మహిళల పెట్టుబడులూ స్థిరాస్తికే
మహిళల దగ్గర డబ్బులుంటే బంగారం కొనేందుకే మొగ్గుచూపుతారనే భావన ఉంది. అయితే 65 శాతం మంది మహిళలు స్థిరాస్తిలో పెట్టుబడులపైనే ఆసక్తి కనబరుస్తున్నారని తమ సర్వేలో తేలిందని స్థిరాస్తి కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది.
బంగారంపై ఆసక్తి 8% మందికే
అనరాక్ సర్వే
దిల్లీ: మహిళల దగ్గర డబ్బులుంటే బంగారం కొనేందుకే మొగ్గుచూపుతారనే భావన ఉంది. అయితే 65 శాతం మంది మహిళలు స్థిరాస్తిలో పెట్టుబడులపైనే ఆసక్తి కనబరుస్తున్నారని తమ సర్వేలో తేలిందని స్థిరాస్తి కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. స్టాక్స్లో పెట్టుబడులు పెడతామని 20% మంది, బంగారం కొంటామని 8% మంది, కాలావధి డిపాజిట్ చేస్తామని 7% మంది వెల్లడించినట్లు పేర్కొంది. తాము మొత్తం 5500 మంది నుంచి అభిప్రాయాలు సమీకరించగా, అందులో సగం మంది మహిళలని వివరించింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం..
* రూ.45 లక్షలకు మించిన నివాసాలు కొనుగోలు చేసేందుకు చూస్తున్నట్లు 83% మంది మహిళలు తెలిపారు. రూ.45-90 లక్షల శ్రేణి సౌకర్యవంతమని 36% మంది, రూ.90 లక్షలు-రూ.1.5 కోట్ల విలువైన ఆస్తులపై 27% మంది, రూ.కోటిన్నరకు మించిన సౌధాలు కొంటామని 20% మంది తెలిపారు.
* రూ.45 లక్షల కంటే తక్కువ విలువైన నివాసాల కొనుగోలుపై అతి తక్కువ మంది ఆసక్తి కనబరచారని అనరాక్ గ్రూప్ వైస్ ఛైర్మన్ సంతోష్ కుమార్ తెలిపారు. నివసించేందుకు-పెట్టుబడుల కోసం ఇళ్లు కొనుగోలు చేసే వారి నిష్పత్తి 82:18 నుంచి 77:23కి మారినట్లు తెలిపారు. మహిళలు తప్పనిసరిగా ఇంటికి సహ యజమానిగా ఉండేలా రూపొందించిన ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన, వారి పేరిట ఇల్లు ఉంటే రుణ వడ్డీ - రిజిస్ట్రేషన్ సుంకంలో రాయితీల వంటివి మహిళల పేరిట ఇళ్ల నమోదుకు ఉపకరిస్తున్నాయని వెల్లడించారు.
రుణ చెల్లింపుల్లో అతివలే భేష్
వారికి ఇచ్చినవి రూ.16 లక్షల కోట్లు
ముంబయి: రుణాల తిరిగి చెల్లింపుల్లో పురుషులతో పోలిస్తే మహిళలే మేలని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ (సీఐసీ) ట్రాన్స్యూనియన్ సిబిల్ తెలిపింది. రుణ చెల్లింపు సామర్థ్యానికి దర్పణంగా నిలిచే క్రెడిట్ స్కోర్ పరంగా చూసినా, 57% మంది మహిళలు ‘ప్రైమ్’ విభాగంలోకి వస్తే, పురుషులు 51% మందే ఉన్నట్లు వివరించింది. వ్యక్తిగత రుణాలతో పాటు విలువైన సామగ్రి కొనుగోలుకు రుణాలు తీసుకోవడంలోనూ మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపింది. వ్యాపార రుణాల్లోనూ 32% మంది మహిళలే ఉంటున్నారు.
* దేశంలో 45.40 కోట్ల మంది మహిళలుంటే, 2022 నాటికి 6.3 కోట్ల మంది రుణాలు తీసుకున్నారు. 2022లో ఎక్కువమంది వ్యవసాయ రుణాలు, విలువైన వస్తువుల కొనుగోలుకు రుణం తీసుకున్నారు.
* మహిళల పేరిట ఇచ్చిన రుణాల మొత్తం రూ.16 లక్షల కోట్లకు చేరిందని, మొత్తం రుణాల్లో ఇది 19 శాతానికి సమానమని పేర్కొంది.
* 91.7 లక్షల మంది మహిళలు రుణాలు తీసుకోవడం ద్వారా, ఈ విభాగంలో తమిళనాడు దేశంలోనే ముందు ఉందని తెలిపింది.
8.5% నుంచే గృహ రుణాలు: బీఓబీ
దిల్లీ:ఈ నెల 31 వరకు గృహ రుణాలపై వడ్డీ రేటును 0.4% తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ప్రకటించింది. దీంతో బీఓబీ గృహ రుణాలు 8.5% నుంచి లభించనున్నాయి. ఎంఎస్ఎంఈ రుణాలపై ప్రారంభ వడ్డీ రేటును 8.40 శాతానికి తగ్గించారు. ప్రాసెసింగ్ ఛార్జీలను గృహరుణాలపై 100 శాతం, ఎంఎస్ఎంఈ రుణాలపై 50% తగ్గించామంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె