Aditya Birla: బిర్లా వారసులొచ్చారు

ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ (ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌) డైరెక్టర్ల బోర్డులోకి ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా పిల్లలు అనన్యశ్రీ బిర్లా, ఆర్యమన్‌ బిర్లా చేరారు.

Updated : 31 Jan 2023 07:54 IST

ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ బోర్డులోకి కుమార మంగళం బిర్లా పిల్లలు

దిల్లీ: ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ (ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌) డైరెక్టర్ల బోర్డులోకి ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా పిల్లలు అనన్యశ్రీ బిర్లా, ఆర్యమన్‌ బిర్లా చేరారు. బోర్డులో వీరు అదనపు నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా వ్యవహరించనున్నారు. కంపెనీ నామినేషన్‌, రెమ్యూనరేషన్‌ కమిటీ సిఫారసుల ఆధారంగా బోర్డు ఈ నియామకాలను ఆమోదించిందని కంపెనీ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఈ నియామకాలకు వాటాదార్ల ఆమోదం లభించాల్సి ఉంది. అనన్య ఏర్పాటు చేసిన మొదటి కంపెనీ స్వతంత్ర మైక్రోఫిన్‌, భారత్‌లో వేగంగా ఎదుగుతున్న సూక్ష్మరుణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఆర్యమన్‌కు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, వీసీ పెట్టుబడులు, క్రీడల్లో అనుభవం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని