ఐటీకి మాంద్యం, మార్పులు మామూలే
ఐటీ రంగానికి మాంద్యం, మందగమనం మామూలేని, గత నాలుగు దశాబ్దాల్లో ఇటువంటి క్లిష్ట పరిస్థితులను ఎన్నోసార్లు చూసినట్లు హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) అధ్యక్షురాలు మనీషా సాబు అన్నారు.
కష్టకాలం నుంచి త్వరగా కోలుకుంటాం
ఉద్యోగాల తొలగింపు తాత్కాలిక పరిణామమే
హైసియా అధ్యక్షురాలు మనీషా సాబు
ఈనాడు, హైదరాబాద్: ఐటీ రంగానికి మాంద్యం, మందగమనం మామూలేని, గత నాలుగు దశాబ్దాల్లో ఇటువంటి క్లిష్ట పరిస్థితులను ఎన్నోసార్లు చూసినట్లు హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) అధ్యక్షురాలు మనీషా సాబు అన్నారు. మాంద్య పరిస్థితుల నుంచి కోలుకోడానికి ఇతర రంగాలకు రెండు- మూడేళ్లు పడితే, ఐటీ రంగం అంతకంటే ఎంతో ముందుగా గాడిన పడుతున్నట్లు వివరించారు. ‘ఉద్యోగాలు పోతున్నాయని, భవిష్యత్తు కష్టకాలమేనని అనుకోవద్దని, త్వరలో మంచి రోజులు వస్తాయ’ని అన్నారు. ఉద్యోగాల తొలగింపు తాత్కాలిక పరిణామమేనని తెలిపారు. నియామకాలు తగ్గాయని ఆందోళన చెందొద్దని, ఆన్లైన్లో చిన్న, మధ్యస్థాయి ప్రాజెక్టులు ఎన్నో లభిస్తున్నాయని ఆమె వివరించారు. అందువల్ల ఖాళీగా ఉండకుండా ఈ ప్రాజెక్టులు చేస్తూ, తమ నైపుణ్యాలకు పదును పెట్టుకుంటే, త్వరలో మంచి ఉద్యోగాల్లో చేరేందుకు తమను తాము సన్నద్ధం చేసుకున్నట్లు అవుతుందన్నారు. ఇప్పటికే ‘ఆఫర్ లెటర్లు’ జారీ చేసిన ఐటీ కంపెనీలు, ఉద్యోగార్థులను పిలవడం లేదని కంగారు పడాల్సిన పనిలేదని, ప్రాజెక్టులు లభించగానే ఆయా కంపెనీలు తాము ఎంపిక చేసుకున్న వారికి అవకాశాలిస్తాయని చెప్పారు. ఇది ఎప్పుడూ జరిగే ప్రక్రియేనని వివరించారు.
8న హైసియా వార్షిక సదస్సు
‘కొవిడ్’ పరిణామాల ఫలితంగా ప్రపంచంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులు చోటుచేసుకున్నందున, ఐటీ సేవలు, ఉత్పత్తులు పెను మార్పులకు లోనవుతున్నట్లు పేర్కొన్నారు. ఐటీ రంగంలో కొత్త మార్గాలు - నమూనాల అవసరం పెరుగుతోందన్నారు. ప్రపంచాన్ని నడిపిస్తున్న ఐటీ పరిశ్రమ మూలాలు సహా పునర్నిర్మితమవుతోందని తెలిపారు. మానవ మేధస్సు, నైతికత, నిబద్ధతల విలువలతో సాఫ్ట్వేర్ సేవల రంగం రూపాంతరం చెందాల్సి ఉందన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని ‘రీ-ఇమాజిన్, రీ-థింక్, రీబిల్డ్ ద ఫ్యూచర్’ అనే ప్రధానాంశంతో హైసియా 30 వార్షిక సమావేశాన్ని ఈ నెల 8న హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎస్టీపీఐ డైరెక్టర్ జనరల్ అర్వింద్ కుమార్, ఎల్టీఐ మైండ్ట్రీ ఎండీ దేవశిష్ ఛటర్జీ, సైయెంట్ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్ రెడ్డి, డాక్టర్ రెడ్డీస్ సహ-ఛైర్మన్ జీవీ ప్రసాద్ తదితర ప్రముఖులు పాల్గొంటారు.
ఆర్.చంద్రశేఖర్కు జీవిత కాల సౌఫల్య అవార్డు
ఈ సదస్సులో హైసియా వార్షిక అవార్డులను బహుకరిస్తారు. దీంతో పాటు ప్రాథమిక దశలో ఉండి, మంచి ఫలితాలు సాధిస్తున్న 10 అంకుర సంస్థలకు అవార్డులు అందజేస్తారు. ఇందుకోసం 100కు పైగా నామినేషన్లు రాగా, 40 సంస్థలు ఫైనల్కు చేరాయని హైసియా ఉపాధ్యక్షుడు ప్రశాంత్ నాదెళ్ల తెలిపారు. ఈ సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను ఈ సదస్సులో ప్రదర్శిస్తాయి. ప్రముఖ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదార్లు, ఏంజెల్ ఇన్వెస్టర్లు, ప్రభుత్వ ప్రతినిధులను కలుసుకునే అవకాశం అంకుర సంస్థల నిర్వాహకులకు లభిస్తుంది. అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు 3 నెలల కాలపరిమితి గల ‘స్టార్టప్ ఎనేబుల్మెంట్ ప్రోగ్రామ్’నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఈ సారి ‘జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని’ విశ్రాంత ఐఏఎస్ అధికారి, సెంటర్ ఫర్ ద డిజిటల్ ఫ్యూచర్ ఛైర్మన్ ఆర్.చంద్రశేఖర్కు అందించాలని హైసియా నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు, ఐటీ ఉద్యోగాలు గణనీయంగా పెరిగినట్లు ఎస్టీపీఐ- హైదరాబాద్ డైరెక్టర్ సీవీడీ రామ్ ప్రసాద్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’