భారత ఇంధన రంగంలో అపార అవకాశాలు
ప్రస్తుతం ఇంధన రంగంలో పెట్టుబడులకు భారత్లోనే అపార అవకాశాలు ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
వచ్చే దశాబ్దంలో అధిక గిరాకీ ఇక్కడే
ఇండియా ఎనర్జీ వీక్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఈనాడు, బెంగళూరు: ప్రస్తుతం ఇంధన రంగంలో పెట్టుబడులకు భారత్లోనే అపార అవకాశాలు ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశీయంగా అధిక ఇంధన గిరాకీ, స్థిరమైన నాయకత్వం, సంస్కరణలు వంటివి అంతర్జాతీయ పెట్టుబడులకు అనువుగా ఉన్నాయని తెలిపారు. ‘ఇండియా ఎనర్జీ వీక్ 2023’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వచ్చే దశాబ్దంలో ప్రపంచంలో ఎక్కువ ఇంధన గిరాకీ వృద్ధి భారత్లోనే ఉండొచ్చన్నారు. అంతర్జాతీయ ఇంధన సంఘం లెక్కల ప్రకారం.. ప్రపంచ చమురు గిరాకీలో భారత వాటా 5 శాతంగా ఉందని, ఇది 11 శాతానికి పెరగొచ్చని చెప్పారు. గ్యాస్ గిరాకీ 500 శాతం అధికం కావొచ్చన్నారు. భారత ఇంధన రంగానికి సంబంధించి అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని కార్పొరేట్లకు సూచించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
‘‘ఇంధన రంగంలో చేపడుతున్న సంస్కరణలు భారత్ వికసిస్తోందనేందుకు సరైన నిదర్శనం. ఈ సంస్కరణల ఫలాలు దేశంలో స్వదేశీ, ఆధునిక ఇంధన ఉత్పత్తులకు నాంది పలికింది. చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడటం తగ్గించేందుకు పునరుత్పాదక ఇంధన, బయో ఇంధనాలు, హైడ్రోజన్ వంటి వాటిపై దృష్టి పెట్టి, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. 2030 నాటికి ఇంధన మిశ్రమంలో సహజవాయువును వినియోగించేందుకు కృషి చేస్తున్నాం. విద్యుత్తు వాహనాలు, హైడ్రోజన్ ద్వారా కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలు క్రమంగా సాధిస్తున్నాం. ప్రస్తుతం దేశ వార్షిక చమురు శుద్ధి సామర్థ్యం 250 మెట్రిక్ టన్నులు ఉండగా దీన్ని 450 ఎంఎంటీపీఏకు చేర్చనున్నాం. ఈ- ఇంధనం, 2జీ ఎథనాల్ బయో రిఫైనరీ రంగంలోనూ 12 వాణిజ్య 2జీ ఎథనాల్ ప్లాంట్లను తయారీకి సన్నాహకాలు చేస్తున్నాం.’’
11 రాష్ట్రాల్లో 20% ఎథనాల్ కలిపిన పెట్రోలు
ఈ-20 ఇంధనం, అన్బాటిల్డ్ యూనిఫార్మ్, ఆయిల్ ఇండోర్ సౌర వంట వ్యవస్థలను ప్రధాని మోదీ ప్రారంభించారు. అదే సమయంలో 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన పెట్రోలు బంకుల్లో 20 శాతం ఎథనాల్ కలిపిన పెట్రోలు అమ్మకాలను సైతం ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఇంధన మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తదితరులు పాల్గొన్నారు.
హెచ్ఏఎల్ ప్రగతితో విపక్షాలకు గట్టి జవాబు: హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఒప్పందాలపై విపక్షాలు చేసిన తప్పుడు ఆరోపణలకు ఆ సంస్థ సాధిస్తున్న ప్రగతితో జవాబు చెబుతున్నట్లు మోదీ అన్నారు. సోమవారం కర్ణాటకలోని తుమకూరు పరిసరాల్లో హెచ్ఏఎల్ హెలికాప్టర్ ఫెసిలిటీ, స్ట్రక్చర్ హ్యాంగర్ కర్మాగారాన్ని ప్రారంభించారు. వైమానిక రంగంలో గత ఎనిమిదేళ్లలో పెట్టిన పెట్టుబడులు 2014కు ముందు 15 ఏళ్ల పెట్టుబడుల కంటే 15 రెట్లు అధికమని ప్రధాని విశ్లేషించారు. ప్రస్తుతం తుమకూరులో ప్రారంభించిన ఉత్పాదక కేంద్రం ద్వారా భవిష్యత్తులో రూ.4 లక్షల కోట్ల వ్యాపారం సాధ్యమన్నారు. ఈ కేంద్రం కేవలం సైనిక శక్తిని పెంచేందుకే కాకుండా ఉపాధి అవకాశాలను విస్తృతం చేస్తుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
మొబైల్లో వచ్చిన మెసేజ్ను హెడ్డర్ సాయంతో ఎవరు పంపారో ఇట్టే కనిపెట్టేయొచ్చు. అదెలాగంటే..? -
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
Air India Express: తొలిసారి ఓటు వేయబోయే వారిని దృష్టిలో ఉంచుకొని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. అదేంటో చూద్దాం.. -
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
Best Airports: స్కైట్రాక్స్ ఏటా ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాను విడుదల చేస్తుంటుంది. వీటిలో తొలి 20 స్థానాల్లో ఏవి నిలిచాయి? భారత్లోని ఎయిర్పోర్టుల పరిస్థితి ఏంటో చూద్దాం.. -
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
Google layoffs: గూగుల్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు జపాన్ కంపెనీ తోషిబా సైతం ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 334 పాయింట్లు లాభపడి 73,278 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 22,268 దగ్గర కొనసాగుతోంది. -
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
తాజా వార్తలు (Latest News)
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
-
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల