ఆర్పు రూ.300 స్థాయిలకు చేరితేనే పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం
టెలికాం నెట్వర్క్ కంపెనీలకు పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం రావాలంటే.. వినియోగదారుపై సగటు ఆదాయం (ఆర్పు) నెలకు రూ.300 స్థాయికి చేరడం కీలకమని భారతీ ఎయిర్టెల్ సీఈఓ గోపాల్ విత్తల్ తెలిపారు.
ఎయిర్టెల్ సీఈఓ
దిల్లీ: టెలికాం నెట్వర్క్ కంపెనీలకు పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం రావాలంటే.. వినియోగదారుపై సగటు ఆదాయం (ఆర్పు) నెలకు రూ.300 స్థాయికి చేరడం కీలకమని భారతీ ఎయిర్టెల్ సీఈఓ గోపాల్ విత్తల్ తెలిపారు. ఇది త్వరలోనే జరుగుతుందని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. వైవిధ్యభరిత పోర్ట్ఫోలియో, అధిక వ్యాపారావకాశాలున్న గ్రామాలపై దృష్టి, అత్యుత్తమ 150 నగరాల్లోని అవకాశాలను అందిపుచ్చుకోవడం లాంటివి ఎయిర్టెల్ భవిష్యత్ వ్యూహాలని తెలిపారు. హరియాణా, ఒడిశా అనంతరం 17 సర్కిళ్లలో ప్రారంభ స్థాయి ప్రీపెయిడ్ టారిఫ్ను రూ.99 నుంచి రూ.155కు భారతీ ఎయిర్టెల్ పెంచింది. అక్టోబరు- డిసెంబరులో భారతీ ఎయిర్టెల్ ఆర్పు రూ.163 నుంచి రూ.193కు పెరిగింది. టారిఫ్ల పెంపు ఒకే రీతిలో లేవని.. ఒకవేళ తాము అలా చేస్తే మార్కెట్ వాటాను కోల్పోవాల్సి వస్తుందని గోపాల్ తెలిపారు. అదే జరిగితే మళ్లీ మార్కెట్ వాటాను తిరిగి సంపాదించుకోవడం కష్టం అవుతుందని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Umran - Ishant: బ్యాటర్లు భయపడేలా.. ఇంకా వేగం పెంచు : ఉమ్రాన్కు ఇషాంత్ సలహా
-
World News
Imran Khan: నన్ను కోర్టులోనే చంపేస్తారేమో: ఇమ్రాన్ ఖాన్
-
Movies News
Ramya Krishnan: ఇలాంటి సినిమా ఎవరు చూస్తారని అడిగా: రమ్యకృష్ణ
-
Politics News
Arvind Kejriwal: కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
Crime News
Fake Currency: నకిలీ నోట్ల అడ్డా.. చేనేతపురి!
-
Ts-top-news News
Salarjung Museum: సాలార్జంగ్ మ్యూజియం.. ఆన్లైన్లోనూ వీక్షించొచ్చు..