Vedanta: అప్పుల ఒత్తిళ్లలో అనిల్ అగర్వాల్.. ఇంకో తుపాను రావొచ్చంటున్న ఎస్ అండ్ పీ
ఒక్క నెల రోజుల్లోనే 236 బిలియన్ డాలర్ల గౌతమ్ అదానీ సామ్రాజ్యం కాస్తా అయిదింట మూడొంతులను కోల్పోయింది. అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో పాటు.. అంత కంటే వేగంతో సంపదను కోల్పోయిన కారణంగా అదానీ, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో ఆందోళనకు కారణమయ్యారు.
కొత్త రుణాలు పుట్టడమే కీలకం
హిందుస్థాన్ జింక్ నుంచి నగదు వచ్చినా సరే
ఒక్క నెల రోజుల్లోనే 236 బిలియన్ డాలర్ల గౌతమ్ అదానీ సామ్రాజ్యం కాస్తా అయిదింట మూడొంతులను కోల్పోయింది. అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో పాటు.. అంత కంటే వేగంతో సంపదను కోల్పోయిన కారణంగా అదానీ, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో ఆందోళనకు కారణమయ్యారు. ఇంకో భారతీయ కుబేరుడు, వేదాంతా అధిపతి అనిల్ అగర్వాల్ కూడా మార్కెట్లలో చిన్న తుపానును సృష్టించే అవకాశం ఉందని అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే దిగ్గజ విశ్లేషణా సంస్థ ఎస్ అండ్ పీ హెచ్చరించింది.
ఒకప్పుడు లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదైన వేదాంతా రిసోర్సెస్కు ఈయన అధిపతి. ఆ కంపెనీ ప్రస్తుతం రుణాల ఊబిలో చిక్కుకుంది. వచ్చే జనవరిలో 100 కోట్ల డాలర్ల బాండ్లకు గడువు తీరనుంది. అయితే తనకున్న రుణాలను ఈ కంపెనీ క్రమంగా తగ్గించుకుంటూ వస్తోంది. గత 11 నెలల్లో నికర అప్పులను 2 బిలియన్ డాలర్లు తగ్గించుకుని, 7.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.64,000 కోట్ల)కు పరిమితం చేసుకుంది. 2023 సెప్టెంబరు వరకు, ఈ సంస్థ చెల్లించాల్సిన రుణాలకు ఇబ్బందేమీ ఉండబోదనీ ఎస్ అండ్ పీ గ్లోబల్ ఇంక్ భిప్రాయపడింది. అయితే ఈ ఏడాది సెప్టెంబరు నుంచి 2024 జనవరి వరకు తీర్చాల్సిన రుణ, బాండ్ల కోసం 150 కోట్ల డాలర్ల (సుమారు రూ.12,450 కోట్ల) నిధుల సమీకరణ కోసం అగర్వాల్ చేస్తున్న ప్రయత్నాలకు ఎదురవుతున్న అడ్డంకులే ఆందోళన కరమని తెలిపింది.
వచ్చే కొద్ది వారాలు కీలకం..
‘అనిల్ అగర్వాల్ నిధుల సమీకరణకు వచ్చే కొద్ది వారాలు కీలకం కావొచ్చు. ఒక వేళ అందులో విఫలమైతే మాత్రం ఇప్పటికే ‘బి-’ క్రెడిట్ రేటింగ్లో ఉన్న బాండ్లు కాస్తా మరీ ఒత్తిడిలోకి వెళతాయ’ని ఎస్ అండ్ పీ ఈ నెలలోనే హెచ్చరించింది. అదానీకున్న 24 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.99 లక్షల కోట్ల) రుణంతో పోలిస్తే అగర్వాల్ అప్పులు మూడో వంతే అయినప్పటికీ.. ఈయన బాండ్ల రేటింగ్ మరీ తక్కువగా ఉండడమే ఆందోళన కలిగించే అంశం.
హిందుస్థాన్ జింక్ కాపాడుతుందనుకుంటే..
భారత ప్రభుత్వ సంస్థ అయిన హిందుస్థాన్ జింక్లో తన వాటాను రెండు దశాబ్దాల కిందటి నుంచే అగర్వాల్ పెంచుకుంటూ వెళ్లారు. హిందుస్థాన్ జింక్లో అంతక్రితంతో పోల్చితే తగ్గినా.. 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.16,600 కోట్ల)వరకు నగదు నిల్వలున్నాయి. ప్రతి త్రైమాసికంలో ఈ కంపెనీ 300-600 మి. డాలర్ల ఎబిటాను అందిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీలో వేదాంతా లిమిటెడ్కు 65 శాతం వాటా ఉంది. ఈ ఏడాది జనవరిలో టీహెచ్ఎల్ జింక్ మారిషస్ వాటాను, హిందుస్థాన్ జింక్కు విక్రయించాలని వేదాంతా నిర్ణయించింది. అందుకు కారణం లేకపోలేదు. వేదాంతాలో 70 శాతం వాటా వేదాంతా రిసోర్సెస్దే కావడం వల్ల ఈ ఒప్పందం ద్వారా 3 బిలియన్ డాలర్ల రుణాలను తగ్గించుకుందామని భావించారు. అయితే హిందుస్థాన్ జింక్లో ఇంకా 30% వాటా ఉన్న కేంద్రం మాత్రం అందుకు అంగీకరించలేదు. ఒక వేళ తమ మాట కాదని ముందుకెళితే చట్టపర చర్యలు తీసుకుంటామని ఈ నెల 17న రాసిన ఒక లేఖలో హెచ్చరించింది కూడా. మారిషస్ వాటా విలువపై తమకు అనుమానాలున్నాయని కేంద్రం పేర్కొంది.
ఇపుడు అగర్వాల్ ముందు రెండు సమస్యలు..
అనిల్ అగర్వాల్ ముందు ఇపుడు రెండు సమస్యలున్నాయి. హిందుస్థాన్ జింక్ వద్ద ఉన్న నగదు నిల్వలను వినియోగించుకోకపోతే తన రుణ సామర్థ్యం తగ్గుతుంది. అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సి ఉంటుంది. అమెరికాలోనూ తక్కువ వడ్డీకి తాజాగా అప్పులు పుట్టడం కష్టమే.
ఇక రెండో సమస్య రాజకీయపరమైనది. ఆస్తుల విక్రయానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే.. దేశీయంగా గుజరాత్లో, ఫాక్స్కాన్తో కలిసి అనిల్ అగర్వాల్ 19 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేస్తున్న సెమీకండక్టర్ ఫ్యాక్టరీపై నీలినీడలు ప్రసరించవచ్చు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ప్రతిపక్ష రాజకీయనాయకులు గుర్రుగా ఉన్నారు. ప్రాజెక్టును మహరాష్ట్ర నుంచి మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్కు మార్చడమే ఇందుకు కారణం. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలూ ఉన్నాయి. రఘురామ్రాజన్ వంటి ఆర్థివేత్తలు సైతం చిప్తయారీలో వేదాంతాకున్న అనుభవాన్ని ప్రశ్నించడం ప్రతికూలంగా మారుతోంది.
ఏడేళ్ల కిందటా ఇదే సమస్య
అగర్వాల్కు ఇదే సమస్య ఏడేళ్ల కిందటా ఎదురైనప్పటికీ.. హిందుస్థాన్ జింక్ ఇచ్చిన ప్రత్యేక డివిడెండుతో గట్టెక్కారు. ఆ సమయంలో కంపెనీ వద్ద 5 బి. డాలర్ల వరకు నగుదు నిల్వలున్నాయి. మైనారిటీ వాటాదారుగా ఆర్థిక మంత్రిత్వశాఖకూ తన వాటా దక్కింది. ఈ సారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అగర్వాల్కు అప్పుపుట్టడం కష్టంగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!