పెద్ద సినిమాలా.. ఆచితూచి కొందాం!
టీవీల్లో సినిమాలు చూసేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని మింట్ నివేదిక వెల్లడించింది. థియేటర్లలో సరిగా ఆడని సినిమాలను టీవీ బ్రాడ్కాస్టర్లు కొనుగోలు చేసి ప్రదర్శించినా కూడా, చూస్తున్న వారి సంఖ్య పెద్దగా ఉండటం లేదని తెలిపింది.
టీవీ బ్రాడ్కాస్టర్ల తీరుపై మింట్ నివేదిక
టీవీల్లో సినిమాలు చూసేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని మింట్ నివేదిక వెల్లడించింది. థియేటర్లలో సరిగా ఆడని సినిమాలను టీవీ బ్రాడ్కాస్టర్లు కొనుగోలు చేసి ప్రదర్శించినా కూడా, చూస్తున్న వారి సంఖ్య పెద్దగా ఉండటం లేదని తెలిపింది. దేశీయంగా థియేటర్లలో కోట్ల రూపాయల వర్షం కురిపించిన కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్ వంటి సూపర్ హిట్ సినిమాలను కూడా టీవీల్లో చూసిన ప్రేక్షకుల సంఖ్య ఆ స్థాయిలో లేదని పేర్కొంది. అందువల్ల భారీ బడ్జెట్లతో కూడిన పెద్ద సినిమాలను కొనుగోలు చేసేందుకు టీవీ బ్రాడ్కాస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని మింట్ నివేదిక తెలిపింది.
కారణమిదీ
స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లకు అధికశాతం మంది ప్రేక్షకులు మారుతున్నారు. తమకు అనువైన సమయంలో, ప్రకటనలు లేకుండా, సినిమాలు చూసే అవకాశం ఉండటంతో ప్రజలు వాటివైపు అధికంగా మొగ్గు చూపుతున్నారని గోల్డ్మైన్స్ టెలీఫిల్మ్స్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ మనీశ్ షా వెల్లడించారు. కంటెంట్ బాగుంటే, ఏ భాషా చిత్రాన్ని అయినా, సబ్టైటిల్స్ సాయంతో చూస్తున్న యువత సంఖ్యా అధికంగా ఉంటోంది. పెద్ద స్టార్లు లేని, తక్కువ బడ్జెట్తో నిర్మిస్తున్న చిన్న సినిమాలను, మరింత తక్కువ ధరలకే బ్రాడ్కాస్టర్లకు నిర్మాతలు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో, భారీ బడ్జెట్తో నిర్మించి, థియేటర్లలో ఆదరణ పొందని పెద్ద సినిమాలను, తక్కువ ధరలకే టీవీ బ్రాడ్కాస్టర్లకు అమ్ముకోవాల్సి వస్తోందని నిర్మాతలు చెబుతున్నారని ఆ నివేదిక విశ్లేషించింది.
ప్రకటనల ఆదాయమూ తగ్గుతోంది
ఈ సంక్షోభం కొవిడ్-19 మహమ్మారికి ముందే వచ్చింది. తర్వాత పరిస్థితులు మరింత దయనీయంగా మారిపోయాయి. ‘83’, ‘ధాకడ్’ వంటి పెద్ద సినిమాలు బాక్సాఫీసును మెప్పించలేకపోయాయి. దీంతో టీవీ బ్రాడ్కాస్టర్లు సైతం వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. గత కొన్నేళ్లుగా టీవీ ఛానెళ్లలో సినిమాలు చూసే వారి సంఖ్య (వ్యూయర్షిప్) తగ్గుతున్నందున, ప్రకటనల ఆదాయం కూడా 40 శాతం మేర తగ్గిందని మింట్ నివేదిక వివరించింది.
* కొవిడ్ ముందుతో పోలిస్తే, టీవీ బ్రాడ్కాస్టర్లు కొనుగోలు చేస్తున్న సినిమాల రేట్లు సగానికి తగ్గినట్లు ఆ నివేదిక పేర్కొంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, ఈ ఏడాదిలో చాలా సినిమాలను టీవీ బ్రాడ్కాస్టర్లు కొనే అవకాశం కూడా ఉండదని తెలుస్తోంది.
* పెద్ద సినిమాల శాటిలైట్ హక్కులు గతంలో రూ.50 కోట్ల వరకు ఉండేవి. కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్ వంటి బాక్సాఫీస్ హిట్ సినిమాలను సైతం టీవీల్లో ప్రదర్శించినపుడు వ్యూయర్షిప్ ఆశించిన మేర నమోదు కాకపోవడంతో, ఇప్పుడు పెద్ద సినిమాల శాటిలైట్ హక్కులు రూ.25-30 కోట్లకు పరిమితమయ్యాయని మింట్ వివరించింది.
* చిన్ని సిమాలను ఓటీటీ ప్లాట్ఫామ్లపై నేరుగా విడుదల చేస్తుండటంతో, వాటిని కొనుగోలు చేసేందుకు టీవీ బ్రాడ్కాస్టర్లు చాలా తక్కువ మంది ముందుకొస్తున్నారు. శాటిలైట్ విభాగ ఆదాయం అనేది భవిష్యత్లో నిర్మాతలకు గొప్ప ఆదాయ వనరుగా కనిపించడం లేదని ట్రేడ్ అనలిస్ట్ శ్రీధర్ పిళ్లై వెల్లడించారు. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు కనీసం నెల వరకూ టీవీల్లో సినిమాలు రాకూడదని డిమాండ్ చేస్తుండటంతో, ఆ తర్వాత టీవీల్లో వచ్చినా చూసే వారి సంఖ్య బాగా తగ్గిపోతోంది. దీంతో ప్రకటనల ఆదాయం కూడా గణనీయంగా పడిపోతోందని ఆయన వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’