వైద్య రంగంలో మానవ వనరుల అభివృద్ధి
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరచిన ప్రతిపాదనలతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు వైద్య సేవలు విస్తరించే అవకాశం కనిపిస్తోంది.
మున్ముందు మరింత నాణ్యంగా సేవలు
బడ్జెట్పై వైద్య వర్గాల స్పందన
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరచిన ప్రతిపాదనలతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు వైద్య సేవలు విస్తరించే అవకాశం కనిపిస్తోంది. అంతేగాక టెలీమెడిసిన్ సేవలు పెరుగుతాయని, కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత వైద్య సేవలు, శస్త్రచికిత్సలు విస్తరిస్తాయని కార్పొరేట్ ఆస్పత్రుల వర్గాలు వివరిస్తున్నాయి. వైద్య, ఆరోగ్య సేవల రంగానికి తాజాగా బడ్జెట్లో రూ.88,956 కోట్లు కేటాయించారు. క్రితం ఏడాది బడ్జెట్తో పోల్చితే ఇది 2.71 శాతం (రూ.2,350 కోట్లు) అధికం. వైద్య, ఆరోగ్య సేవల విస్తరణలో ప్రస్తుతం మానవ వనరుల కొరత, నైపుణ్యాల లేమి ప్రధాన సమస్యగా ఉంది. దీనికి తోడు వైద్య పరిశోధనలు కూడా పరిమితంగానే జరుగుతున్నాయి. పశ్చిమ దేశాల్లోని వైద్య విధానాలను తెచ్చుకోవడం మినహా మన దేశంలో స్థానిక పరిస్థితులకు, వైద్య పరిజ్ఞానానికి అనుగుణంగా మెరుగైన వైద్య సేవలను ఆవిష్కరించడం అనేది ఇటీవల కాలంలో కనిపించడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకున్నారా... అన్నట్లుగా మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాల విస్తరణపై దృష్టి సారించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
కృత్రిమ మేధకు ప్రోత్సాహం, 5జీ ల్యాబ్స్ విస్తరణ, ఐసీఎంఆర్ పరిశోధనా కేంద్రాల్లో వైద్య పరిశోధనలు నిర్వహించే వీలు కల్పించడం.... వంటి ప్రతిపాదనలు బడ్జెట్లో ఉన్నాయి. ఇవన్నీ కార్యరూపం దాల్చితే మనదేశంలో వైద్య రంగ ముఖచిత్రం ఎంతో వేగంగా మారుతుందని, సేవల నాణ్యత పెరుగుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని అపోలో హాస్పిటల్స్ గ్రూపు అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్ అభిప్రాయపడ్డారు. ‘కొవిడ్’ పరిణామాల ఫలితంగా ఆరోగ్య సేవల రంగంలో నైపుణ్యాల వృద్ధి అవసరం అధికంగా ఉందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని కేర్ హాస్పిటల్స్ గ్రూపు సీఈఓ జస్దీప్సింగ్ అభిప్రాయపడ్డారు. ఆరోగ్య సేవల రంగానికి సంబంధించి ఈ బడ్జెట్ ఎంతో విప్లవాత్మకమైనదని మెడికవర్ హాస్పిటల్ సీఎండీ అనిల్ కృష్ణ తెలిపారు. ‘ఆయుష్మాన్ భారత్’కు 10% అదనంగా నిధులు కేటాయించడం ఎంతోమందికి మేలు చేస్తుందని కామినేని హాస్పిటల్స్ ఎండీ కామినేని శశిధర్ పేర్కొన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, పరిశోధన, పర్యాటకం, హరిత ఇంధనం, వ్యవసాయం వంటి కీలక రంగాలకు బడ్జెట్లో పెద్దపీట వేసినట్లు, భారత్ బయోటెక్ ఎండీ, సీఐఐ- దక్షిణ ప్రాంత ఛైర్పర్సన్ సుచిత్ర ఎల్ల అన్నారు. కొవిడ్ మహమ్మారి, ఇతరత్రా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో, భరోసా కల్పించేదిగా ఇందులో ప్రతిపాదనలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్