మన మార్కెట్లకు ఢోకా లేదు
అదానీ గ్రూప్ షేర్ల భారీ పతనం స్టాక్ మార్కెట్లో సృష్టించిన ఆందోళన అంతా ఇంతా కాదు. విదేశీ మదుపర్లూ అమ్మకాలకు దిగిన నేపథ్యంలో, ఆర్థిక మంత్రి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల నుంచి ఈ అంశంపై స్పందన వెలువడింది.
ఒక్క ఉదంతంతో అంతా మారిపోదు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఇది టీ కప్పులో తుపానే: ఆర్థిక కార్యదర్శి
బ్యాంకింగ్ రంగం భద్రమే: ఆర్బీఐ
అదానీ గ్రూప్ షేర్ల భారీ పతనం స్టాక్ మార్కెట్లో సృష్టించిన ఆందోళన అంతా ఇంతా కాదు. విదేశీ మదుపర్లూ అమ్మకాలకు దిగిన నేపథ్యంలో, ఆర్థిక మంత్రి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల నుంచి ఈ అంశంపై స్పందన వెలువడింది. మన స్టాక్ మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ రంగం చాలా బలంగా, స్థిరంగా ఉన్నాయనే భరోసా కల్పించారు. మదుపర్లు, డిపాజిటర్లు, పాలసీదార్లు ఆందోళన చెందక్కర్లేదని స్పష్టం చేశారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్: భారత్ ఎప్పటికీ అత్యంత నియంత్రణలో ఉన్న ఆర్థిక మార్కెట్గానే కొనసాగుతుందని అంతర్జాతీయ పెట్టుబడుదార్లు గుర్తించాలి. ‘ఒక్క ఉదంతం’ వల్ల దేశీయ మార్కెట్లపై ఏ మాత్రం ప్రభావం ఉండబోదు. మా మార్కెట్ నియంత్రణాధికార సంస్థలు కొన్ని పాలనా పద్ధతుల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుంటాయి. అందువల్ల ఆర్థిక మార్కెట్ల పాలనపై సందేహాలొద్దు. కొన్ని దశాబ్దాల్లో చాలా పాఠాలు నేర్చుకున్నాం. కాబట్టి దేశీయ ఆర్థిక మార్కెట్లను బలంగా ఉంచడంలో మా నియంత్రణ సంస్థలు నిక్కచ్చిగా పనిచేస్తాయి.
ఆర్థిక కార్యదర్శి టి.వి. సోమనాథన్: స్థూల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చూస్తే అదానీ గ్రూప్ షేర్ల వల్ల మార్కెట్పై పడుతున్న ప్రభావాన్ని ‘టీ కప్పులో తుపాను’గానే చూడాలి. మన ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉంది. స్టాక్ మార్కెట్లో ఊగిసలాటలపై ప్రభుత్వం ఆందోళన చెందడం లేదు. వాటిపై తగిన చర్యలు తీసుకోవడానికి స్వతంత్ర నియంత్రణ సంస్థలు ఉన్నాయి. అదానీ గ్రూప్నకు బ్యాంకులు, బీమా సంస్థలు రుణాలివ్వడంతో పాటు పెట్టుబడి పెట్టినందున డిపాజిటర్లు, పాలసీదార్లు.. ఆయా సంస్థ షేర్లను కలిగి ఉన్న వారు భయపడాల్సిన అవసరం లేదు. మనకున్న ఆర్థిక స్థిరత్వం అటువంటిది. ప్రపంచవ్యాప్తంగా అన్ని స్టాక్ మార్కెట్లలో ఊగిసలాటలు సాధారణమే.
రుణాలపై పరిశీలన జరుపుతున్నాం: ఆర్బీఐ
దేశ బ్యాంకింగ్ రంగం బలంగా, స్థిరంగా ఉంది. బ్యాంకింగ్ రంగం ‘ఒక వ్యాపార దిగ్గజాని’కిచ్చిన రుణాలపై పరిశీలన జరుపుతున్నాం. ‘రూ.5 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంకులు రుణాలిస్తే, ఆ వివరాలన్నీ సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సీఆర్ఐఎల్సీ) డేటాబేస్లో ఉంటాయి. వీటిపై పరిశీలన జరుపుతుంటాం. అధికమొత్తం రుణాలకు మేము జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే బ్యాంకులు వ్యవహరిస్తుంటాయి.
అదానీ నిధుల సమీకరణ సామర్థ్యంపై ప్రభావం: మూడీస్
అదానీ గ్రూప్ షేర్ల విలువల క్షీణత వల్ల, ఆ గ్రూప్ నిధుల సమీకరణ సామర్థ్యం దెబ్బతినొచ్చని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ హెచ్చరించింది. వారంలోనే గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకు పైగా పతనమైన నేపథ్యంలో మూడీస్ స్పందించింది. ‘అదానీ కంపెనీల ఆర్థిక స్థిరత్వ పరిస్థితులను మదింపు చేస్తున్నాం. ద్రవ్య లభ్యత, విస్తరణ కార్యక్రమాలు, వాటికి నిధుల మద్దతు వంటివి పరిశీలిస్తున్నామని పేర్కొంది. అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్లకు మేమిచ్చే రేటింగ్లు ఆయా కంపెనీల పరిస్థితిని బట్టి ఉంటాయి. 1-2 ఏళ్లలో మూలధన వ్యయాలకు సరిపడా నిధులను సమీకరించే సామర్థ్యాన్ని తాజా పరిణామాలు దెబ్బతీయొచ్చని హెచ్చరించింది. అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ కంపెనీల బాండ్లు 2024 జూన్, డిసెంబరులలో గడువు తీరనుండగా.. మిగతా కంపెనీలకు 2026, అంతకు మించి గడువుండడం ఊరటనిచ్చే అంశం. తక్షణం రేటింగ్స్పై ప్రభావం ఉండదని ఫిచ్ పేర్కొంది.
* అదానీ ఎంటర్ప్రైజెస్ను ఫిబ్రవరి 7 నుంచి తమ సస్టెయినబిలిటీ సూచీల నుంచి తొలగిస్తున్నట్లు ఎస్ అండ్ పీ డోజోన్స్ ప్రకటించింది. అదానీ గ్రూప్ కంపెనీలైన అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు స్వల్పకాలిక అదనపు నిఘా చర్యల కింద పెట్టినందున ఎస్ అండ్ పీ జోన్స్ ఈ నిర్ణయం తీసుకుంది.
* అదానీ పోర్ట్స్, అదానీ ఎలక్ట్రిసిటీ రేటింగ్ను స్థిరత్వం నుంచి ప్రతికూలానికి మార్చినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ప్రకటించింది. అయితే స్వల్పకానికి ద్రవ్యలభ్యత సరిపోను ఉందని, రాబోయే ఏడాది కాలంలో బాండ్లకు చెల్లింపుల్లో ఇబ్బంది ఉండదనీ భరోసా ఇచ్చింది.
* భారత చట్టాల్లోని నిబంధనలకు పూర్తిగా లోబడే, అదానీ గ్రూప్లోని 2 కంపెనీల్లో పెట్టుబడులు (3.1 బి.డాలర్లు) పెట్టినట్లు ఫ్రాన్స్కు చెందిన టోటల్ఎనర్జీస్ ఎస్ఈ స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 159 పాయింట్ల లాభంతో 73,898 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 22,412 దగ్గర కొనసాగుతోంది. -
ఇస్రో కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్ఈసీ ఇండస్ట్రీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) వినియోగించే జీఎస్ఎల్వీ మార్క్-3 లాంచ్ వెహికల్ కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్ (ఐటీఎస్)ను ఎస్ఈసీ ఇండస్ట్రీస్ రూపొందించింది. -
మూడో రోజూ ముందుకే
వరుసగా మూడో రోజూ దేశీయ సూచీలు రాణించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో టెలికాం, టెక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే చమురు ధరలు పెరగడానికి తోడు విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. -
మా ఉత్పత్తులపై నిషేధం లేదు
తమ అన్ని ఉత్పత్తులు భద్రమైనవి, అత్యంత నాణ్యమైనవని ఎవరెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్స్ తెలిపింది. ఈ సంస్థ ఎగుమతి చేస్తున్న స్పైస్-మిక్స్ ఉత్పత్తుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, కంపెనీ పై విధంగా స్పందించింది. -
బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు ‘అమరరాజా’ సహా 7 కంపెనీల బిడ్
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద బ్యాటరీ ప్లాంట్లు స్థాపించేందుకు అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సహా 7 కంపెనీల నుంచి బిడ్లు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
కాస్త దిగొచ్చిన బంగారం
ఇటీవలి గరిష్ఠాలతో పోలిస్తే బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొంతమేర చల్లారడం ఇందుకు కారణం. -
ఇండిగోలో ఇన్ఫ్లైట్ వినోదం
మే 1 నుంచి దిల్లీ-గోవా విమానాల్లో, తన యాప్ ద్వారా ఇన్-ఫ్లైట్ వినోద కంటెంట్ను విమానయాన సంస్థ ఇండిగో ఆవిష్కరించనుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ద్రవ్యోల్బణానికి వాతావరణ ముప్పు
దీర్ఘకాలం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం.. వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ముడి చమురు ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ బులెటిన్ అభిప్రాయ పడింది. -
ఇంటిపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు ఇండియన్ బ్యాంక్తో టాటా పవర్ భాగస్వామ్యం
నివాస గృహాల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు, టాటా వపర్ సోలార్ సిస్టమ్స్ ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
వచ్చే 6 నెలల్లో మ్యాజిక్పిన్లో 250 నియామకాలు
ఫ్యాషన్, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు.. ఇలా వివిధ విభాగాల్లో బ్రాండ్లు, వ్యాపార సంస్థల అన్వేషణకు ఉపయోగపడే ఇ-కామర్స్ సంస్థ మ్యాజిక్పిన్ వచ్చే ఆరు నెలల్లో 250 మందిని నియమించుకునే యోచనలో ఉంది. -
నేటి నుంచి నిఫ్టీ నెక్స్ట్50లో డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్
నిఫ్టీ నెక్స్ట్ 50 సూచీలో డెరివేటివ్ కాంట్రాక్టులను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) బుధవారం ప్రారంభించనుంది. -
సీపీ గుర్నానీ కంపెనీతో ఇంటర్గ్లోబ్ భాగస్వామ్యం
టెక్ దిగ్గజం సీపీ గుర్నానీకి చెందిన అసాగోతో, ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్యం కుదుర్చుకుని, కృత్రిమ మేధ (ఏఐ) వ్యాపార వెంచర్ ‘అలాన్ఓఎస్’ను ఏర్పాటు చేసింది. -
టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ లాభం రూ.212 కోట్లు
కన్జూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (టీసీపీఎల్) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.212.26 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది -
ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి అడుగులేస్తాం!
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి వ్యవహరిస్తామని, పుణె కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మధ్య స్థాయి ఐటీ సేవల కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సీఈఓ సందీప్ కల్రా వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు(8)
ఫోక్స్వ్యాగన్ తన స్పోర్ట్ వినియోగ వాహనం (ఎస్యూవీ) టైగన్లో రెండు కొత్త వేరియంట్లను విపణిలోకి విడుదల చేసింది. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది?
తాజా వార్తలు (Latest News)
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్