సింగపూర్ స్థాయికి భారత్ ఇపుడే వెళ్లలేదు
సులభతర వాణిజ్యానికి ఉన్న అడ్డంకులను భారత్ తొలగించాల్సిన అవసరం ఉందని భారత్-అమెరికా వ్యాపారాల సలహా బృందం (యూఎస్ఐఎస్పీఎఫ్) అధిపతి అభిప్రాయపడ్డారు.
కొంత ప్రగతి ఉన్నా.. చాలా సమయం పడుతుంది
సులభతర వాణిజ్యానికి అడ్డంకులు తొలగించాలి
యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్టనర్షిప్ ఫోరమ్
వాషింగ్టన్: సులభతర వాణిజ్యానికి ఉన్న అడ్డంకులను భారత్ తొలగించాల్సిన అవసరం ఉందని భారత్-అమెరికా వ్యాపారాల సలహా బృందం (యూఎస్ఐఎస్పీఎఫ్) అధిపతి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సింగపూర్ లేదా హాంకాంగ్ స్థాయికి భారత్ చేరాలంటే చాలా సమయం పట్టొచ్చని యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్టనర్షిప్ ఫోరమ్(యూఎస్ఐఎస్పీఎఫ్) ప్రెసిడెంట్ ముకేశ్ అఘి అభిప్రాయపడ్డారు. భారత్-అమెరికా అనుబంధం బలంగా ఉందనీ.. ప్రతి అంశంలోనూ సానుకూల ప్రగతి కనిపిస్తోందని ఆయన అన్నారు. ‘భౌగోళికంగా చూస్తే క్వాడ్ (ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా) ముందంజలో ఉంది. ఐ2యు2 (భారత్, ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికా) కూడా రాణిస్తోంది. పుంజుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థ అమెరికాకు సహాయ పడుతోంది. అమెరికాకు చెందిన విమాన తయారీ సంస్థ బోయింగ్కు, భారత విమానయాన సంస్థ ఎయిరిండియా ఇచ్చిన ఆర్డరు వల్ల అమెరికాలో 10 లక్షల ఉద్యోగాలు లభించనున్నాయి. ఇండిగో కూడా పెద్ద ఆర్డరు పెడుతుందని ఆశిస్తున్నామ’న్నారు. ఎయిర్బస్, బోయింగ్లకు రూ.6.4 లక్షల కోట్ల విలువైన మొత్తం 470 విమానాల కోసం టాటా గ్రూప్ సంస్థ ఎయిరిండియా ఆర్డరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో 220 విమానాలను బోయింగ్ నుంచే కొనుగోలు చేయనుంది. చేయాల్సింది ఇంకా ఉంది‘మనం చాలా ప్రగతి సాధించాం. సింగపూర్ లేదా హాంకాంగ్ లేదా ఇతర దేశాల స్థాయి ప్రమాణాలకు చేరడానికి ఇంకా చాలా సమయం పట్టొచ్చు. ఆ రెండు దేశాలతో వాణిజ్యం ఎటువంటి ఒప్పందాలూ లేకుండానే 70 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. కాబట్టి చేయాల్సింది ఇంకా ఉంది. భారత్లో మా బంధాన్ని ప్రతి అంశంలోనూ బలోపేతం చేయాలని భావిస్తున్నామ’ని ముకేశ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా