బలహీనతలు కొనసాగొచ్చు!
సాధారణ బడ్జెట్కు ముందు మదుపర్ల అమ్మకాలతో గత వారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది.
సెన్సెక్స్ విశ్లేషణ
జనవరి 27తో ముగిసిన వారానికి
సమీక్ష: సాధారణ బడ్జెట్కు ముందు మదుపర్ల అమ్మకాలతో గత వారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్పీఓపై భయాలు కూడా ప్రభావం చూపాయి. అదానీ గ్రూప్ షేర్ల పతనంతో ఒడుదొడుకులు అధికమయ్యాయి. ఈ కంపెనీలతో సంబంధం ఉన్న బ్యాంక్లు, ఇతర సంస్థలకు అమ్మకాలు తప్పలేదు. విదేశీ మదుపర్ల అమ్మకాలు, రూపాయి క్షీణత ఇందుకు తోడయ్యాయి. దేశీయంగా చూస్తే.. త్రైమాసిక ఫలితాల ప్రభావంతో షేరు ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించాయి. బ్యారెల్ ముడిచమురు 1.1 శాతం తగ్గి 86.7 డాలర్ల వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి 81.12 నుంచి 81.52కు బలహీనపడింది. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా నాలుగో త్రైమాసిక జీడీపీ అంచనాలకు మించి 2.9 శాతంగా నమోదైంది. మూడో త్రైమాసికంలో నమోదైన 3.2 శాతంతో పోలిస్తే ఇది తక్కువే. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలు మాత్రం కొనసాగాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్ 2.1 శాతం నష్టంతో 59,331 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 2.3 శాతం కోల్పోయి 17,604 పాయింట్ల దగ్గర స్థిరపడింది. విద్యుత్, చమురు- గ్యాస్, బ్యాంకింగ్ రంగాలు నష్టపోగా.. వాహన, ఎఫ్ఎమ్సీజీ, ఐటీ షేర్లు రాణించాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) నికరంగా రూ.9,352 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.7,211 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. జనవరిలో ఇప్పటివరకు విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు (ఎఫ్పీఐలు) మొత్తంగా రూ.17,023 కోట్లు వెనక్కి తీసుకున్నారు.
లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 2:7గా నమోదు కావడం..
మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడిని సూచిస్తోంది.
ఈ వారంపై అంచనా: కీలక మద్దతు స్థాయి 59,600 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్, గతవారం నష్టాల్లో ముగిసింది. ప్రస్తుతం 58,900 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు. అది కోల్పోతే 58,000 దగ్గర మరో మద్దతు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు రికవరీ వస్తే, 59,600- 61,000 పాయింట్ల శ్రేణిలో నిరోధం ఎదురుకావొచ్చు. స్వల్పకాలంలో ఒడుదొడుకులు మరింత పెరగొచ్చు.
ప్రభావిత అంశాలు: బుధవారం (ఫిబ్రవరి 1న) వెలువడనున్న సాధారణ బడ్జెట్ మార్కెట్లకు కీలకం కానుంది. స్వల్పకాలంలో మార్కెట్ సెంటిమెంట్ను ఇది నిర్ణయించనుంది. 2022-23 ఆర్థిక సర్వే నుంచి సూచీలు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. ఆర్థిక గణాంకాలు, నెలవారీ వాహన విక్రయాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు, అమెరికా ఫెడ్ సమావేశ నిర్ణయాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్పీఓ విఫలమైతే సెంటిమెంట్ మరింత బలహీనపడొచ్చు. అదానీ గ్రూప్, ఇతర సంస్థలకు రుణాలు ఇచ్చిన బ్యాంక్లపైనా దృష్టి పెట్టొచ్చు. ఈ వారం బజాజ్ ఫిన్సర్వ్, బీపీసీఎల్, గెయిల్, టెక్ మహీంద్రా, సన్ఫార్మా, పవర్గ్రిడ్, ఎస్బీఐ, దివీస్ ల్యాబ్స్, ఐటీసీ, మారికో, టాటా పవర్, ఐఓసీ, గోద్రేజ్ కన్జూమర్, కోల్ ఇండియా, ఏసీసీ, అశోక్ లేలాండ్, బ్రిటానియా, జుబిలెంట్ ఫుడ్, టైటన్, హెచ్డీఎఫ్సీ, డాబర్, బెర్జర్ వంటి దిగ్గజ కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా ఫెడ్ వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. ఈసీబీ, బీఓఈ వడ్డీ రేట్ల నిర్ణయాలపై దృష్టిపెట్టొచ్చు. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, ఎఫ్ఐఐ కొనుగోళ్ల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు.
తక్షణ మద్దతు స్థాయులు: 58,744, 58,000, 57,050
తక్షణ నిరోధ స్థాయులు: 59,800, 60,167, 60,900
సెన్సెక్స్ బలహీనతలు కొనసాగే అవకాశం ఉంది.
సతీశ్ కంతేటి, జెన్ మనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో