ప్రపంచ అతి పెద్ద డెరివేటివ్స్ ఎక్స్ఛేంజీగా ఎన్ఎస్ఈ
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ) వరుసగా నాలుగో ఏడాదీ ప్రపంచంలోనే అతి పెద్ద డెరివేటివ్స్ ఎక్స్ఛేంజీగా నిలిచింది.
వరుసగా నాలుగో ఏడాదీ..
దిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ) వరుసగా నాలుగో ఏడాదీ ప్రపంచంలోనే అతి పెద్ద డెరివేటివ్స్ ఎక్స్ఛేంజీగా నిలిచింది. 2022లో ట్రేడయిన మొత్తం డెరివేటివ్ కాంట్రాక్టుల సంఖ్య ఆధారంగా ఫ్యూచర్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ (ఎఫ్ఐఏ) ఈ ర్యాంకుల్ని ఇస్తుందని ఎన్ఎస్ఈ తెలిపింది. ఈక్విటీ విభాగంలోనూ ట్రేడ్ల సంఖ్య (ఎలక్ట్రానిక్ ఆర్డర్ బుక్) ఆధారంగా 2022లో ఎన్ఎస్ఈకి మూడో స్థానం లభించింది. గత ఏడాది మూడో స్థానంలో ఉండగా ఒక స్థానం మెరుగుపడింది. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్ఛేంజీస్ (డబ్ల్యూఎఫ్ఈ) ఈ గణాంకాలను నిర్వహిస్తుంటుంది. 2022 క్యాలెండర్ ఏడాదిలో నిఫ్టీ 50 జీవన కాల గరిష్ఠమైన 18,887.60 పాయింట్లను తాకింది.
* ఈక్విటీ విభాగంలో ఈటీఎఫ్ల్లో (ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్స్) రోజువారీ సరాసరి టర్నోవర్ రూ.470 కోట్లుగా నమోదైంది. వార్షిక ప్రాతిపదికన 51 శాతం వృద్ధి చెందింది.
* సార్వభౌమ పసిడి బాండ్ల రోజువారీ సరాసరి టర్నోవర్ (సెకండరీ మార్కెట్లో) రూ.7 కోట్లుగా నమోదైంది. 59 శాతం వృద్ధి లభించింది.
* ప్రభుత్వ సెక్యూరిటీల రోజువారీ సరాసరి టర్నోవర్ గత నెలలో రూ.3 కోట్లకు చేరింది.* ఈక్విటీ విభాగంలో మూడో స్థానం, డెరివేటివ్స్ విభాగంలో అతి పెద్ద ఎక్స్ఛేంజీగా అవతరించడం వాటాదార్లందరి సహకారంతోనే సాధ్యమైందని ఎన్ఎస్ఈ హెడ్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్ శ్రీరామ్ కృష్ణన్ వెల్లడించారు.
* నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రాగానే సామాజిక స్టాక్ ఎక్స్ఛేంజీను కూడా ఒక విభాగంగా త్వరలోనే ప్రారంభిస్తామని ఎన్ఎస్ఈ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?