ఫండ్ పొదుపులో ‘నారి’ .. నిర్వహణలో కానరాదేమి?
‘భారతీయ మహిళలు స్వతహాగా పొదుపరులు. ఇంటి ఆర్థిక నిర్వహణలో వారిది అందెవేసిన చేయి’ అని ఎన్నో సర్వేలు తేల్చి చెప్పాయి. అయినా ఆర్థిక సేవల సంస్థల నిర్వహణకు వచ్చేసరికి మహిళల సంఖ్య పరిమితంగా ఉంటోంది.
సేవల రంగంలో మహిళలకు అరకొర ప్రాధాన్యం
ఈనాడు, హైదరాబాద్: ‘భారతీయ మహిళలు స్వతహాగా పొదుపరులు. ఇంటి ఆర్థిక నిర్వహణలో వారిది అందెవేసిన చేయి’ అని ఎన్నో సర్వేలు తేల్చి చెప్పాయి. అయినా ఆర్థిక సేవల సంస్థల నిర్వహణకు వచ్చేసరికి మహిళల సంఖ్య పరిమితంగా ఉంటోంది. బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్లు, బీమా సంస్థల్లో పురుషులే ఎక్కువగా ఎండీ, సీఈఓలుగా ఉండటమే ఇందుకు నిదర్శనం.
ఫండ్ మేనేజర్లలో 10% లోపే
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఛైర్ పర్సన్గా మాధవీ పురి బచ్ ఉన్నారు. ఎడిల్వైజ్ మ్యూచువల్ ఫండ్ సీఈఓగా రాధికా గుప్తా (33) వ్యవహరిస్తున్నారు. కోటక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ బిజినెస్ సీఈఓగా లక్ష్మీ అయ్యర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలా కొంతమందే ఉన్నత స్థానాల్లో ఉన్నారు.. మ్యూచువల్ ఫండ్ మేనేజర్ల విషయానికి వచ్చే సరికి పరిస్థితి నిరాశాజనకంగా ఉందని మార్నింగ్స్టార్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 31 నాటికి మొత్తం ఫండ్ల నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ దాదాపు రూ.39.62 లక్షల కోట్లు. వీటిని 428 మంది ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తున్నారు. ఇందులో 42 మందే మహిళా ఫండ్ మేనేజర్లు. అంటే 10% లోపే ఈ బాధ్యతల్లో ఉన్నారు. గతేడాది మహిళా దినోత్సవంతో పోలిస్తే మొత్తం ఫండ్ మేనేజర్ల సంఖ్య 399 నుంచి 428కి చేరగా, మహిళా మేనేజర్లు 10 మంది పెరిగారు.
24 సంస్థల్లో ఇలా
దేశంలోని 24 మ్యూచువల్ ఫండ్లను పరిశీలిస్తే.. 13 సంస్థల్లో ఒక్కో ఫండ్ మేనేజర్ మాత్రమే మహిళ. అయిదింటిలో ముగ్గురు - అంతకంటే ఎక్కువమంది, ఆరు సంస్థల్లో ఇద్దరు చొప్పున మహిళా ఫండ్ మేనేజర్లు ఉన్నారు.
రూ.4.43 లక్షల కోట్లు
మహిళా ఫండ్ మేనేజర్ల సంఖ్య తక్కువగానే ఉన్నా.. వారి నిర్వహణలోని మొత్తం ఆస్తులు రూ.4.43 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం ఫండ్ ఏయూఎంలో ఇది 11.19%. 2022 జనవరి నాటికి ఉన్న 11.98 శాతంతో పోలిస్తే ఇది తక్కువే. ప్రముఖ ఫండ్ మేనేజర్లు స్వాతి కులకర్ణి (యూటీఐ ఎంఎఫ్), లక్ష్మీ అయ్యర్ (కోటక్) ఫండ్ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఈ తగ్గుదల కనిపించిందని మార్నింగ్స్టార్ పేర్కొంది.
మెరుగైన ఫలితాలు
మహిళా మేనేజర్లు నిర్వహిస్తున్న ఫండ్లలో మంచి ఫలితాలు సాధించినట్లు మార్నింగ్స్టార్ పేర్కొంది. మహిళా ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తున్న ఓపెన్ ఎండెడ్ పథకాల్లో అవే విభాగంలోని ఫండ్లతో పోల్చినప్పుడు ఏడాది ప్రాతిపదికన 82%, మూడేళ్ల ప్రాతిపదికన 93%, అయిదేళ్ల సగటున 99% ఫండ్లు మంచి పనితీరును చూపించాయని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు