రెండో రోజూ అమ్మకాల ఒత్తిడి
వరుసగా రెండో రోజూ సూచీలు నష్టాలు చవిచూశాయి. ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ప్రకటనకు ముందు ఎఫ్ఎమ్సీజీ, లోహ, వాహన షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
సమీక్ష
వరుసగా రెండో రోజూ సూచీలు నష్టాలు చవిచూశాయి. ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ప్రకటనకు ముందు ఎఫ్ఎమ్సీజీ, లోహ, వాహన షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 6 పైసలు తగ్గి 82.70 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.79% పెరిగి 81.78 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ ఉదయం 60,511.32 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఇంట్రాడేలో 60,063.49 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. ఆఖర్లో కొంత కోలుకుని 220.86 పాయింట్ల నష్టంతో 60,286.04 వద్ద ముగిసింది. నిఫ్టీ 43.10 పాయింట్లు తగ్గి 17,721.50 దగ్గర స్థిరపడింది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 21 డీలాపడ్డాయి. టాటా స్టీల్ 5.23%, ఐటీసీ 2.65%, సన్ఫార్మా 1.74%, మారుతీ 1.72%, హెచ్సీఎల్ టెక్ 1.59%, టాటా మోటార్స్ 1.50%, హెచ్యూఎల్ 1.29%, విప్రో 1.09%, అల్ట్రాటెక్ 0.73% చొప్పున నష్టపోయాయి. కోటక్ బ్యాంక్ 1.59%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.22%, బజాజ్ ఫైనాన్స్ 0.90%, బజాజ్ ఫిన్సర్వ్ 0.61% రాణించాయి.
14% దూసుకెళ్లిన అదానీ ఎంటర్ప్రైజెస్: 1114 మిలియన్ డాలర్ల విలువైన రుణాలను ముందస్తుగా చెల్లించి.. అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్ షేర్లను తనఖా నుంచి విడిపిస్తామని అదానీ గ్రూప్ ప్రకటించిన నేపథ్యంలో, మంగళవారం 6 అదానీ గ్రూప్ షేర్లు రాణించాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 14.63% పరుగులు తీసి రూ.1802.50 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్ 1.33%, అదానీ విల్మర్ 4.99%, ఏసీసీ 1.32%, అంబుజా సిమెంట్స్ 1.12%, ఎన్డీటీవీ 1.07% చొప్పున రాణించాయి. అదానీ టోటల్ గ్యాస్ 5%, అదానీ గ్రీన్ 5%, అదానీ పవర్ 4.99%, అదానీ ట్రాన్స్మిషన్ 0.77% నష్టపోయాయి. హిండెన్బర్గ్ నివేదిక వెలువడిన (జనవరి 24 నుంచి) ఇప్పటివరకు అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ.9.2 లక్షల కోట్లు ఆవిరైంది.
* బలహీన త్రైమాసిక ఫలితాలతో టాటా స్టీల్ షేరు 5.23% కోల్పోయి రూ.111.45 వద్ద ముగిసింది.
* బీమా సేవలు అందించే గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ఐపీఓ పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెనక్కి పంపింది. తాజా సమాచారంతో కంపెనీ ముసాయిదా పత్రాలను మళ్లీ దాఖలు చేయాలని చూస్తోంది. కంపెనీ 2022 ఆగస్టులో ఐపీఓకు దరఖాస్తు చేసుకుంది.
* దివాలా పరిష్కార ప్రక్రియ ఎదుర్కొంటున్న రిలయన్స్ క్యాపిటల్కు రెండో విడత ఆర్థిక బిడ్లు కోరుతూ రుణదాత దాఖలు చేసిన పిటిషన్పై టొరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇతర ప్రతివాదులకు ఎన్సీఎల్ఏటీ నోటీసులు జారీ చేసింది.
* వొడాఫోన్ ఐడియా రూ.16,133 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రభుత్వానికి కేటాయించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ కేటాయింపు తర్వాత కంపెనీలో ప్రభుత్వానికి 33.44 శాతం వాటా ఉంటుంది. సంస్థలో ప్రభుత్వమే అతిపెద్ద వాటాదారు అవుతుంది. ప్రమోటర్ల వాటా 75 శాతం నుంచి దాదాపు 50 శాతానికి దిగివస్తుంది.
నేటి బోర్డు సమావేశాలు: ఎస్కార్ట్స్, అదానీ పవర్, అదానీ విల్మర్, లిఖితా ఇన్ఫ్రా, మిధానీ, ఎన్సీసీ, కమిన్స్, ఈక్విటాస్ బ్యాంక్, శ్రీసిమెంట్, గతీ, గ్రాఫైట్, ఇర్కాన్, సింఫనీ, ట్రెంట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మస్క్(Elon Musk) భారత్ పర్యటన మరింత ఆలస్యం కానుంది. -
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్