కాంపా కోలా మళ్లీ వచ్చేసింది
50 ఏళ్ల కిత్రం నాటి ప్రసిద్ధ పానీయ బ్రాండు ‘కాంపా కోలా’ను సరికొత్త రూపంలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ మళ్లీ విపణిలోకి విడుదల చేసింది.
విపణిలోకి తీసుకొచ్చిన రిలయన్స్
50 ఏళ్ల క్రితం నాటి పానీయం ఇది
తొలుత తెలుగు రాష్ట్రాల్లోనే
దిల్లీ: 50 ఏళ్ల కిత్రం నాటి ప్రసిద్ధ పానీయ బ్రాండు ‘కాంపా కోలా’ను సరికొత్త రూపంలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ మళ్లీ విపణిలోకి విడుదల చేసింది. గుజరాత్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సాఫ్ట్ డ్రింక్స్, పళ్ల రసాల తయారీ సంస్థ సోస్యో హజూరి బేవరేజెస్లో 50 శాతం వాటాను రిలయన్స్ రిటైల్కు చెందిన రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ ఈ ఏడాది జనవరిలో కొనుగోలు చేసింది. సోస్కో ఇంతకుమునుపే కాంపా బ్రాండును ప్యూర్ డ్రింక్స్ గ్రూపు నుంచి రూ.22 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో కాంపా బ్రాండును మళ్లీ కొత్త అవతారంలో రిలయన్స్ రిటైల్ ఆవిష్కరించింది. అదానీ, ఐటీసీ, యునిలీవర్ లాంటి దిగ్గజాలతో పోటీపడే నిమిత్తం సొంత ఉత్పత్తుల శ్రేణిని పెంచుకోవాలన్నదే సంస్థ ఉద్దేశం. ‘కాంపా ఉత్పత్తుల విభాగంలో తొలుత కాంపా కోలా, కాంపా లెమన్, కాంపా ఆరెంజ్ను తీసుకొచ్చినట్లు’ కంపెనీ తెలిపింది. తొలుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విపణుల్లో ఈ పానీయం లభ్యమవుతుందని, క్రమంగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని రిలయన్స్ పేర్కొంది. 200 - 500 - 600 - 1000 - 2000 మిల్లీలీటర్ల ప్యాక్లలో ఇవి లభిస్తాయని వివరించింది. వీటి ధరల వివరాలను ప్రకటించలేదు.
మళ్లీ ఆ నినాదంతోనే...
1949- 70 మధ్య భారత్లో కోకా- కోలాకు ప్యూర్ డ్రింక్స్ గ్రూపే పంపిణీదారుగా ఉండేది. ఆ తర్వాత 1970లో కాంపా కోలా పేరుతో సొంత బ్రాండును విడుదల చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకే సాఫ్ట్ డ్రింక్స్ విభాగంలో అగ్రగామిగా కూడా అవతరించింది. ఈ సంస్థకు ముంబయి, దిల్లీలలో బాట్లింగ్ ప్లాంట్లున్నాయి. ‘ద గ్రేట్ ఇండియన్ టేస్ట్’ నినాదంతో కాంపా కోలాను విక్రయించగా, అప్పట్లో వినియోగదార్ల నుంచి మంచి ఆదరణ లభించింది. 1990లో ప్రపంచీకరణకు భారత్ తలుపులు తెరవడం; కోక-కోలా, పెప్సీకో నుంచి పోటీ తీవ్రమై ప్యూర్ డ్రింక్స్ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత కాంపా కోలా బ్రాండును సోస్యో హజూరి బేవరేజెస్కు విక్రయించింది. ఇటీవలే సోస్యోలో మెజార్టీ వాటాను రిలయన్స్ దక్కించుకోవడంతో.. కాంపా కోలా బ్రాండు కూడా ఆ సంస్థ సొంతమైంది. కాంపాతో ‘ద గ్రేట్ ఇండియన్ టేస్ట్’ను మళ్లీ తీసుకొచ్చినట్లు రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్