సంక్షిప్త వార్తలు (5)
డిసెంబరు త్రైమాసికంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) రూ.448.01 కోట్ల లాభాన్ని ప్రకటించింది. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.1,97,168 కోట్ల నుంచి రూ.2,28.168 కోట్లకు పెరిగింది.
ఐఓసీ లాభం రూ.448 కోట్లు
దిల్లీ: డిసెంబరు త్రైమాసికంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) రూ.448.01 కోట్ల లాభాన్ని ప్రకటించింది. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.1,97,168 కోట్ల నుంచి రూ.2,28.168 కోట్లకు పెరిగింది. వరుసగా రెండు త్రైమాసికాల పాటు నష్టపోయిన కంపెనీ, సమీక్షా త్రైమాసికంలో మళ్లీ లాభాల్లోకి వచ్చింది. 2022-23 ఏప్రిల్-సెప్టెంబరులో కంపెనీ నష్టం రూ.2,265 కోట్లుగా ఉంది. 2021-22 డిసెంబరు త్రైమాసికంలో లాభం రూ.5,860.80 కోట్లుగా ఉంది. 2022 ఏప్రిల్ నుంచి అంతర్జాతీయ ముడిచమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను సవరించకపోవడంతో ఐఓసీ, ఇతర ప్రభుత్వ చమురు రిటైల్ సంస్థలు నష్టాలు చవిచూస్తున్నాయి.
28 రోజులకు రూ.99 రీఛార్జీ: వొడాఫోన్ ఐడియా
ఈనాడు, హైదరాబాద్: వొడాఫోన్ ఐడియా కొత్తగా రూ.99 రీఛార్జి ప్యాక్ను ప్రవేశపెట్టింది. 28 రోజుల కాలావధితో పాటు పూర్తి టాక్టైమ్, 200 ఎంబీ డేటా లభిస్తాయని వొడాఫోన్ ఐడియా ఏపీ, తెలంగాణ, కర్ణాటక క్లస్టర్ బిజినెస్ హెడ్ సిద్ధార్థ చైన్ తెలిపారు. ‘వి షాప్స్’ ద్వారా గ్రామీణ వినియోగదార్లు నైపుణ్యాలు పెంచుకునేందుకు సహకరిస్తున్నామన్నారు.
‘నకిలీ మార్కెట్ల జాబితా’లో ఇండియామార్ట్
వాషింగ్టన్: అమెరికా విడుదల చేసిన వార్షిక ‘నొటోరియస్ మార్కెట్స్ లిస్ట్’లో భారత్కు చెందిన ఇ-కామర్స్ సంస్థ ఇండియామార్ట్తో పాటు దిల్లీ, బెంగళూరు, కోల్కతా, ముంబయిలలోని కొన్ని సంప్రదాయ మార్కెట్లు కూడా ఉన్నాయి. మంగళవారం విడుదలైన ఈ జాబితాలో 39 ఆన్లైన్, 33 సంప్రదాయ మార్కెట్లు కనిపించాయి. నకిలీ లేదా కాపీరైట్/ పైరసీ ఉత్పత్తులు అధికంగా ఉండే మార్కెట్లను గుర్తించి, ఏటా జాబితా రూపంలోఅమెరికా విడుదల చేస్తుంటుంది. ఇందులో ఇండియామార్ట్తో పాటు ముంబయిలోని హీరాపన్నా, కోల్కతాలోని కిడర్పోర్: బెంగళూరులోని సదర్ పత్రప్ప రోడ్ మార్కెట్, దిల్లీలోని ట్యాంక్ రోడ్ మార్కెట్ ఉన్నాయి. ప్రైవేటు రంగం, వాణిజ్య భాగస్వాములు కలిసి ఈ మార్కెట్లలో ప్రమాదకర చర్యలను నిలువరించాలని అగ్రరాజ్యం పిలుపునిచ్చింది.
‘ క్రిప్టోల’పై నియంత్రణ అవసరం
ఇటీవల అమెరికాలో క్రిప్టో ఎక్స్ఛేంజీ అయిన ఎఫ్టీఎక్స్ కుప్పకూలడంతో.. క్రిప్టో వ్యవస్థలో ఉన్న బలహీనతలు ఒక్కసారిగా ప్రపంచం కళ్లముందు కనిపించాయి. ‘క్రిప్టో ఆస్తులనేవి ఆర్థిక ఆస్తులు కావని స్పష్టమైంది. ఇప్పటికే బిట్కాయిన్, ఈథర్ వంటి పలు క్రిప్టో ఆస్తులు.. సెక్యూరిటీలుగా ఉండడానికి అర్హత లేదని అమెరికా నియంత్రణ సంస్థలు స్పష్టం చేశాయి. బ్యాంకింగ్ వ్యవస్థకు అవి హాని కలిగిస్తాయని అమెరికా ఫెడరల్ రిజర్వ్, ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఆఫీస్ ఆఫ్ కంప్ట్రోలర్ ఆఫ్ కరెన్సీలు అరుదైన సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. క్రిప్టో ఆస్తుల నియంత్రణకు అంతర్జాతీయ స్థాయిలో సమన్వయంతో కూడిన ప్రక్రియ దిశగా ఓఈసీడీ, జి-20 దేశాలు చర్చిస్తున్నాయ’ని సర్వే పేర్కొంది.
* ప్రస్తుతమున్న అంతర్జాతీయ ప్రమాణాలు క్రిప్టో ఆస్తుల ద్వారా వచ్చే నష్టభయాలను, బలహీనతలను ఏ మాత్రం తగ్గించలేవు. ఒక విస్తృత స్థాయి, బహుళ దేశీయ నియంత్రణ సంస్థలు కలిసి వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది.
డిసెంబరులో కీలక రంగాల వృద్ధి 7.4%
3 నెలల గరిష్టానికి
దిల్లీ: డిసెంబరులో 8 కీలక రంగాల వృద్ధి 3 నెలల గరిష్ఠమైన 7.4 శాతానికి చేరింది. 2021 డిసెంబరులో ఇది 4.1 శాతమే. బొగ్గు, ఎరువులు, ఉక్కు, విద్యుత్ రంగాల్లో మంచి వృద్ధి నమోదు కావడంతోనే ఈసారి కీలక రంగాలు రాణించాయి. ముడి చమురు ఉత్పత్తి 1.2% తగ్గింది. 2022 నవంబరులో 8 రంగాల కీలక వృద్ధి 5.7 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. 2022 డిసెంబరులో బొగ్గు ఉత్పత్తి 11.5 శాతం, ఎరువుల ఉత్పత్తి 7.3 శాతం, ఉక్కు 9.2 శాతం, విద్యుత్ 10 శాతం చొప్పున పెరిగాయి.
* ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ఏప్రిల్-డిసెంబరు మధ్య కీలక రంగాలైన బొగ్గు, ముడిచమురు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాల వృద్ధి 8 శాతంగా నమోదైంది. 2021-22 ఇదే సమయంలో ఈ వృద్ధి 12.6 శాతంగా ఉంది.
* పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ 8 కీలక రంగాల వాటా 40.27 శాతం ఉండటంతో ఐఐపీ గణాంకాలను ఇవి ప్రభావితం చేస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. -
వీవీఐపీలకు సేవలందించిన బోయింగ్ 747కు ఎయిరిండియా వీడ్కోలు
దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎయిరిండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు (వీవీఐపీ), వాణిజ్య, అత్యవసర తరలింపు సేవలను ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది. -
జొమాటో ప్లాట్ఫాం ఫీజు రూ.5కు పెంపు
ఎంపిక చేసిన నగరాల్లో, జొమాటో తన ప్లాట్ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5కు పెంచింది. ఇప్పటివరకు ఇది 4 రూపాయలుగా ఉంది. -
సంక్షిప్త వార్తలు(5)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓలా మొబిలిటీ సోమవారం వెల్లడించింది. అరైవల్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యాబ్ పికప్ జోన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి