ఇంజినీరింగ్ విద్యార్థులకు కోడింగ్ నేర్పిస్తాం
దేశంలో ఏటా పదిహేను లక్షలకు పైగా విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసుకుంటున్నారు. కానీ, డిగ్రీ పూర్తికాగానే ఉద్యోగాల్లో చేరుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.
ఈనాడు - హైదరాబాద్
దేశంలో ఏటా పదిహేను లక్షలకు పైగా విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసుకుంటున్నారు. కానీ, డిగ్రీ పూర్తికాగానే ఉద్యోగాల్లో చేరుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. చాలామంది పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు లేక వెనుకబడిపోతున్నారు. ఒక నివేదిక ప్రకారం 95 శాతం మంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ కొలువులో చేరడానికి అవసరమైన కోడింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పరిజ్ఞానం సరిగా ఉండటం లేదు. ఇంజినీరింగ్లో చేరినప్పటి నుంచే ఈ విషయంపై దృష్టి సారించి, అవసరమైన అంశాలన్నీ నేర్పిస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన నుంచి పుట్టిన అంకురమే మెరిట్కర్వ్. కళాశాల స్థాయిలోనే విద్యార్థులకు తగిన శిక్షణ ఇవ్వడమే తమ పని అని వివరిస్తున్నారు ఈ సంస్థ వ్యవస్థాపకుడు కె.ప్రశాంత్రెడ్డి.
‘మాది ఖమ్మం. ఇంటర్మీడియట్ వరకూ అక్కడే చదివాను. చిన్నప్పటి నుంచీ కంప్యూటర్ సైన్స్ అంటే ఇష్టం. ఇంజినీరింగ్ బెంగళూరులోని ఒక కాలేజీలో చేరాను. ఆ సమయంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు విద్యార్థులను గమనించేవాడిని. కొంతమందికి కోడింగ్ నైపుణ్యాలు ఉంటే, మరికొంతమంది వెనకబడే వారు. ఇరవై ఏళ్ల క్రితం బోర్డుపై నేర్పినట్లుగా ఇప్పుడూ కోడింగ్ నేర్పిస్తే ఫలితం ఉండదు. ఐటీ సంస్థల అవసరాలను గుర్తించి, అందుకు అనుగుణంగా ఉండాలని ఆలోచన ఉండేది. దీనికి పరిష్కారాన్ని వెతుకుతూనే ఎంఎన్సీలో ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత ఫేస్బుక్లో డెవలపర్స్ సర్కిల్స్లో భాగమయ్యాను. పలు అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొన్నాను. కోడింగ్లో శిక్షణ ఇచ్చేలా సొంతంగా సంస్థను స్థాపించాలనే లక్ష్యంతో ఇటువైపు అడుగులు వేశాను. 2020లో నా ఆలోచనను ఆచరణలో పెట్టాను. బెంగళూరులో ప్రారంభించినప్పటికీ, 2022 నుంచి టి-హబ్కు మారిపోయాం.
ఏం చేస్తామంటే..
ఇంజినీరింగ్ కాలేజీలతో భాగస్వామ్యం కుదుర్చుకొని, ప్లాట్ఫాం యాజ్ ఏ సర్వీస్ (పాస్) విధానంలో విద్యార్థులకు కోడింగ్ నేర్పిస్తాం. దీనికోసం మొదటి ఏడాది నుంచే విద్యార్థులను మా ప్లాట్ఫాంపైకి తీసుకొస్తాం. కొవిడ్ సమయంలో ఎడ్యుటెక్ సంస్థలు బాగా పనిచేశాయి. ఇది మాకూ ఒక రకంగా కలిసొచ్చిందనే చెప్పాలి. బ్లాక్ బోర్డు నుంచి ఆన్లైన్లోకి కోడింగ్ శిక్షణను తీసుకొచ్చేందుకు ఉపయోగపడింది. ఒక విద్యార్థికి కోడింగ్ నైపుణ్యాలు ఎలా ఉన్నాయి, ఎక్కడ మెరుగుపర్చుకోవాలి అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుంటాం. 100కు పైగా సమస్యలను పరిష్కరించేలా వారికి శిక్షణ ఉంటుంది. దీనివల్ల వారు కోడింగ్లో రాటుదేలుతారు. కృత్రిమ మేధ వారి నైపుణ్యాలను గమనిస్తూ ఉంటుంది.
ఇప్పటి వరకూ..
ప్రస్తుతం మేము 12 ఇంజినీరింగ్ కాలేజీలతో ఒప్పందం కుదుర్చుకొని, సేవలను అందిస్తున్నాం. ఇలా ఏడాదికి 1,500 మందికి పైగా కొత్త విద్యార్థులు మా ప్లాట్ఫాంను వినియోగించుకుంటున్నారు. టి-హబ్తో కలిసి ఇంటర్న్షిప్ మేళాను నిర్వహించాం. రెండు విడతల్లో జరిగిన ఈ కార్యక్రమంలో 80కి పైగా విద్యాసంస్థల నుంచి 5,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 200 స్టార్టప్లు వీరిలో కొందరికి ఉద్యోగాలు ఇస్తామని ముందుకు వచ్చాయి.
రెండేళ్లలో 60,000 మందికి..
ఈ ఏడాదిలో కొత్తగా 20 కాలేజీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటాం. 2025 నాటికి 60వేల మంది విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించాలన్నది మా ఆలోచన. ఇప్పుడు 11 మంది ఉన్న మా బృందంలో కొత్తగా మరో 10 మందినీ తీసుకుంటాం. ప్రస్తుతానికి సొంత నిధులు, వస్తున్న ఆదాయంతోనే మా సంస్థ నడుస్తోంది. మా అంచనాలు అందుకున్న తర్వాత పెట్టుబడుల కోసం వెళ్తాం. దేశంలోని ఇంజినీరింగ్ విద్యార్థుల్లో 5శాతం మందికి మా ద్వారా శిక్షణ అందాలన్నదే మా లక్ష్యం.’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్.. తన కంపెనీలో పని చేస్తున్న సగానికి పైగా ఉద్యోగులకు ఏఐలో శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించింది. -
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
E- insurance: కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి బీమా పాలసీల డిజిటలైజేషన్ను తప్పనిసరి చేస్తున్నట్లు ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
March 31 Deadline: ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆర్బీఐ, ఐఆర్డీఏఐ, ఆదాయ పన్ను విభాగాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. -
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
Afcons Infra IPO: ఐదేళ్ల తర్వాత షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ వస్తోంది. నిర్మాణ రంగ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్మన్కు 25 ఏళ్ల జైలు శిక్ష
Sam Bankman Fried: క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఆర్థిక మోసాలు, అక్రమ నగదు చలామణి వంటి నేరాలకు పాల్పడ్డట్లు నవంబరులో తేల్చిన న్యూయార్క్ కోర్టు తాజాగా ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్