అమెరికాలో బ్యాంకింగ్కు రూ.2.5 లక్షల కోట్ల ప్యాకేజీ
అమెరికాలోని 16వ అతిపెద్దదైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్తో పాటు సిగ్నేచర్ బ్యాంక్ కుప్పకూలిన నేపథ్యంలో, బ్యాంకింగ్ రంగాన్ని ఆదుకునేందుకు.. మరో బ్యాంక్ పతనం కాకుండా చూసేందుకు అమెరికాలోని 11 పెద్ద బ్యాంకులు నడుం బిగించాయి.
సిద్ధం చేసిన 11 పెద్ద బ్యాంకులు
మరొకటి కుప్పకూలకుండా చూసేందుకే
న్యూయార్క్: అమెరికాలోని 16వ అతిపెద్దదైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్తో పాటు సిగ్నేచర్ బ్యాంక్ కుప్పకూలిన నేపథ్యంలో, బ్యాంకింగ్ రంగాన్ని ఆదుకునేందుకు.. మరో బ్యాంక్ పతనం కాకుండా చూసేందుకు అమెరికాలోని 11 పెద్ద బ్యాంకులు నడుం బిగించాయి. ఎస్వీబీ తరహాలోనే సమస్యలను ఎదుర్కొంటున్న మరో బ్యాంకు ‘ఫస్ట్ రిపబ్లిక్’ కోసం 30 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.5 లక్షల కోట్ల) సహాయ ప్యాకేజీని ఇవి సిద్ధం చేశాయి.
ఎందుకంటే..: గురువారం కొద్ది గంటల్లోనే ఫస్ట్ రిపబ్లిక్ డిపాజిటర్లు ఏకంగా 40 బి.డాలర్ల (సుమారు రూ.3.28 లక్షల కోట్ల) మొత్తాన్ని ఉపసంహరించుకున్నారు. గత డిసెంబరు ఆఖరుకు 176.4 బి.డాలర్ల డిపాజిట్లున్న ఈ బ్యాంకు, తాజా పరిణామంతో ఎస్వీబీ తరహా సమస్యల్నే ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్డీఐసీ) సాధారణంగా 2.5 లక్షల డాలర్లలోపు డిపాజిట్లకు బీమా కల్పిస్తుంది. అంతకు మించిన, బీమా లేని డిపాజిట్లే ఈ బ్యాంకు నుంచి ఉపసంహరణకు గురైనట్లు తెలుస్తోంది. జేపీ మోర్గాన్, ఫెడరల్ రిజర్వ్ల నుంచి అదనపు నిధులను పొందుతున్నట్లు ఫస్ట్ రిపబ్లిక్ చెప్పినా సోమవారం ఈ బ్యాంకు షేరు 60% కుప్పకూలింది.. గురువారమూ తొలుత షేరు 36% నష్టపోయినా.. ప్యాకేజీ నేపథ్యంలో 10% లాభపడింది.
ఈ బ్యాంకుల మద్దతు: జేపీ మోర్గాన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, వెల్స్ఫార్గోలు తలా 5 బి. డాలర్లను బీమాలేని డిపాజిట్ల కోసం కేటాయించాయి. మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్మాన్శాక్స్ బ్యాంకులు 2.5 బి. డాలర్ల చొప్పున డిపాజిట్ చేయనున్నాయి. మరో 5 బి. డాలర్లను బీఎన్వై మెలన్, స్టేట్ స్ట్రీట్, పీఎన్సీ బ్యాంక్, ట్రూయిస్ట్, యూఎస్ బ్యాంకు ఇవ్వనున్నాయి.
దివాలా రక్షణ కోరిన ఎస్వీబీ మాతృసంస్థ
సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్వీబీ) మాతృసంస్థ ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ ‘చాప్టర్ 11 దివాలా రక్షణ’ కోసం పిటిషన్ దాఖలు చేయనుంది. స్వీబీని ఎఫ్డీఐసీ తన ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్నకు ఎస్వీబీతో సంబంధాలుండవు. అందుకే దానిని చాప్టర్ 11 కిందకు జత చేయలేదు.
అమెరికా బ్యాంకుల్లో టీసీఎస్, ఇన్ఫీల పెట్టుబడులు
అమెరికాలోని ప్రాంతీయ బ్యాంకుల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్లకు భారీ డిపాజిట్లున్నాయని జేపీ మోర్గాన్ వెల్లడించింది. ఆయా కంపెనీలు తమ ఆదాయాల్లో 2-3% మేర అమెరికా ప్రాంతీయ బ్యాంకుల్లో పెట్టినట్లు జేపీ మోర్గాన్ తెలిపింది. ఇందువల్ల టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్టీఐమైండ్ట్రీలపై 10-20 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం ఉండొచ్చని తెలిపింది. ఈ మూడు కంపెనీలు ప్రస్తుత త్రైమాసికానికి సంబంధించి, ‘ఎస్వీబీలో పెట్టుబడులకు విడిగా కేటాయింపులు జరపాల్సి రావొచ్చని’ జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది. ఐరోపా, అమెరికా వంటి కీలక మార్కెట్లలో స్థూల ఆర్థిక అనిశ్చితుల కారణంగా భారత ఐటీ పరిశ్రమ ఇప్పటికే సవాళ్లను ఎదుర్కొంటోంది. తాజా బ్యాంకింగ్ సంక్షోభం వల్ల ఒప్పందాల్లో ఆలస్యంతో పాటు ఆదాయాలు, ఆర్డర్లపై వచ్చే కొద్ది త్రైమాసికాల్లో ప్రభావం పడొచ్చని జేపీ మోర్గాన్ అంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
తమ బ్రాండ్ పేరు, లోగోతో కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తున్నారని, వీటితో అప్రమత్తంగా ఉండాలని ఎల్ఐసీ సూచించింది. -
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 114 పాయింట్లు, నిఫ్టీ 34 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
Realme Narzo: రియల్మీ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వీటి ధర రూ.11,999 నుంచి ప్రారంభమైంది. ఫీచర్లు, వేరియంట్లు, వాటి ధరలు, ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్కు దీటుగా ప్రత్యేక వేదికను తెచ్చేందుకు ఎలాన్ మస్క్కు చెందిన ‘ఎక్స్’ సిద్ధమవుతోంది. -
ఎయిర్టెల్ కొత్త రోమింగ్ ప్యాక్స్.. 184 దేశాలకు ఒకే ప్యాక్
ఎయిర్టెల్ కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లు తీసుకొచ్చింది. రోజుకు రూ.133 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమవుతాయని ఎయిర్టెల్ తెలిపింది. -
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
Tesla: భారత్లోకి టెస్లా ప్రవేశం సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. మంగళవారం చేసిన ఓ కీలక ప్రకటనే అందుకు కారణం. ఆ ప్రకటనేంటి? దానికీ.. కంపెనీ భారత ప్రణాళికలకు సంబంధం ఏంటో చూద్దాం! -
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
Anil Agarwal: తన దినచర్యను తెలపడంతో పాటు యువతకు ఆరోగ్య సూత్రాలను పంచుకున్నారు వేదాంత అధిపతి అనిల్ అగర్వాల్. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 159 పాయింట్ల లాభంతో 73,898 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 22,412 దగ్గర కొనసాగుతోంది. -
ఇస్రో కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్ఈసీ ఇండస్ట్రీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) వినియోగించే జీఎస్ఎల్వీ మార్క్-3 లాంచ్ వెహికల్ కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్ (ఐటీఎస్)ను ఎస్ఈసీ ఇండస్ట్రీస్ రూపొందించింది. -
మూడో రోజూ ముందుకే
వరుసగా మూడో రోజూ దేశీయ సూచీలు రాణించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో టెలికాం, టెక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే చమురు ధరలు పెరగడానికి తోడు విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. -
మా ఉత్పత్తులపై నిషేధం లేదు
తమ అన్ని ఉత్పత్తులు భద్రమైనవి, అత్యంత నాణ్యమైనవని ఎవరెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్స్ తెలిపింది. ఈ సంస్థ ఎగుమతి చేస్తున్న స్పైస్-మిక్స్ ఉత్పత్తుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, కంపెనీ పై విధంగా స్పందించింది. -
బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు ‘అమరరాజా’ సహా 7 కంపెనీల బిడ్
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద బ్యాటరీ ప్లాంట్లు స్థాపించేందుకు అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సహా 7 కంపెనీల నుంచి బిడ్లు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
కాస్త దిగొచ్చిన బంగారం
ఇటీవలి గరిష్ఠాలతో పోలిస్తే బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొంతమేర చల్లారడం ఇందుకు కారణం. -
ఇండిగోలో ఇన్ఫ్లైట్ వినోదం
మే 1 నుంచి దిల్లీ-గోవా విమానాల్లో, తన యాప్ ద్వారా ఇన్-ఫ్లైట్ వినోద కంటెంట్ను విమానయాన సంస్థ ఇండిగో ఆవిష్కరించనుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ద్రవ్యోల్బణానికి వాతావరణ ముప్పు
దీర్ఘకాలం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం.. వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ముడి చమురు ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ బులెటిన్ అభిప్రాయ పడింది. -
ఇంటిపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు ఇండియన్ బ్యాంక్తో టాటా పవర్ భాగస్వామ్యం
నివాస గృహాల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు, టాటా వపర్ సోలార్ సిస్టమ్స్ ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
వచ్చే 6 నెలల్లో మ్యాజిక్పిన్లో 250 నియామకాలు
ఫ్యాషన్, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు.. ఇలా వివిధ విభాగాల్లో బ్రాండ్లు, వ్యాపార సంస్థల అన్వేషణకు ఉపయోగపడే ఇ-కామర్స్ సంస్థ మ్యాజిక్పిన్ వచ్చే ఆరు నెలల్లో 250 మందిని నియమించుకునే యోచనలో ఉంది. -
నేటి నుంచి నిఫ్టీ నెక్స్ట్50లో డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్
నిఫ్టీ నెక్స్ట్ 50 సూచీలో డెరివేటివ్ కాంట్రాక్టులను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) బుధవారం ప్రారంభించనుంది. -
సీపీ గుర్నానీ కంపెనీతో ఇంటర్గ్లోబ్ భాగస్వామ్యం
టెక్ దిగ్గజం సీపీ గుర్నానీకి చెందిన అసాగోతో, ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్యం కుదుర్చుకుని, కృత్రిమ మేధ (ఏఐ) వ్యాపార వెంచర్ ‘అలాన్ఓఎస్’ను ఏర్పాటు చేసింది. -
టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ లాభం రూ.212 కోట్లు
కన్జూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (టీసీపీఎల్) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.212.26 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది
తాజా వార్తలు (Latest News)
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్