పన్ను వసూళ్లు.. అంచనాలను చేరకపోవచ్చు
ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో సవరించిన పన్ను వసూళ్ల లక్ష్యం రూ.30.43 లక్షల కోట్లను ప్రభుత్వం చేరుకోలేకపోవచ్చని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో సవరించిన పన్ను వసూళ్ల లక్ష్యం రూ.30.43 లక్షల కోట్లను ప్రభుత్వం చేరుకోలేకపోవచ్చని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. బడ్జెట్తో పోలిస్తే ఏకంగా 10 శాతం మేర పన్ను లక్ష్యాలను పెంచడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. బడ్జెట్లో రూ.27.57 లక్షల కోట్ల పన్ను వసూళ్లను అంచనా వేయడం గమనార్హం. ‘ప్రత్యక్ష పన్నులు (ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నులు కలిపి) సవరించిన అంచనాలను చేరుకోవడం కష్టమే. నికర పన్ను వసూళ్లు రూ.15-15.5 లక్షల కోట్లకు పరిమితం కావొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 17 శాతం పెరిగి రూ.16.50 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేశారు. 2021-22లో ఇవి రూ.14.20 లక్షల కోట్లే. కార్పొరేట్ పన్ను రూ.8.35 లక్షల కోట్ల మేర వసూలు కావొచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 10.4 శాతం పెరిగి రూ.9.22 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8.15 లక్షల కోట్లు వసూలు కావొచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10.4 శాతం పెరిగి రూ.9 లక్షల కోట్లకు చేరొచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్ సుంకం వసూళ్లు 11 శాతం పెరిగి రూ.2.33 లక్షల కోట్లకు చేరొచ్చన్నది సవరించిన అంచనాగా సదరు అధికారి వివరించారు.
* పరోక్ష పన్నులకొస్తే జీఎస్టీ వసూళ్ల అంచనా ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.8.54 లక్షల కోట్లుగా ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 12 శాతం పెరిగి రూ.9.56 లక్షల కోట్లకు చేరొచ్చన్నది అంచనా.
* 2023-24లో ప్రత్యక్ష, పరోక్ష పన్నులు రెండూ కలిపి 10.45 శాతం వృద్ధితో రూ.33.61 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా. నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17 శాతం పెరిగి రూ.13.73 లక్షల కోట్లకు చేరొచ్చని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) గత వారం వెల్లడించింది. స్థూల ప్రాతిపదికన వసూళ్లు 22.58 శాతం పెరిగి రూ.16.68 లక్షల కోట్లకు చేరొచ్చని తెలిపింది.
* 2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 10 వరకు రూ.2.95 లక్షల కోట్ల పన్ను రిఫండ్లు చేసినట్లు సీబీడీటీ పేర్కొంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఇది 59.44 శాతం అధికం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!