పీఈ పెట్టుబడుల డీలా
దేశీయ కంపెనీల్లోకి ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు 2022లో 42 శాతం క్షీణించి 23.3 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని పరిశ్రమ నివేదిక వెల్లడించింది.
2022లో 42% క్షీణత
23.3 బి.డాలర్లకు పరిమితం: నివేదిక
ముంబయి: దేశీయ కంపెనీల్లోకి ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు 2022లో 42 శాతం క్షీణించి 23.3 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని పరిశ్రమ నివేదిక వెల్లడించింది. 2019 తరవాత ఇదే అత్యల్ప స్థాయి. ఆ ఏడాది 15.8 బి.డాలర్ల పీఈ పెట్టుబడులు మన దేశంలోకి వచ్చాయి. గత ఏడాది జరిగిన మొత్తం ఒప్పందాల సంఖ్యను వెల్లడించలేదు. నివేదిక ప్రకారం.
* డిసెంబరు త్రైమాసికంలో పీఈ పెట్టుబడులు త్రైమాసిక ప్రాతిపదికన 8.1 శాతం తగ్గి 3.61 బి.డాలర్లుగా నమోదయ్యాయి. సెప్టెంబరు త్రైమాసికంలో ఇవి 3.93 బి.డాలర్లుగా ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే 11.06 బి.డాలర్ల నుంచి ఏకంగా 67.2 శాతం క్షీణించాయి.
* మూడో త్రైమాసికం నాటి 443 ఒప్పందాలతో పోలిస్తే , డిసెంబరు త్రైమాసికంలో మొత్తం ఒప్పందాలు 24.8 శాతం తగ్గి 333కు పరిమితమయ్యాయి. 2021 డిసెంబరు త్రైమాసికం నాటి 411తో పోలిస్తే 19 శాతం తగ్గాయి.
* పాశ్చాత్య దేశాల్లో భౌగోళిక-రాజకీయ అనిశ్చితులు, పెరుగుతున్న వడ్డీ రేట్లు, మాంద్యం భయాల నేపథ్యంలో, అంతర్జాతీయ పెట్టుబడిదార్లు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆచితూచి వ్యవహరిస్తుండటంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ఎల్ఎస్ఈజీ బిజినెస్ అనుబంధ సంస్థ రెఫినిటివ్ సీనియర్ విశ్లేషకులు ఎలైన్ ట్యాన్ వెల్లడించారు.
* ఇంటర్నెట్-ఆధారిత, కంప్యూటర్ సాఫ్ట్వేర్, రవాణా తదితర రంగాలు మెజార్టీ నిధులు చేజిక్కించుకున్నాయి. మొత్తం పీఈ పెట్టుబడుల్లో 66 శాతం ఈ రంగాలే దక్కించుకున్నాయి. ఇంటర్నెట్ ఆధారిత రంగంలోకి గత ఏడాది పెట్టుబడులు 57.4 శాతం తగ్గాయి. 2021లో ఈ రంగంలో 556 ఒప్పందాలు జరగ్గా, 2022లో 528కి పరిమితమయ్యాయి.
* 2021తో పోలిస్తే కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీల్లోకి 46.4 శాతం, ఆర్థిక సేవల రంగంలోకి 34.6 శాతం, వైద్య, ఆరోగ్య రంగాల్లోకి 26.4 శాతం మేర పెట్టుబడులు తగ్గాయి.
* రవాణా రంగంలోకి మాత్రం నిధులు దాదాపు రెట్టింపయ్యాయి. కమ్యూనికేషన్స్లోకి 225.6 శాతం, వ్యవసాయ, అటవీ, మత్య్స రంగాల్లోకి 215.8 శాతం మేర నిధులు పెరిగాయి. చైనాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వల్ల పీఈ సంస్థలు తమ పెట్టుబడుల్ని భారత్, ఆగ్నేయాసియాకు బదిలీ చేయడం కలిసొచ్చింది.
* దేశీయ పీఈ సంస్థలు 2022లో 13.7 బి.డాలర్ల నిధుల్ని సమీకరించాయి. 2021లో సమీకరించిన 5.21 బి.డాలర్లతో పోలిస్తే ఇది 163.2 శాతం అధికం. 2019-22 మధ్య దేశీయ పీఈ సంస్థలు 32 బి.డాలర్లను సమీకరించాయి.
* ఒప్పందాల విపణిలో థింక్ అండ్ లెర్న్, వెర్సె ఇన్నోవేషన్లు పీఈ సంస్థల నుంచి చెరో 800 మి.డాలర్లను దక్కించుకుని అగ్ర స్థానంలో నిలిచాయి. భారతీ ఎయిర్టెల్, బండి టెక్నాలజీస్ (చెరో 700 మి.డాలర్లు), టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (494.7 మి.డాలర్లు), రిలయన్స్ రిటైల్ (343.5 మి.డాలర్లు), ఎన్టెక్స్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ (330 మి.డాలర్లు), డెలివరీ (304 మి.డాలర్లు) బిజీబీస్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్, రెంక్యూబ్ (చెరో 300 మి.డాలర్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి