మా ఖాతాలకు ఢోకా లేదు
తమ కంపెనీల బ్యాలెన్స్షీట్లు బలంగా ఉన్నాయని అదానీ గ్రూప్ పునరుద్ఘాటించింది. వ్యాపార కార్యకలాపాలను ప్రణాళిక మేరకు కొనసాగించడంపై దృష్టి కేంద్రీకరించినట్లు పేర్కొంది.
అదానీ గ్రూప్ పునరుద్ఘాటన
దిల్లీ: తమ కంపెనీల బ్యాలెన్స్షీట్లు బలంగా ఉన్నాయని అదానీ గ్రూప్ పునరుద్ఘాటించింది. వ్యాపార కార్యకలాపాలను ప్రణాళిక మేరకు కొనసాగించడంపై దృష్టి కేంద్రీకరించినట్లు పేర్కొంది. కంపెనీల షేర్ల ధరలు పతనమవుతున్న నేపథ్యంలో, మదుపర్లలో విశ్వాసాన్ని పెంచడం కోసం గ్రూప్ యత్నాలు చేస్తోంది. అంతర్గత నియంత్రణలు, నిబంధనలు, కార్పొరేట్ పాలన విషయంలో గ్రూప్ చాలా విశ్వాసంగా ఉందని గ్రూప్ సీఎఫ్ఓ జుగేషిందర్(రాబీ) సింగ్ ఫలితాల ప్రకటనల అనంతరం నిర్వహించిన ‘ఎర్నింగ్ కాల్’లో పేర్కొన్నారు. అప్పులు, వడ్డీలు తీర్చే సామర్థ్యం, అందుకు సరిపడా నగదు నిల్వలు ఉన్నాయని ఒక ప్రకటనలో గ్రూప్ తెలిపింది. ‘ఒక్కసారి మార్కెట్లో స్థిరత్వం ఏర్పడితే, మా మూలధన మార్కెట్ వ్యూహాన్ని సమీక్షిస్తాం. వ్యాపార ప్రణాళికల కొనసాగింపుతో పాటు వాటాదార్లకు మంచి ప్రతిఫలాలను ఇస్తామన్న విశ్వాసం ఉంద’ని సింగ్ పేర్కొన్నారు.
నగదు ప్రవాహానికి ఇబ్బంది లేదు: 2022 సెప్టెంబరు నాటికి అదానీ గ్రూప్ స్థూల రుణాలు రూ.2.26 లక్షల కోట్లుగా ఉండగా.. నగదు నిల్వలు రూ.31,646 కోట్లే ఉన్నాయి. ‘మా వ్యాపారాలను దీర్ఘకాల యాన్యుటీ కాంట్రాక్టులపై నిర్వహిస్తున్నాం. కాబట్టి ఎటువంటి మార్కెట్ నష్టభయమూ లేకుండా స్థిరంగా నగదు ప్రవాహం ఉంటుంద’ని కంపెనీ ఈ సందర్భంగా పేర్కొంది.
ఎఫ్పీఓ ఉపసంహరణ ప్రభావం ఉండదు: మార్కెట్ ప్రస్తుత స్థితి తాత్కాలికమేనని అదానీ ఎంటర్ప్రైజెస్ ఫలితాల సందర్భంగా గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ పేర్కొన్న సంగతి విదితమే. సీఎఫ్ఓ మాట్లాడుతూ ‘అదానీ ఎంటర్ప్రైజెస్కు 25 ఏళ్ల అనుభవం ఉంది. ఒక క్రమపద్ధతిలో మూలధనాన్ని వినియోగించి, వాటాదార్లకు విలువ అందిస్తూ వచ్చింది. ఈ సమయంలోనే భారత వృద్ధి, ఆర్థిక సౌభ్రాతృత్వానికి అవసరమైన రంగాల్లో అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మర్ వంటి కంపెనీలను ఏర్పాటు చేశామ’ని తెలిపారు. ఎఫ్పీఓ ఉపసంహరణపై మాట్లాడుతూ ‘అనిశ్చిత మార్కెట్ వల్లే ఆ నిర్ణయం తీసుకుంది. మా ప్రస్తుత, భవిష్యత్ ప్రణాళికలకు ఇది ఏ విధమైన ప్రభావం చూపబోద’ని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!