బలహీనతలు కొనసాగొచ్చు!
సాధారణ బడ్జెట్కు ముందు మదుపర్ల అమ్మకాలతో గత వారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది.
సెన్సెక్స్ విశ్లేషణ
జనవరి 27తో ముగిసిన వారానికి
సమీక్ష: సాధారణ బడ్జెట్కు ముందు మదుపర్ల అమ్మకాలతో గత వారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్పీఓపై భయాలు కూడా ప్రభావం చూపాయి. అదానీ గ్రూప్ షేర్ల పతనంతో ఒడుదొడుకులు అధికమయ్యాయి. ఈ కంపెనీలతో సంబంధం ఉన్న బ్యాంక్లు, ఇతర సంస్థలకు అమ్మకాలు తప్పలేదు. విదేశీ మదుపర్ల అమ్మకాలు, రూపాయి క్షీణత ఇందుకు తోడయ్యాయి. దేశీయంగా చూస్తే.. త్రైమాసిక ఫలితాల ప్రభావంతో షేరు ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించాయి. బ్యారెల్ ముడిచమురు 1.1 శాతం తగ్గి 86.7 డాలర్ల వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి 81.12 నుంచి 81.52కు బలహీనపడింది. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా నాలుగో త్రైమాసిక జీడీపీ అంచనాలకు మించి 2.9 శాతంగా నమోదైంది. మూడో త్రైమాసికంలో నమోదైన 3.2 శాతంతో పోలిస్తే ఇది తక్కువే. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలు మాత్రం కొనసాగాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్ 2.1 శాతం నష్టంతో 59,331 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 2.3 శాతం కోల్పోయి 17,604 పాయింట్ల దగ్గర స్థిరపడింది. విద్యుత్, చమురు- గ్యాస్, బ్యాంకింగ్ రంగాలు నష్టపోగా.. వాహన, ఎఫ్ఎమ్సీజీ, ఐటీ షేర్లు రాణించాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) నికరంగా రూ.9,352 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.7,211 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. జనవరిలో ఇప్పటివరకు విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు (ఎఫ్పీఐలు) మొత్తంగా రూ.17,023 కోట్లు వెనక్కి తీసుకున్నారు.
లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 2:7గా నమోదు కావడం..
మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడిని సూచిస్తోంది.
ఈ వారంపై అంచనా: కీలక మద్దతు స్థాయి 59,600 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్, గతవారం నష్టాల్లో ముగిసింది. ప్రస్తుతం 58,900 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు. అది కోల్పోతే 58,000 దగ్గర మరో మద్దతు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు రికవరీ వస్తే, 59,600- 61,000 పాయింట్ల శ్రేణిలో నిరోధం ఎదురుకావొచ్చు. స్వల్పకాలంలో ఒడుదొడుకులు మరింత పెరగొచ్చు.
ప్రభావిత అంశాలు: బుధవారం (ఫిబ్రవరి 1న) వెలువడనున్న సాధారణ బడ్జెట్ మార్కెట్లకు కీలకం కానుంది. స్వల్పకాలంలో మార్కెట్ సెంటిమెంట్ను ఇది నిర్ణయించనుంది. 2022-23 ఆర్థిక సర్వే నుంచి సూచీలు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. ఆర్థిక గణాంకాలు, నెలవారీ వాహన విక్రయాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు, అమెరికా ఫెడ్ సమావేశ నిర్ణయాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్పీఓ విఫలమైతే సెంటిమెంట్ మరింత బలహీనపడొచ్చు. అదానీ గ్రూప్, ఇతర సంస్థలకు రుణాలు ఇచ్చిన బ్యాంక్లపైనా దృష్టి పెట్టొచ్చు. ఈ వారం బజాజ్ ఫిన్సర్వ్, బీపీసీఎల్, గెయిల్, టెక్ మహీంద్రా, సన్ఫార్మా, పవర్గ్రిడ్, ఎస్బీఐ, దివీస్ ల్యాబ్స్, ఐటీసీ, మారికో, టాటా పవర్, ఐఓసీ, గోద్రేజ్ కన్జూమర్, కోల్ ఇండియా, ఏసీసీ, అశోక్ లేలాండ్, బ్రిటానియా, జుబిలెంట్ ఫుడ్, టైటన్, హెచ్డీఎఫ్సీ, డాబర్, బెర్జర్ వంటి దిగ్గజ కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా ఫెడ్ వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. ఈసీబీ, బీఓఈ వడ్డీ రేట్ల నిర్ణయాలపై దృష్టిపెట్టొచ్చు. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, ఎఫ్ఐఐ కొనుగోళ్ల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు.
తక్షణ మద్దతు స్థాయులు: 58,744, 58,000, 57,050
తక్షణ నిరోధ స్థాయులు: 59,800, 60,167, 60,900
సెన్సెక్స్ బలహీనతలు కొనసాగే అవకాశం ఉంది.
సతీశ్ కంతేటి, జెన్ మనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్.. తన కంపెనీలో పని చేస్తున్న సగానికి పైగా ఉద్యోగులకు ఏఐలో శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించింది. -
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
E- insurance: కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి బీమా పాలసీల డిజిటలైజేషన్ను తప్పనిసరి చేస్తున్నట్లు ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
March 31 Deadline: ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆర్బీఐ, ఐఆర్డీఏఐ, ఆదాయ పన్ను విభాగాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. -
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
Afcons Infra IPO: ఐదేళ్ల తర్వాత షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ వస్తోంది. నిర్మాణ రంగ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్మన్కు 25 ఏళ్ల జైలు శిక్ష
Sam Bankman Fried: క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఆర్థిక మోసాలు, అక్రమ నగదు చలామణి వంటి నేరాలకు పాల్పడ్డట్లు నవంబరులో తేల్చిన న్యూయార్క్ కోర్టు తాజాగా ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్