కొత్త పన్ను విధానంతో మధ్య తరగతికి లబ్ధి
కొత్త పన్ను విధానంతో మధ్య తరగతికి లబ్ధి చేకూరుతుందని, వారి చేతుల్లో మరింత నగదు మిగులుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
‘అదానీ’ అంశం నియంత్రణ సంస్థల చేతుల్లో
సుప్రీంలో ప్రభుత్వం ఏం చెప్పిందన్నది వెల్లడించం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
దిల్లీ: కొత్త పన్ను విధానంతో మధ్య తరగతికి లబ్ధి చేకూరుతుందని, వారి చేతుల్లో మరింత నగదు మిగులుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. బడ్జెట్ అనంతరం ఆర్బీఐ కేంద్ర బోర్డుకు ఇచ్చిన ప్రసంగం తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాల్లో ప్రజలతో పెట్టుబడులు పెట్టించాల్సిన అవసరం లేదని, పెట్టుబడుల విషయంలో వ్యక్తిగత నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ‘బడ్జెట్లో కొత్త పన్ను విధానంలోనూ స్టాండర్డ్ డిడక్షన్ను ప్రతిపాదించాం. ఇదే సమయంలో శ్లాబ్లు, పన్ను రేట్లలో మార్పులు చేశాం. దీంతో పన్ను చెల్లింపుదార్లకు మరింత లబ్ధి చేకూరనుంది. పెట్టుబడులు, వ్యయాల విషయంలో సంపాదించే వ్యక్తులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి’ అని అన్నారు. కొత్త పన్ను చెల్లింపు విధానంలో రూ.7 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రకటించారు. మధ్య తరగతిపై పన్ను భారం తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ప్రత్యక్ష పన్నులను సులభతరం చేస్తామని ఇచ్చిన హామీ అనుగుణంగా చేపట్టామని వివరించారు. 2023-24లో రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు 5.3 శాతంగా నమోదుకావొచ్చని, ముడి చమురు ధరలు ఇదే విధంగా ఉంటే మరింత తగ్గొచ్చని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం అంచనాకు బ్యారెల్ ముడిచమురును 95 డాలర్లుగా లెక్కకట్టామని తెలిపారు. రుణ, డిపాజిట్ రేట్లపై బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయని అన్నారు. రుణ మంజూరు, జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు నేషనల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీ (ఎన్ఎఫ్ఐఆర్)ను తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.
క్రిప్టో నియంత్రణపై జీ20 సమావేశాల్లో చర్చ
క్రిప్టో కరెన్సీ ఆస్తుల నియంత్రణ అంశాన్ని జీ20 సమావేశాల్లో చర్చిస్తామని, ఈ విషయంలో అందరూ కలిసి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్ అన్నారు. ‘క్రిప్టో అనేది పూర్తి టెక్నాలజీ ఆధారితమైనది. మానవ ప్రమేయానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. కేవలం ఒక్కదేశం నిబంధనలు రూపొందించలేదు కాబట్టి అన్ని దేశాలు సంయుక్తంగా నియమావళిని తీసుకురావాల్సి ఉంది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) రూపకల్పనపై చర్చించనున్నాం’ అని తెలిపారు.
నియంత్రణ సంస్థలే చూసుకుంటాయ్: అదానీ గ్రూప్ సంక్షోభానికి సంబంధించి విషయాన్ని నియంత్రణ సంస్థలు చూసుకుంటాయని, మన నియంత్రణ సంస్థలు చాలా అనుభవం కలిగినవని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అదానీ గ్రూప్ షేర్ల పతనం అనంతరం సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ‘కోర్టులో ప్రభుత్వం ఏం చెప్పిందో నేను వెల్లడించలేను. భారత నియంత్రణ సంస్థలకు చాలా అనుభవం ఉంది. ప్రస్తుతం అదానీ అంశాలను అవి పర్యవేక్షిస్తున్నాయ’ని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఆ వార్తలు అవాస్తవం’: అమెరికా దర్యాప్తు చేపట్టిందన్న కథనంపై అదానీ గ్రూప్ స్పందన
లంచం ఆరోపణల విషయంలో దర్యాప్తు గురించి వెలువడిన మీడియా కథనం అవాస్తవమని అదానీ గ్రూప్(Adani Group) వెల్లడించింది. -
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. -
2024-25లోనూ ఐటీ నియామకాలు అంతంతే
ఐటీ రంగం ఆకర్షణీయ వృద్ధి బాట పట్టేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పరిస్థితి ఉంటుందనే అంశమే కాస్త ఊరట కలిగిస్తోంది. -
దీర్ఘకాలంలో చిన్న, మధ్య షేర్లు బలంగానే
చిన్న, మధ్య స్థాయి షేర్ల విలువలు మరీ అధిక స్థాయికి చేరాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చేసిన వ్యాఖ్యలతో ఈ షేర్లు గత 3 వారాల్లో భారీగా కుదేలయ్యాయి. -
ఆఫీసుకు వస్తేనే పదోన్నతులు
కార్యాలయాలకు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని తమ ఉద్యోగులకు స్పష్టం చేస్తూ ల్యాప్ట్యాప్ల తయారీ కంపెనీ డెల్ లేఖ పంపినట్లు తెలుస్తోంది. -
రూ.1991కే ఫ్లై91 ప్రయాణం
ఫ్లై91 సంస్థ సోమవారం తన విమాన సర్వీసులను ప్రారంభించింది. మొదటి విమానం గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం గం.7.55కు బయలుదేరి వెళ్లింది. -
ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగింది: హైర్ ప్రో
అంతక్రితం ఏడాదితో పోలిస్తే, 2022-23 ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగినట్లు ఏఐ పవర్డ్ రిక్రూట్మెంట్ ఆటోమేషన్ సంస్థ హైర్ ప్రో నివేదిక వెల్లడించింది. -
అంకురాలకు విలువే సర్వస్వం కాదు
పారదర్శకత, నైతిక ప్రవర్తన కోసం స్వీయ నియంత్రణ విధానాన్ని దేశీయ అంకుర సంస్థలు అవలంబించాలని జీ20లో భారత తరపు ప్రధాన ప్రతినిధి (షెర్పా) అమితాబ్ కాంత్ తెలిపారు. -
మదుపర్ల అప్రమత్తత
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడనున్నందున, మదుపర్లు అప్రమత్తత పాటించారు. -
బీమా రంగంలోకి రూ.54,000 కోట్ల ఎఫ్డీఐ
గత తొమ్మిదేళ్లలో బీమా రంగం రూ.54,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను ఆకర్షించిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. -
బెంగళూరు- లక్షద్వీప్ విమాన సర్వీసు: ఇండిగో
లక్షద్వీప్కు విమాన సదుపాయాన్ని విస్తరించడంలో భాగంగా ఈనెల 31 నుంచి బెంగళూరు- అగత్తి మధ్య నేరుగా విమాన సర్వీసులను నడుపుతున్నట్లు ఇండిగో సోమవారం వెల్లడించింది. -
మనవడికి రూ.240 కోట్ల ఇన్ఫోసిస్ షేర్లు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, తన మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి భారీ బహుమతి ఇచ్చారు. -
సంక్షిప్త వార్తలు
ఈ వేసవిలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అంతర్జాతీయ విమాన సర్వీసులను 20 శాతానికి పైగా పెంచనుంది. దేశ, విదేశీ మార్గాల్లో రోజువారీ 360కి పైగా విమాన సర్వీసులను నడపబోతోంది. -
WhatsApp: వాట్సప్ పేమెంట్స్ ఇక మరింత సులువుగా.. ఇక చాట్ లిస్ట్లోనే
WhatsApp payments: వాట్సప్లో పేమెంట్స్ ఇక మరింత సులువు కానుంది. చాట్ లిస్ట్లోనే ఇకపై క్యూఆర్ కోడ్ స్కానర్ కనిపించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్దేవ్బాబాకు సుప్రీంకోర్టు సమన్లు
-
SS Rajamouli: త్వరలో షూటింగ్.. మహేశ్ మూవీపై జక్కన్న అప్డేట్
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్