బడ్జెట్, ఫెడ్ ముందు అప్రమత్తత
గత శుక్రవారం కనిపించిన నష్టాల నేపథ్యంలో మదుపర్లు ఈ వారం అప్రమత్తతతో వ్యవహరించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అంచనాలకు తగ్గట్లుగా అవి ఉంటే దూకుడే
18,000 స్థాయికి ఎగువన నిఫ్టీకి లాభాలు
వాహన షేర్లలో సానుకూలతలు కొనసాగొచ్చు
ఎఫ్ఎమ్సీజీ, సిమెంటు షేర్లకు ఒత్తిడి
విశ్లేషకుల అంచనాలు
స్టాక్ మార్కెట్
ఈ వారం
గత శుక్రవారం కనిపించిన నష్టాల నేపథ్యంలో మదుపర్లు ఈ వారం అప్రమత్తతతో వ్యవహరించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హిండెన్బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూపు ఇచ్చిన 413 పేజీల వివరణను మదుపర్లు పరిగణనలోకి తీసుకోవచ్చు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పరపతి సమావేశం, కేంద్ర బడ్జెట్లు ఈ వారమే చోటు చేసుకుంటుడడం కూడా మదుపర్లలో జాగ్రత్తను పెంచొచ్చని భావిస్తున్నారు. బడ్జెట్లో సానుకూల ప్రకటనలు ఉంటే అవి కీలక సూచీల్లో నష్టాలను పరిమితం చేసే అవకాశం ఉందని అంచనా కడుతున్నారు. నిఫ్టీకి తక్షణ మద్దతు 17300 వద్ద కనిపిస్తోంది. నిరోధం 17,900 వద్ద ఎదురుకావొచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. నిఫ్టీ తన కీలక 18,000 స్థాయిపైకి వెళ్లినా.. లాభాలు జోరందుకోవచ్చంటున్నారు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..
* బ్యాంకు షేర్లు ప్రతికూలంగా చలించొచ్చు. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల పతనం ఇందుకు నేపథ్యం. అయితే అదానీ అప్పుల్లో 40 శాతం కంటే తక్కువగానే భారత బ్యాంకులు రుణాలిచ్చాయి. ప్రైవేటు బ్యాంకులైతే మొత్తం అప్పుల్లో 10% కంటే తక్కువే ఇచ్చాయి. బ్యాంక్ సూచీకి 39,900 వద్ద మద్దతు; 41,500 వద్ద నిరోధం కనిపించొచ్చు.
* వాహన కంపెనీలు సానుకూల ధోరణిని కొనసాగించొచ్చు. డిసెంబరు త్రైమాసికంలో వాహన కంపెనీల ఫలితాలు బలంగా నమోదు కావడంతో మదుపర్లు ఈ రంగ భవిష్యత్ అంచనాలపై ఆశావహంగా ఉన్నారు.
* కేంద్ర బడ్జెట్కు ముందు లోహ కంపెనీలు లాభపడే అవకాశం ఉంది. వాహన కంపెనీల నుంచి బలమైన గిరాకీ కనిపిస్తుండడం ఇందుకు నేపథ్యం. విదేశీ సంస్థాగత మదుపర్ల నుంచి లోహ కంపెనీల్లోకి పెట్టుబడులు వస్తుండడం కూడా కలిసొచ్చే అంశం.
* టెలికాం కంపెనీల షేర్లు ఒక శ్రేణికి లోబడి చలించొచ్చు. జియో మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.2,400-2,450 స్థాయులకు చేరితే లాభాలు రావొచ్చు. ఎయిర్టెల్ రూ.750-790 మధ్య కదలాడొచ్చు.
* ఫిబ్రవరి 1న జరగనున్న పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్) సమావేశ ఫలితాల నుంచి అప్స్ట్రీమ్ కంపెనీల షేర్లు సంకేతాలు అందుకోవచ్చు. ఉత్పత్తిలో కోతను ప్రకటిస్తే అప్స్ట్రీమ్ కంపెనీలకు ప్రయోజనం కలుగుతుంది. ఐఓసీ ఫలితాలనూ మదుపర్లు గమనించొచ్చు.
* ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం వంటి ప్రధాన అంశాలపై ఆధారపడి ఐటీ షేర్ల ట్రేడింగ్ జరగొచ్చు. ప్రభుత్వ డిజిటైజేషన్ కార్యక్రమాలపై బడ్జెట్లో తీసుకునే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించొచ్చు.
* ఎఫ్ఎమ్సీజీ షేర్లు ఒత్తిడికి లోనుకావొచ్చు. బడ్జెట్లో సానుకూల ప్రకటనలు ఉంటేనే ఈ షేర్లు రాణించే అవకాశం ఉంది.
* ఫార్మా కంపెనీల షేర్లు స్తబ్దుగా కదలాడవచ్చు. మార్కెట్లో నష్టాలు కనిపిస్తున్నా.. రక్షణాత్మక రంగమైన ఫార్మాలో కొనుగోళ్లు కనిపించకపోవడం గమనార్హం. రాబోయే కేంద్ర బడ్జెట్, ఆర్థిక ఫలితాలకు మాత్రమే ఇవి స్పందించవచ్చు.
* సిమెంటు కంపెనీల షేర్లలో ఒత్తిడి కొనసాగొచ్చు. కొన్ని కంపెనీల ఫలితాలు అంచనాల కంటే తక్కువగా నమోదు కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
నేటి బోర్డు సమావేశాలు
ఎల్అండ్టీ, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, బీపీసీఎల్, గెయిల్, లారస్ ల్యాబ్స్, పీఎన్బీ, ఆర్ఈసీఎల్, బజాజ్ హోల్డింగ్, సీఎస్బీ బ్యాంక్, ఎల్టీ ఫుడ్స్, ధంపుర్ షుగర్, ద్వారికేశ్ షుగర్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఐఐఎఫ్ఎల్, ఎంఆర్పీఎల్, నామ్ ఇండియా, ఓరియెంట్ ఎలక్ట్రిక్, ట్రైడెంట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
Google layoffs: గూగుల్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు జపాన్ కంపెనీ తోషిబా సైతం ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 334 పాయింట్లు లాభపడి 73,278 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 22,268 దగ్గర కొనసాగుతోంది. -
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
తాజా వార్తలు (Latest News)
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్