సంక్షిప్త వార్తలు (3)
వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో కొత్తగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈలు)ను ప్రైవేటీకరించే అవకాశం లేదని తెలుస్తోంది.
కొత్తగా సీపీఎస్ఈల ప్రైవేటీకరణ ఉండకపోవచ్చు!
గతంలో ప్రకటించిన వాటినే 2023-24లో పూర్తి చేయొచ్చు
దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో కొత్తగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈలు)ను ప్రైవేటీకరించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన సీపీఎస్ఈల ప్రైవేటీకరణ ప్రక్రియను మాత్రం పూర్తి చేయొచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని వాస్తవికంగా ఉండేలా చూసుకోవచ్చని సమాచారం. గత నాలుగు ఆర్థిక సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్దేశించుకున్న పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను చేరుకోలేకపోవడమే దీనికి కారణం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ప్రభుత్వం రూ.65,000 కోట్ల నిధుల్ని పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమీకరించాలని గత బడ్జెట్లో నిర్దేశించుకుంది. కాగా ఇప్పటి వరకు కేవలం రూ.31,106 కోట్లను మాత్రమే సమీకరించింది. ప్రభుత్వ రంగ కంపెనీల్లో మైనార్టీ వాటాలు విక్రయించడం ద్వారా ఈ నిధుల్ని రాబట్టింది. 2021లో నష్టాల్లో ఉన్న ఎయిరిండియాను విజయవంతంగా ప్రైవేటీకరించినా, గత ఏడాది మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో పీఎస్యూల విక్రయాలు చోటు చేసుకోలేదు.
* ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరణ జరిగే అవకాశాలున్న కంపెనీలు ఇవే: షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్, బీఈఎంఎల్, హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్ఐఎన్ఎల్/వైజాగ్ స్టీల్, ఐడీబీఐ బ్యాంక్.
మూలధన లాభాల పన్ను హేతుబద్ధీకరించాలి
ఐటీఆర్ ఫామ్ సులువుగా ఉండాలి: నిపుణులు
దిల్లీ: రాబోయే బడ్జెట్లో మూలధన లాభాల పన్నును హేతుబద్ధీకరించాలని నిపుణులు కోరుతున్నారు. అలాగే అలాంటి ఆదాయ నమోదుకు ఆదాయపు పన్ను రిటర్ను (ఐటీఆర్) ఫామ్ కూడా సులువుగా ఉండేలా చూడాలని ఆశిస్తున్నారు. మూలధన లాభాల పన్ను లేదా డివిడెండ్ లేదా వడ్డీ ఆదాయం మాత్రమే కలిగిన పన్ను చెల్లింపుదార్లకు ఫామ్లు సులువుగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. మూలధన ఆస్తులను (స్థిర, చరాస్తులు) బదిలీ చేయడం ద్వారా పొందే లాభాలను ‘క్యాపిటల్ గెయిన్స్’ (మూలధన లాభాలు)గా భావించి పన్ను విధిస్తుంటారు. దేశంలోని క్యాపిటల్ మార్కెట్లు విపరీతమైన వేగంతో పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు తొలి పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓలు) ద్వారా నిధులు సమీకరించేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో మూలధన లాభాల పన్ను విధానాన్ని క్రమబద్ధీకరించాలనే డిమాండ్ పెరుగుతోంది.
రుణ హామీ పథకం కింద గో ఫస్ట్కు రూ.210 కోట్లు
ముంబయి: ప్రభుత్వ రుణ హామీ పథకం కింద వచ్చే నెలలో రూ.210 కోట్లు అందుకునే అవకాశం ఉందని వాడియా గ్రూప్ సంస్థ గో ఫస్ట్ భావిస్తోంది. ఆర్థిక పరిస్థితి బలోపేతానికి, కార్యకలాపాల విస్తరణ కోసం గో ఫస్ట్ ఈ నిధులను ఆశిస్తోంది. గత వారం సంస్థ ప్రమోటర్ల నుంచి రూ.210 కోట్లు అందాయని, ఈ ఏడాది ఏప్రిల్కు విమానాలను 53కు పెంచుకోవడమే లక్ష్యమని గో ఫస్ట్ సీఈఓ కౌశిక్ ఖోనా పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీ చేతిలో 37 విమానాలు ఉన్నాయి. ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్ సమస్యలతో కంపెనీ ఇబ్బందులు పడుతోంది. అదనపు ఇంజిన్ల కొరత వల్ల పలు విమానాలు నిలిచిపోయాయి. కరోనా వల్ల ప్రభావితమైన రంగాల కోసం తీసుకొచ్చిన అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) కింద ఇప్పటివరకు గోఫస్ట్ రూ.600 కోట్ల రుణం పొందింది. ఇంజిన్ సమస్యలు క్రమంగా తగ్గుతున్నాయని, ఏప్రిల్కు ప్రాట్ అండ్ విట్నీ నుంచి 20 కొత్త ఇంజిన్లు రావొచ్చని ఖోనా వెల్లడించారు. వీటితో 10 విమానాలు నిర్వహణలోకి వస్తాయన్నారు. 2023-24లో ప్రయాణికుల సంఖ్యలో 57 శాతం వృద్ధిని గోఫస్ట్ ఆశిస్తోందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!