ఆటాడించింది
సాధారణ బడ్జెట్ నేపథ్యంలో దేశీయ సూచీలు బుధవారం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొని, చివరకు మిశ్రమంగా ముగిశాయి. ఒకదశలో సూచీలు పరుగులు తీసినా, గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలతో వెనక్కి వచ్చేశాయి.
గరిష్ఠాల నుంచి 1,000 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
నష్టాల్లో ముగిసిన నిఫ్టీ
సాధారణ బడ్జెట్ నేపథ్యంలో దేశీయ సూచీలు బుధవారం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొని, చివరకు మిశ్రమంగా ముగిశాయి. ఒకదశలో సూచీలు పరుగులు తీసినా, గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలతో వెనక్కి వచ్చేశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడనుండటంతో మదుపర్లు అప్రమత్తమయ్యారు. డాలర్తో పోలిస్తే రూపాయి 8 పైసలు పెరిగి 81.80 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 85.42 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
బడ్జెట్ ప్రసంగానికి ముందు
బడ్జెట్ మీద సానుకూల అంచనాలతో సెన్సెక్స్ ఉదయం 60,001.17 వద్ద భారీ లాభాల్లో ప్రారంభమైంది. బడ్జెట్ ప్రసంగం ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ దాదాపు 550 పాయింట్ల లాభంలో ట్రేడవుతోంది. ప్రసంగం ప్రారంభమయ్యాక పరిమిత శ్రేణిలో కదలాడినా, లాభాలను మాత్రం కోల్పోలేదు.
ప్రసంగం అనంతరం
బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యాక ఒక్కసారిగా కొనుగోళ్ల జోరు కనిపించింది. ఇంట్రాడేలో 1223 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్ 60,773.44 వద్ద గరిష్ఠానికి చేరింది. అనంతరం అనూహ్యంగా అమ్మకాలు రావడంతో ఆ లాభాలన్నీ కోల్పోయి నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 730 పాయింట్లు కోల్పోయి 58,816.84 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. మళ్లీ కోలుకుని 158.18 పాయింట్ల లాభంతో 59,708.08 వద్ద ముగిసింది. నిఫ్టీ మాత్రం 45.85 పాయింట్లు తగ్గి 17,616.30 దగ్గర స్థిరపడింది. నీ బడ్జెట్లో రూ.2.4 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రకటించినప్పటికీ రైల్వే షేర్లకు లాభాల స్వీకరణ ఎదురైంది. టెక్స్మాకో రైల్ 9.32%, ఆర్వీఎన్ఎల్ 4.53%, ఐఆర్ఎఫ్సీ 4.54%, ఇర్కాన్ ఇంటర్నేషనల్ 4.23%, కంటైనర్ కార్పొరేషన్2.96%, ఐఆర్సీటీసీ 1.43% చొప్పున నష్టాలు నమోదుచేశాయి. జూపిటర్ వ్యాగన్, టిటాగఢ్ వ్యాగన్స్ 5% కోల్పోయి లోయర్ సర్క్యూట్ను తాకాయి. కే అండ్ ఆర్ రైల్ 5% దూసుకెళ్లింది.
* అమెరికా ఫెడరల్ రిజర్వు బుధవారం నాటి సమీక్షలో వడ్డీరేట్లను 0.25 శాతం పెంచి 4.50-4.75 శాతం చేసింది. నేడు ఈ ప్రభావం మన మార్కెట్లపై ఉండే అవకాశం ఉంది.
ఆగని అదానీ షేర్ల పతనం: అదానీ గ్రూప్ షేర్లు వరుసగా అయిదో రోజూ పతనమయ్యాయి. గత 5 ట్రేడింగ్ రోజుల్లో అదానీ సంస్థల మార్కెట్ విలువ రూ.7 లక్షల కోట్లకు పైగా క్షీణించింది. బుధవారం అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 28.45% కుప్పకూలి రూ.2,128.70 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్ 19.69%, అదానీ టోటల్ గ్యాస్ 10%, అదానీ గ్రీన్ 5.78%, అదానీ విల్మర్ 4.99%, అదానీ పవర్ 4.98%, అదానీ ట్రాన్స్మిషన్ 2.46% నష్టపోయాయి. అంబుజా సిమెంట్స్ 16.56%, ఏసీసీ 6.34%, ఎన్టీడీవీ 4.98% నష్టాలు నమోదుచేశాయి.
ఎఫ్పీఓ ఉపసంహరణ: అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.20,000 కోట్ల ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. మదుపర్లకు డబ్బులు వెనక్కి ఇస్తామంది.
* ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న అదానీ తన స్థానాన్ని కోల్పోయారు. హిండెన్బర్గ్ నివేదిక అనంతరం షేర్ల పతనం ఇందుకు నేపథ్యం. ఫలితంగా ముకేశ్ అంబానీ తిరిగి అగ్రస్థానానికి చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
Ashwini Vaishnaw: ఈ ఏడాది చివరి నాటికి ‘మేడిన్ ఇండియా’ చిప్ తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2026లోనే బుల్లెట్ రైలు పట్టాలెక్కనున్నట్లు తెలిపారు. -
Stock market: భారీ నష్టాల్లో మార్కెట్లు.. పతనానికి కారణాలు ఇవే!
Stock market: దేశీయస్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 700 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 22వేల స్థాయిని కోల్పోయింది. -
Elon Musk: ‘అవును కెటమిన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్
మానసిక కుంగుబాటు నుంచి బయటపడేందుకు గతంలో డ్రగ్స్ వినియోగించినట్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు. -
‘ఆ వార్తలు అవాస్తవం’: అమెరికా దర్యాప్తు చేపట్టిందన్న కథనంపై అదానీ గ్రూప్ స్పందన
లంచం ఆరోపణల విషయంలో దర్యాప్తు గురించి వెలువడిన మీడియా కథనం అవాస్తవమని అదానీ గ్రూప్(Adani Group) వెల్లడించింది. -
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. -
2024-25లోనూ ఐటీ నియామకాలు అంతంతే
ఐటీ రంగం ఆకర్షణీయ వృద్ధి బాట పట్టేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పరిస్థితి ఉంటుందనే అంశమే కాస్త ఊరట కలిగిస్తోంది. -
దీర్ఘకాలంలో చిన్న, మధ్య షేర్లు బలంగానే
చిన్న, మధ్య స్థాయి షేర్ల విలువలు మరీ అధిక స్థాయికి చేరాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చేసిన వ్యాఖ్యలతో ఈ షేర్లు గత 3 వారాల్లో భారీగా కుదేలయ్యాయి. -
ఆఫీసుకు వస్తేనే పదోన్నతులు
కార్యాలయాలకు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని తమ ఉద్యోగులకు స్పష్టం చేస్తూ ల్యాప్ట్యాప్ల తయారీ కంపెనీ డెల్ లేఖ పంపినట్లు తెలుస్తోంది. -
రూ.1991కే ఫ్లై91 ప్రయాణం
ఫ్లై91 సంస్థ సోమవారం తన విమాన సర్వీసులను ప్రారంభించింది. మొదటి విమానం గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం గం.7.55కు బయలుదేరి వెళ్లింది. -
ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగింది: హైర్ ప్రో
అంతక్రితం ఏడాదితో పోలిస్తే, 2022-23 ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగినట్లు ఏఐ పవర్డ్ రిక్రూట్మెంట్ ఆటోమేషన్ సంస్థ హైర్ ప్రో నివేదిక వెల్లడించింది. -
అంకురాలకు విలువే సర్వస్వం కాదు
పారదర్శకత, నైతిక ప్రవర్తన కోసం స్వీయ నియంత్రణ విధానాన్ని దేశీయ అంకుర సంస్థలు అవలంబించాలని జీ20లో భారత తరపు ప్రధాన ప్రతినిధి (షెర్పా) అమితాబ్ కాంత్ తెలిపారు. -
మదుపర్ల అప్రమత్తత
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడనున్నందున, మదుపర్లు అప్రమత్తత పాటించారు. -
బీమా రంగంలోకి రూ.54,000 కోట్ల ఎఫ్డీఐ
గత తొమ్మిదేళ్లలో బీమా రంగం రూ.54,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను ఆకర్షించిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. -
బెంగళూరు- లక్షద్వీప్ విమాన సర్వీసు: ఇండిగో
లక్షద్వీప్కు విమాన సదుపాయాన్ని విస్తరించడంలో భాగంగా ఈనెల 31 నుంచి బెంగళూరు- అగత్తి మధ్య నేరుగా విమాన సర్వీసులను నడుపుతున్నట్లు ఇండిగో సోమవారం వెల్లడించింది. -
మనవడికి రూ.240 కోట్ల ఇన్ఫోసిస్ షేర్లు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, తన మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి భారీ బహుమతి ఇచ్చారు. -
సంక్షిప్త వార్తలు
ఈ వేసవిలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అంతర్జాతీయ విమాన సర్వీసులను 20 శాతానికి పైగా పెంచనుంది. దేశ, విదేశీ మార్గాల్లో రోజువారీ 360కి పైగా విమాన సర్వీసులను నడపబోతోంది. -
WhatsApp: వాట్సప్ పేమెంట్స్ ఇక మరింత సులువుగా.. ఇక చాట్ లిస్ట్లోనే
WhatsApp payments: వాట్సప్లో పేమెంట్స్ ఇక మరింత సులువు కానుంది. చాట్ లిస్ట్లోనే ఇకపై క్యూఆర్ కోడ్ స్కానర్ కనిపించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
-
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
-
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
-
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
-
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు