టీవీల ధరలు తగ్గుతాయ్
దేశీయంగా తయారవుతున్న (అసెంబ్లింగ్ చేస్తున్న) ఎల్ఈడీ టీవీల ధరలు తగ్గనున్నాయి.
ఈనాడు వాణిజ్య విభాగం: దేశీయంగా తయారవుతున్న (అసెంబ్లింగ్ చేస్తున్న) ఎల్ఈడీ టీవీల ధరలు తగ్గనున్నాయి. వీటి తెరల తయారీలో వినియోగించే ఓపెన్సెల్పై దిగుమతి సుంకాన్ని 5% నుంచి 2.5 శాతానికి తగ్గించడమే ఇందుకు కారణం. ఎల్ఈడీ టీవీల తయారీ వ్యయంలో 60-70% వాటా ఓపెన్సెల్ ప్యానల్దే ఉంటుంది. వీటిపై బేసిక్ కస్టమ్స్ సుంకం సగానికి తగ్గినందున, ఆమేర టీవీల ధరలు తగ్గుతాయి. ఇందువల్ల పెద్ద తెరల టీవీల ధరల్లో తేడా ఎక్కువగా వచ్చినా, చిన్న టీవీలకు వచ్చేసరికి పెద్దగా మార్పు ఉండదని పరిశ్రమ వర్గాలు ‘ఈనాడు’కు తెలిపాయి. ఇందుకు కారణం ఏమిటంటే..
40 అంగుళాల టీవీలు రూ.15,000కు లభిస్తున్నాయి. ఇందులో తెర ధర రూ.9,000-10,500 అవుతుంది. దీని సుంకంలో తేడా సర్ఛార్జీతో కలిపి 2.75% అంటే రూ.247-289 మాత్రమే అవుతుంది. అదే రూ.60,000 పైన ఉండే 70 అంగుళాల టీవీని తీసుకుంటే, తెర వ్యయమే రూ.36,000-42,000 అవుతుంది. దీనిపై 2.75% తేడా అంటే రూ.990-1155 తగ్గుతుంది. ఈ మేర వినియోగదార్లతో పాటు, దేశీయ తయారీ సంస్థలకూ ఇది ఉపకరిస్తుంది.
సెల్ఫోన్ల ధరల్లో మార్పులుండవ్: సెల్ఫోన్ల తయారీ (అసెంబ్లింగ్) కోసం దిగుమతి చేసుకునే కెమెరా లెన్స్పై దిగుమతి సుంకాన్ని 5.5% నుంచి 2.75% శాతానికి తగ్గించినా, ఫోన్ ధరల్లో మార్పులు వచ్చే పరిస్థితి లేదని పరిశ్రమ సంఘం ఐసియా పేర్కొంది. మొత్తం ఫోన్ ధరలో ఈ విడిభాగం వాటా 0.16-0.19% మాత్రమే ఉంటుందని స్థానిక పరిశ్రమ వర్గాలూ తెలిపాయి. అంటే రూ.10,000 ఫోన్లో దీని ధర రూ.160-190 మాత్రమే. ఈ మొత్తంపై 2.75% తగ్గినా, వినియోగదారులకు బదిలీ చేసేది ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2024-25లోనూ ఐటీ నియామకాలు అంతంతే
ఐటీ రంగం ఆకర్షణీయ వృద్ధి బాట పట్టేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పరిస్థితి ఉంటుందనే అంశమే కాస్త ఊరట కలిగిస్తోంది. -
దీర్ఘకాలంలో చిన్న, మధ్య షేర్లు బలంగానే
చిన్న, మధ్య స్థాయి షేర్ల విలువలు మరీ అధిక స్థాయికి చేరాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చేసిన వ్యాఖ్యలతో ఈ షేర్లు గత 3 వారాల్లో భారీగా కుదేలయ్యాయి. -
ఆఫీసుకు వస్తేనే పదోన్నతులు
కార్యాలయాలకు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని తమ ఉద్యోగులకు స్పష్టం చేస్తూ ల్యాప్ట్యాప్ల తయారీ కంపెనీ డెల్ లేఖ పంపినట్లు తెలుస్తోంది. -
రూ.1991కే ఫ్లై91 ప్రయాణం
ఫ్లై91 సంస్థ సోమవారం తన విమాన సర్వీసులను ప్రారంభించింది. మొదటి విమానం గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం గం.7.55కు బయలుదేరి వెళ్లింది. -
ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగింది: హైర్ ప్రో
అంతక్రితం ఏడాదితో పోలిస్తే, 2022-23 ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగినట్లు ఏఐ పవర్డ్ రిక్రూట్మెంట్ ఆటోమేషన్ సంస్థ హైర్ ప్రో నివేదిక వెల్లడించింది. -
అంకురాలకు విలువే సర్వస్వం కాదు
పారదర్శకత, నైతిక ప్రవర్తన కోసం స్వీయ నియంత్రణ విధానాన్ని దేశీయ అంకుర సంస్థలు అవలంబించాలని జీ20లో భారత తరపు ప్రధాన ప్రతినిధి (షెర్పా) అమితాబ్ కాంత్ తెలిపారు. -
మదుపర్ల అప్రమత్తత
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడనున్నందున, మదుపర్లు అప్రమత్తత పాటించారు. -
బీమా రంగంలోకి రూ.54,000 కోట్ల ఎఫ్డీఐ
గత తొమ్మిదేళ్లలో బీమా రంగం రూ.54,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను ఆకర్షించిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. -
బెంగళూరు- లక్షద్వీప్ విమాన సర్వీసు: ఇండిగో
లక్షద్వీప్కు విమాన సదుపాయాన్ని విస్తరించడంలో భాగంగా ఈనెల 31 నుంచి బెంగళూరు- అగత్తి మధ్య నేరుగా విమాన సర్వీసులను నడుపుతున్నట్లు ఇండిగో సోమవారం వెల్లడించింది. -
మనవడికి రూ.240 కోట్ల ఇన్ఫోసిస్ షేర్లు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, తన మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి భారీ బహుమతి ఇచ్చారు. -
సంక్షిప్త వార్తలు
ఈ వేసవిలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అంతర్జాతీయ విమాన సర్వీసులను 20 శాతానికి పైగా పెంచనుంది. దేశ, విదేశీ మార్గాల్లో రోజువారీ 360కి పైగా విమాన సర్వీసులను నడపబోతోంది. -
WhatsApp: వాట్సప్ పేమెంట్స్ ఇక మరింత సులువుగా.. ఇక చాట్ లిస్ట్లోనే
WhatsApp payments: వాట్సప్లో పేమెంట్స్ ఇక మరింత సులువు కానుంది. చాట్ లిస్ట్లోనే ఇకపై క్యూఆర్ కోడ్ స్కానర్ కనిపించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
-
AP News: తెలుగు రాద్దామనుకుంటే.. హిందీ ప్రశ్నపత్రం వచ్చింది
-
బస్సుల్లేక బాధలు.. తికమకలో మరో కేంద్రానికి విద్యార్థిని
-
cVIGIL: మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు!