ఐటీ షేర్లలో స్థిరీకరణకు అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఒక శ్రేణికి లోబడి చలిస్తాయని కొంత మంది.. ఇప్పటికే స్థిరీకరణ కనిపించినందున లాభాలతో మొదలవుతాయని మరికొంత మంది విశ్లేషకులు అంటున్నారు.
16,800 దిగువకొస్తే నిఫ్టీలో దిద్దుబాటే
17,300 స్థాయి ఎగువన లాభాలు
లోహ, బ్యాంకు షేర్లలో సానుకూలతలు
విశ్లేషకుల అంచనాలు
స్టాక్ మార్కెట్ ఈ వారం
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఒక శ్రేణికి లోబడి చలిస్తాయని కొంత మంది.. ఇప్పటికే స్థిరీకరణ కనిపించినందున లాభాలతో మొదలవుతాయని మరికొంత మంది విశ్లేషకులు అంటున్నారు. నిఫ్టీ-50కి 16,800 పాయింట్ల వద్ద మద్దతు లభించొచ్చని, 17,200 వద్ద నిరోధం ఎదురుకావొచ్చని చెబుతున్నారు. నిఫ్టీ 50 ఒక వేళ 16,800 వద్ద మద్దతును దొరకబుచ్చుకోలేకపోతే 16,450-16,400 వరకు దిగజారొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. 17,300-17,350 స్థాయిని అధిగమిస్తేనే 17,500 లేదా అంతకంటే ఎగువకు వెళ్లగలదని అంటున్నారు. ఐటీ షేర్లలో కొంత స్థిరీకరణ కనిపించొచ్చనీ అంచనా వేస్తున్నారు. ఈ వారం వెలువడే అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయంపై మదుపర్లు దృష్టి సారించాలి. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..
* మార్కెట్పై సానుకూలతలున్నందున ఎఫ్ఎమ్సీజీ వంటి రక్షణాత్మక రంగాలకు మదుపర్లు దూరం జరగొచ్చు. అయితే వేసవి ఎండలు ముదురుతున్నందున, వరుణ్ బేవరేజెస్, రాడియో ఖైతాన్, గోద్రేజ్ కన్జూమర్ షేర్లు రాణించే అవకాశం ఉంది.
* కొంత లాభాల అనంతరం ఔషధ కంపెనీల షేర్లు ప్రతికూల ధోరణిలో స్థిరీకరణకు గురి కావొచ్చు. నిఫ్టీ ఫార్మా సూచీ 11,800-11,900 స్థాయికి చేరేవరకు ఒత్తిడిలోనే కొనసాగొచ్చు. దివీస్ లేబొరేటరీస్, ఇప్కా లేబొరేటరీస్, ఫైజర్ షేర్లలో బలహీనతలు ఉండొచ్చు.
* లోహ కంపెనీల షేర్లు సానుకూల ధోరణిలో చలించొచ్చు. చైనాలో గిరాకీ పుంజుకుంటుండడం ఇందుకు దోహదం చేయొచ్చు. టాటా స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, సెయిల్లలో ‘బులిష్’ ధోరణి కనిపించొచ్చు.
* యంత్ర పరికరాల షేర్లు స్వల్పకాలం నుంచి మధ్యకాలానికి సానుకూలంగా ఉండొచ్చు. ఎల్ అండ్ టీ, సీమెన్స్ తమ 50 రోజుల చలన సగటు కంటే పైనే కదలాడుతున్నాయి.
* సిమెంటు కంపెనీల షేర్లు ఊగిసలాటలను ఎదుర్కోవచ్చు. గృహ విభాగం నుంచి గిరాకీ పెరుగుతున్నా.. ధరల పెంపును నిలబెట్టుకోవడానికి కంపెనీలు ఇబ్బందులు పడుతుండడం ఇందుకు నేపథ్యం. ఈ నేపథ్యంలో దీర్ఘకాల పెట్టుబడులపై జాగ్రత్త పడాలి.
* ఎస్వీబీ దివాలా నేపథ్యంలో, గురువారం సమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వ్, వడ్డీరేట్లను 0.25% పెంచొచ్చు.. లేదా పెంచకపోవచ్చు. ఈ పరిమాణాన్ని బట్టి ఐటీ షేర్ల దిశ ఆధారపడి ఉంటుంది. టీసీఎస్ సీఈఓ హఠాత్ రాజీనామా నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లను గమనించొచ్చు.
* టెలికాం షేర్లు ఒక శ్రేణికి లోబడి చలించొచ్చు. జియో మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు రూ.2,200 వద్ద బలమైన మద్దతు కనిపిస్తోంది.
* ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి చమురు రిఫైనింగ్ కంపెనీల షేర్లు రాణించొచ్చు. చమురు ధరలు తగ్గుతుండడంతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపులో దూకుడుగా వెళ్లే అవకాశం లేకపోవడం ఇందుకు దోహదం చేయొచ్చు.
* బ్యాంకు షేర్లు రాణించొచ్చు. నిఫ్టీ బ్యాంక్ సూచీ 38,600 స్థాయి నుంచి రికవరీ చెందడం సానుకూలాంశం. ఈ వారం 39,000-40,500 శ్రేణిలో చలించొచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ షేర్లపై దృష్టి సారించొచ్చు.
* వాహన కంపెనీల షేర్లలో స్థిరీకరణ ఏర్పడొచ్చు. చమురు ధరలు మరింత పడ్డా; రేట్ల పెంపుపై ఫెడ్ సానుకూలంగా స్పందించినా.. నిఫ్టీ వాహన సూచీకి సానుకూలతలు తీసుకురావొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 655 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. -
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
పార్టటైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!