భారత్ వృద్ధిపై అక్కసుతోనే ఆరోపణలు
భారత్, భారతీయ సంస్థలు, అవి సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ తమపై ఆరోపణలు చేసిందని గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని, అసత్యాలంటూ 413 పేజీల్లో తన స్పందనను తెలియజేసింది.
భారతీయ కంపెనీలపై ఉద్దేశపూర్వక దాడి ఇది
తప్పుడు సమాచారం ప్రచారం చేసి లాభాలు ఆర్జించే యత్నం
హిండెన్బర్గ్ నివేదికపై అదానీ 413 పేజీల స్పందన
దిల్లీ: భారత్, భారతీయ సంస్థలు, అవి సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ తమపై ఆరోపణలు చేసిందని గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని, అసత్యాలంటూ 413 పేజీల్లో తన స్పందనను తెలియజేసింది. మార్కెట్లో తప్పుడు ఆరోపణలు ప్రచారం చేసి తద్వారా ఆర్థిక లాభాలు పొందాలనే దురుద్దేశంతోనే అమెరికాకు చెందిన ఈ షార్ట్ సెల్లింగ్ సంస్థ తమపై నివేదిక విడుదల చేసిందని అందులో పేర్కొంది. తనకు నచ్చినవిధంగా తప్పుడు సమాచారాన్ని చేర్చి దీనిని రూపొందించిందని తెలిపింది. ‘ఇది ఏదో ఒక కంపెనీపై చేసిన దాడి కాదు. భారత్, భారత స్వతంత్రత, సమైఖ్యత, భారతీయ సంస్థలు, వృద్ధి గాధ, ఆశయాలపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడి’ అని అదానీ గ్రూపు తెలిపింది. అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్పీఓకు ముందు ఈ నివేదికను విడుదల చేయడం వెనక హిండెన్బర్గ్ ఉద్దేశమేమిటో మనం అర్థం చేసుకోవచ్చని పేర్కొంది. ఈ పరిణామం ఆ అమెరికా సంస్థ విశ్వసనీయత, నైతికతపై సందేహాలు ఏర్పడేందుకు ఈ దారితీస్తుందని అందులో వెల్లడించింది. ఎలాంటి కారణాలు లేకుండా.. ఎటువంటి పరిశోధన చేయకుండా ఈ నివేదికను హిండెన్బర్గ్ విడుదల చేసిందని అదానీ గ్రూపు వివరించింది. హిండెన్బర్గ్ లేవనెత్తిన 88 ప్రశ్నల్లో 65 ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని అదానీ గ్రూపు కంపెనీలు ఇప్పటికే వెల్లడించాయని అదానీ గ్రూపు పేర్కొంది. మరో 23 ప్రశ్నల్లో 18 ప్రశ్నలు.. వాటాదార్లు, థర్డ్ పార్టీలకు సంబంధించినవని వెల్లడించింది. మిగిలిన 5 ప్రశ్నలు.. నిరాధార ఆరోపణలు అని వివరించింది. వీటిని తమ నమోదిత కంపెనీలు ఖండించాయని అదానీ గ్రూపు తెలిపింది. తమకు వర్తించే చట్టాలు, నిబంధనలను ఎల్లప్పుడూ పాటిస్తున్నామని పునరుద్ఘాటించింది. వాటాదార్ల ప్రయోజనాలను కాపాడేందుకు అత్యున్నత స్థాయి పాలనా ప్రమాణాలను పాటించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడమే అదానీ గ్రూపు సంస్థల ప్రాధాన్యమని అన్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ (ఏఈఎల్) రూ.20,000 కోట్ల మలివిడత పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ) విజయవంతం అవుతుందని అదానీ గ్రూపు సీఎఫ్ఓ జుగ్షిందర్ సింగ్ తెలిపారు. వేగంగా వృద్ధి చెందుతున్న విమానాశ్రయాలు, గనులు, రహదారులు, కొత్త ఇంధనం, డేటా కేంద్రాల వ్యాపారాలను నిర్వహిస్తున్న అదానీ ఎంటర్ప్రైజెస్లో వాటాను సొంతం చేసుకునేందుకు సంస్థాగత మదుపర్లకు ఎఫ్పీఓ ఓ అద్భుత మార్గమని తెలిపారు.
నికరంగా లాభాల్లోనే ఎల్ఐసీ: హిండెన్బర్గ్ నివేదిక ప్రభావంతో అదానీ గ్రూపు షేర్లు భారీగా పతనమైనప్పటికీ.. గత కొన్నేళ్లలో ఈ షేర్లలో పెట్టిన పెట్టబడులపై లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఇప్పటికీ నికరంగా లాభాల్లోనే ఉంది. స్టాక్ ఎక్స్ఛేంజీల వద్ద లభ్యమవుతున్న సమాచారం ప్రకారం.. గత కొన్నేళ్లలో అదానీ గ్రూపు కంపెనీల షేర్లలో ఎల్ఐసీ రూ.28,400 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. హిండెన్బర్గ్ నివేదికకు ముందు ఈ పెట్టుబడుల విలువ రూ.72,200 కోట్లుగా ఉండేది. అయితే రెండో రోజులుగా అదానీ షేర్లు పతనం కావడంతో.. ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ.55,700 కోట్లకు దిగివచ్చింది. దీని ప్రకారం ఎల్ఐసీ తొలుత పెట్టిన రూ.28,400 కోట్ల పెట్టుబడితో పోలిస్తే ఇప్పటికీ నికరంగా రూ.27,300 కోట్ల లాభంలోనే ఉందన్నమాట. మరోవైపు అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.20,000 కోట్ల ఎఫ్పీఓలోనూ యాంకర్ ఇన్వెస్టర్గా ఎల్ఐసీ రూ.300 కోట్లను పెట్టుబడులుగా పెట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్