ఆర్బీఐ కఠిన నిబంధనలే బ్యాంకులకు రక్ష
భారతీయ బ్యాంకులు వ్యవస్థాగతంగా పటిష్టంగా ఉన్నాయని, ఇందుకు ఆర్బీఐ నిరంతర పర్యవేక్షణ, కఠిన నిబంధనలే కారణమని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడు, బజాజ్ ఫిన్సర్వ్ ఛైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ అన్నారు. ‘అంతర్జాతీయ పరిణామాల వల్ల దేశ వృద్ధిపై కొంత ప్రభావం పడొచ్చ’ని పేర్కొన్నారు.
సీఐఐ అధ్యక్షుడు సంజీవ్ బజాజ్
ఈనాడు, హైదరాబాద్: భారతీయ బ్యాంకులు వ్యవస్థాగతంగా పటిష్టంగా ఉన్నాయని, ఇందుకు ఆర్బీఐ నిరంతర పర్యవేక్షణ, కఠిన నిబంధనలే కారణమని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడు, బజాజ్ ఫిన్సర్వ్ ఛైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ అన్నారు. ‘అంతర్జాతీయ పరిణామాల వల్ల దేశ వృద్ధిపై కొంత ప్రభావం పడొచ్చ’ని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన సీఐఐ దక్షిణ ప్రాంత వార్షిక సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గత 25 ఏళ్లుగా దేశంలో భౌతిక, డిజిటల్ మౌలిక వసతులు ఎంతో అభివృద్ధి చెందినందున, ప్రపంచానికి కొత్త ఆవిష్కరణలు అందించే దిశగా మన పరిశ్రమ సాగాలని ఉద్బోధించారు.
రుణాలకు ఇబ్బంది లేదు: అమెరికా, ఐరోపాల్లో కొన్ని బ్యాంకుల మూసివేతపై స్పందిస్తూ.. భారతీయ బ్యాంకులు ఎంత బలంగా ఉన్నాయో ప్రపంచానికి చాటి చెప్పే సమయం ఇదని అన్నారు. ‘ప్రస్తుతం విదేశాల్లో రుణ లభ్యత కష్టంగా మారినా, ఇది స్వల్పకాలమే. దేశంలో మంచి కంపెనీలు, అంకురాలకు రుణాలు పెద్ద సమస్యే కాదు. మంచి ఆలోచనలు, వ్యాపారాలకు ప్రపంచ వ్యాప్తంగా తగినంత మూలధనం అందుబాటులో ఉంది’ అని అన్నారు.
అత్యాశ వద్దు: ఫిన్టెక్ అంకురాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్యాంకులు, బీమా సంస్థలు అత్యుత్సాహం చూపొద్దని ఆయన సూచించారు. కొన్ని అంకురాలు బాగానే పనిచేస్తున్నా, తమ విలువను ఎన్నో రెట్లు అధికంగా చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ‘అందువల్ల వృద్ధిని మాత్రమే కాకుండా, ఆయా సంస్థల్లోని నష్టభయాలనూ గమనించాలి. పెట్టుబడి ఎలా తిరిగి వస్తుందన్న దానిపై దృష్టి ఉండాలి’ అని తెలిపారు.
వడ్డీ రేట్ల పెంపు ఆగాలి: ‘వడ్డీ రేట్ల పెంపునకు విరామం కావాలి. ప్రస్తుతం దేశంలో సహేతుక వడ్డీ రేట్లు ఉన్నాయి. అందువల్ల భవిష్యత్తు పెంపుపై ఆర్బీఐ తగిన విధంగా వ్యవహరిస్తుందని నమ్ముతున్నట్లు’ బజాజ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో.. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ దక్షిణ ప్రాంత విభాగం డిప్యూటీ ఛైర్మన్, వోల్వో గ్రూపు ఇండియా ప్రెసిడెంట్, ఎండీ కమల్ బాలి, బ్లూమ్బర్గ్ ఎన్ఈఎఫ్ కమోడిటీస్, ఎనర్జీ గ్లోబల్ హెడ్ ఆశిశ్ సేథియా ప్రసంగించారు.
మరిన్ని ఆవిష్కరణలు రావాలి
‘మన దేశమే అతి పెద్ద మార్కెట్. ఇక్కడి ఆవిష్కరణలు మన ప్రజల అవసరాలను తీర్చగలిగితే అవి పెద్ద విజయం సాధించినట్లే. ఈ దిశగా సంస్థలు పోటీ పడాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో మన ఉత్పత్తులు రావాలి. ఆరోగ్య సంరక్షణతో పాటు ప్రతి రంగంలోనూ కృత్రిమ మేధ వంటి సాంకేతికతలు కీలకం అవుతున్నాయి. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే అంశాన్ని చేతల్లో చూపించాలి. ప్రతి రంగంలో, రాజకీయాల్లో వారి ప్రాతినిధ్యం పెరగాలి.’
సుచిత్ర ఎల్ల, సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్పర్సన్,
భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్
సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్మన్గా కమల్ బాలి
సీఐఐ దక్షిణ ప్రాంత విభాగం కొత్త ఛైర్మన్గా వోల్వో గ్రూపు ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ కమల్ బాలి ఎంపికయ్యారు. 2023-24 ఏడాదికి ఈయన ఛైర్మన్గా కొనసాగుతారు. ఇప్పటి వరకూ ఈ విభాగానికి ఆయన డిప్యూటీ ఛైర్మన్గా ఉన్నారు. 2017-18లో సీఐఐ కర్ణాటకకు ఛైర్మన్గా పనిచేశారు.
డిప్యూటీ ఛైర్పర్సన్గా చంద్ర టెక్స్టైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ నందిని ఎంపికయ్యారు. 2010-11లో సీఐఐ తమిళనాడు విభాగానికి ఛైర్పర్సన్గా ఆమె పనిచేశారు. సీఐఐ ఇండియన్ వుమెన్ నెట్వర్క్కూ ఛైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు