స్మార్ట్ఫోన్ కంపెనీలకు షాక్!
దేశంలో స్మార్ట్ఫోన్ వినియోగదార్ల డేటా భద్రత, గోప్యతతో పాటు దేశ భద్రత ప్రయోజనాల దృష్ట్యా.. స్మార్ట్ఫోన్ కంపెనీలకు సరికొత్త భద్రతా నిబంధనలను తీసుకొచ్చే పనిలో ప్రభుత్వం ఉంది.
సరికొత్త భద్రతా నిబంధనల ప్రణాళికలో భారత్
ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ల తొలగింపునకూ వీలు
దేశంలో స్మార్ట్ఫోన్ వినియోగదార్ల డేటా భద్రత, గోప్యతతో పాటు దేశ భద్రత ప్రయోజనాల దృష్ట్యా.. స్మార్ట్ఫోన్ కంపెనీలకు సరికొత్త భద్రతా నిబంధనలను తీసుకొచ్చే పనిలో ప్రభుత్వం ఉంది. దీని వల్ల స్మార్ట్ఫోన్ కంపెనీలు తాము అనుకున్న సమయం కంటే ఆలస్యంగా కొత్త మోడళ్లను ఆవిష్కరించాల్సి రావొచ్చు. ప్రీ ఇన్స్టాల్డ్ యాప్ల ద్వారా వచ్చే ఆదాయాన్నీ కోల్పోవాల్సి రావొచ్చని ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది.
ప్రతిపాదిత నిబంధనలు ఇవీ
స్మార్ట్ఫోన్ తయారీదార్లు తమ ఫోన్లలో కొన్ని యాప్లను ముందస్తుగా ఇన్స్టాల్ చేసి వినియోగదార్లకు విక్రయిస్తుంటాయి. వీటిని తీసేయడానికి వీలుండదు. కొన్ని థర్డ్పార్టీ యాప్లను ఇలా ఇన్స్టాల్ చేసినందుకు, సెల్ కంపెనీలు వారి నుంచి డబ్బులు తీసుకుంటాయి. ఒక్కో ఫోన్పై రూ.500-1,000 వరకు కూడా ఇలా వచ్చే వీలుంటుందని ఒక కంపెనీ ఉన్నతాధికారి తెలిపారు. ఇలా ముందస్తుగా ఇన్స్టాల్ చేసిన యాప్లనూ వినియోగదారులు తొలగించుకునే వీలు కల్పించే నిబంధనను తీసుకురానుందని సమాచారం.
* ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్) అప్డేట్లకు తప్పనిసరిగా తనిఖీలు (స్క్రీనింగ్) ఉండాలనీ యోచిస్తోంది.
ఇదీ ప్రభావం: ఒక స్మార్ట్ఫోన్, వాటి విడిభాగాలను ప్రభుత్వ ఏజెన్సీ తనిఖీ చేయడానికి ప్రస్తుతం 21 వారాలు పడుతోంది. మరిన్ని పరీక్షలకు ఇంకా అధిక సమయం పట్టొచ్చు. శాంసంగ్, షియోమీ, వివో వంటి కంపెనీలు ప్రీ-ఇన్స్టాల్డ్ యాప్ల ద్వారా పొందుతున్న వ్యాపారాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
విదేశీ నిఘా లేకుండా
2020లో చైనా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచీ, ఆ దేశ వ్యాపార సంస్థల విధానాలపై మన ప్రభుత్వం గట్టి నిఘా ఉంచింది. టిక్ టాక్ వంటి 300 చైనా యాప్లను నిషేధించింది కూడా. అంతర్జాతీయంగానూ చాలా దేశాలు చైనా సంస్థలైన హువావే, హక్విజన్ వంటి టెక్ కంపెనీల సాంకేతికతను వినియోగించకుండా ఆంక్షలు విధిస్తున్న విషయం విదితమే. తమ సాంకేతికత ద్వారా విదేశీ పౌరులపై చైనా నిఘా ఉంచుతోందన్నది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే మన ప్రభుత్వమూ కఠిన చర్యలకు దిగుతోంది.
* మన స్మార్ట్ఫోన్ విపణిలో చైనా కంపెనీలైన షియోమీ, వివో, ఒప్పోలదే సగం వరకు వాటా ఉంది. దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్కు 20%, యాపిల్కు 3% వాటా ఉన్నాయి.
బీఐఎస్ ల్యాబ్లో..
షియోమీ యాప్ స్టోర్ గెట్యాప్స్ కానీ శాంసంగ్కు చెందిన శాంసంగ్ మినీ కానీ.. ఐఫోన్లో యాపిల్ బ్రౌజర్ అయిన సఫారీ కానీ ప్రీ-ఇన్స్టాల్డ్వే. వీటిని తొలగించడానికి వీలుండదు. ఇకపై అన్ఇన్స్టాల్ ఆప్షన్ను అవి పొందుపరచాలి. కొత్త మోడళ్లను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) అధీకృత ల్యాబ్లో తనిఖీ చేసే అవకాశం ఉందని ఒక అధికారి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా