భారత్ వృద్ధిపై అక్కసుతోనే ఆరోపణలు
భారత్, భారతీయ సంస్థలు, అవి సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ తమపై ఆరోపణలు చేసిందని గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని, అసత్యాలంటూ 413 పేజీల్లో తన స్పందనను తెలియజేసింది.
భారతీయ కంపెనీలపై ఉద్దేశపూర్వక దాడి ఇది
తప్పుడు సమాచారం ప్రచారం చేసి లాభాలు ఆర్జించే యత్నం
హిండెన్బర్గ్ నివేదికపై అదానీ 413 పేజీల స్పందన
దిల్లీ: భారత్, భారతీయ సంస్థలు, అవి సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ తమపై ఆరోపణలు చేసిందని గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని, అసత్యాలంటూ 413 పేజీల్లో తన స్పందనను తెలియజేసింది. మార్కెట్లో తప్పుడు ఆరోపణలు ప్రచారం చేసి తద్వారా ఆర్థిక లాభాలు పొందాలనే దురుద్దేశంతోనే అమెరికాకు చెందిన ఈ షార్ట్ సెల్లింగ్ సంస్థ తమపై నివేదిక విడుదల చేసిందని అందులో పేర్కొంది. తనకు నచ్చినవిధంగా తప్పుడు సమాచారాన్ని చేర్చి దీనిని రూపొందించిందని తెలిపింది. ‘ఇది ఏదో ఒక కంపెనీపై చేసిన దాడి కాదు. భారత్, భారత స్వతంత్రత, సమైఖ్యత, భారతీయ సంస్థలు, వృద్ధి గాధ, ఆశయాలపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడి’ అని అదానీ గ్రూపు తెలిపింది. అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్పీఓకు ముందు ఈ నివేదికను విడుదల చేయడం వెనక హిండెన్బర్గ్ ఉద్దేశమేమిటో మనం అర్థం చేసుకోవచ్చని పేర్కొంది. ఈ పరిణామం ఆ అమెరికా సంస్థ విశ్వసనీయత, నైతికతపై సందేహాలు ఏర్పడేందుకు ఈ దారితీస్తుందని అందులో వెల్లడించింది. ఎలాంటి కారణాలు లేకుండా.. ఎటువంటి పరిశోధన చేయకుండా ఈ నివేదికను హిండెన్బర్గ్ విడుదల చేసిందని అదానీ గ్రూపు వివరించింది. హిండెన్బర్గ్ లేవనెత్తిన 88 ప్రశ్నల్లో 65 ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని అదానీ గ్రూపు కంపెనీలు ఇప్పటికే వెల్లడించాయని అదానీ గ్రూపు పేర్కొంది. మరో 23 ప్రశ్నల్లో 18 ప్రశ్నలు.. వాటాదార్లు, థర్డ్ పార్టీలకు సంబంధించినవని వెల్లడించింది. మిగిలిన 5 ప్రశ్నలు.. నిరాధార ఆరోపణలు అని వివరించింది. వీటిని తమ నమోదిత కంపెనీలు ఖండించాయని అదానీ గ్రూపు తెలిపింది. తమకు వర్తించే చట్టాలు, నిబంధనలను ఎల్లప్పుడూ పాటిస్తున్నామని పునరుద్ఘాటించింది. వాటాదార్ల ప్రయోజనాలను కాపాడేందుకు అత్యున్నత స్థాయి పాలనా ప్రమాణాలను పాటించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడమే అదానీ గ్రూపు సంస్థల ప్రాధాన్యమని అన్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ (ఏఈఎల్) రూ.20,000 కోట్ల మలివిడత పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ) విజయవంతం అవుతుందని అదానీ గ్రూపు సీఎఫ్ఓ జుగ్షిందర్ సింగ్ తెలిపారు. వేగంగా వృద్ధి చెందుతున్న విమానాశ్రయాలు, గనులు, రహదారులు, కొత్త ఇంధనం, డేటా కేంద్రాల వ్యాపారాలను నిర్వహిస్తున్న అదానీ ఎంటర్ప్రైజెస్లో వాటాను సొంతం చేసుకునేందుకు సంస్థాగత మదుపర్లకు ఎఫ్పీఓ ఓ అద్భుత మార్గమని తెలిపారు.
నికరంగా లాభాల్లోనే ఎల్ఐసీ: హిండెన్బర్గ్ నివేదిక ప్రభావంతో అదానీ గ్రూపు షేర్లు భారీగా పతనమైనప్పటికీ.. గత కొన్నేళ్లలో ఈ షేర్లలో పెట్టిన పెట్టబడులపై లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఇప్పటికీ నికరంగా లాభాల్లోనే ఉంది. స్టాక్ ఎక్స్ఛేంజీల వద్ద లభ్యమవుతున్న సమాచారం ప్రకారం.. గత కొన్నేళ్లలో అదానీ గ్రూపు కంపెనీల షేర్లలో ఎల్ఐసీ రూ.28,400 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. హిండెన్బర్గ్ నివేదికకు ముందు ఈ పెట్టుబడుల విలువ రూ.72,200 కోట్లుగా ఉండేది. అయితే రెండో రోజులుగా అదానీ షేర్లు పతనం కావడంతో.. ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ.55,700 కోట్లకు దిగివచ్చింది. దీని ప్రకారం ఎల్ఐసీ తొలుత పెట్టిన రూ.28,400 కోట్ల పెట్టుబడితో పోలిస్తే ఇప్పటికీ నికరంగా రూ.27,300 కోట్ల లాభంలోనే ఉందన్నమాట. మరోవైపు అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.20,000 కోట్ల ఎఫ్పీఓలోనూ యాంకర్ ఇన్వెస్టర్గా ఎల్ఐసీ రూ.300 కోట్లను పెట్టుబడులుగా పెట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 655 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. -
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203