా?
OpenAI: చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ప్రగ్యా మిశ్రాను తన తొలి ఉద్యోగిగా నియమించింది. -
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 599, నిఫ్టీ 151 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
నారాయణమూర్తి మనవడు జాక్పాట్ కొట్టాడు. ఇన్ఫీ ప్రకటించిన డివిడెండ్తో ఒక్క రోజులోనే రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది
తాజా వార్తలు (Latest News)
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ