బిస్కెట్కే రూ.లక్ష అక్రమార్జన!
దేశంలోకి దొంగచాటుగా బంగారం తీసుకురావడం (స్మగ్లింగ్) అంతకంతకూ పెరుగుతోంది. దేశీయంగా పసిడి లభ్యత తక్కువగా ఉన్నందున, విదేశాల నుంచి దిగుమతులే మనకు అత్యధికం.
పసిడి దొంగచాటు రవాణాకు ఇదే కారణం
2021లో 2,383 కిలోలు.. 2022లో 3,502 కిలోల పట్టివేత
దిల్లీ: దేశంలోకి దొంగచాటుగా బంగారం తీసుకురావడం (స్మగ్లింగ్) అంతకంతకూ పెరుగుతోంది. దేశీయంగా పసిడి లభ్యత తక్కువగా ఉన్నందున, విదేశాల నుంచి దిగుమతులే మనకు అత్యధికం. మేలిమి బంగారం (24 క్యారెట్లు-999 స్వచ్ఛత) గ్రాము ధర దాదాపు రూ.6,000కు చేరింది. పుత్తడిపై పన్నురేటు 18.45% కావడంతో, గ్రాముపై రూ.1100 రూపాయలు భారం పడుతోంది. అంటే 100 గ్రాముల మేలిమి బంగారం బిస్కెట్ దొంగచాటుగా తెచ్చినా, రూ.లక్షకు పైగా మిగులుతుందనే భావనతో స్మగ్లర్లు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. దీనిని అడ్డుకునేందుకు ప్రభుత్వం నిఘా, తనిఖీలు పెంచుతోంది.
గతేడాది 47% అధికం: దేశంలోకి విమానాశ్రయాలు, ఓడరేవులు, భూమార్గం ద్వారా దొంగచాటుగా బంగారం తెస్తుంటారు. తనిఖీల్లో 2020లో 2,154.58 కిలోలు, 2021లో 2,383.38 కిలోల పసిడిని అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. 2022లో ఈ మొత్తం 47% అధికమై 3,502 కిలోలకు పెరగడం గమనార్హం. ఈ ఏడాది తొలి 2 నెలల్లోనే 916.37 కిలోల పసిడిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) స్వాధీనం చేసుకుంది.
ఈ మార్గాల్లో: విదేశాల నుంచి సాధారణ ప్రయాణికుల తరహాలో బంగారం బిస్కెట్లను, కరిగించి పేస్ట్ రూపంలో తెస్తుంటారు. కొందరు స్మగ్లర్లు ప్రయాణికులకు నగదు ఇచ్చి, ఇక్కడి తమ వారికి బంగారం చేరేలా చూస్తుంటారు. సరకు రవాణా మార్గాల్లోనూ పంపుతుంటారు. ఇలా పట్టుబడిన కేసులు 2021లో 2,445 అయితే, 2022లో 3,982కు చేరాయి. కేరళలో 4 అంతర్జాతీయ విమానాశ్రయాలుండగా, 2021లో 586.95 కిలోలు, 2022లో 755.81 కిలోల అక్రమ బంగారం పట్టుబడింది. 2022లో మహారాష్ట్రలో 535.65 కిలోలు, తమిళనాడులో 519 కిలోల బంగారం ఇలా దొరికిపోయింది.
ఇంతగా పట్టుబడుతున్నా ఎందుకంటే..: భారత్లో బంగారంపై బేసిక్ కస్టమ్స్ సుంకం 12.5% ఉంది. అంటే విదేశాల్లో ధర కంటే, మన దగ్గర ఇంతమేర అధికం. దీనికి వ్యవసాయ మౌలిక వసతుల సుంకం 2.5%, జీఎస్టీ 3% కలిపితే 18% అవుతుంది. మరికొన్ని సుంకాలు 0.45% ఉన్నందున, మొత్తం 18.45% పన్ను భారం బంగారంపై పడుతుంది. అంటే ప్రతి రూ.100 విలువకు రూ.18.45 పన్ను రూపేణానే అవుతోంది. విదేశాల నుంచి దొంగచాటుగా తేగలిగితే ఇదంతా మిగులుతుంది కనుకే అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. విదేశాల నుంచి మన దేశానికి వచ్చే కొందరు అమాయక ప్రయాణికులకు కూడా నగదు ఆశ చూపి, వారికి ఆభరణాలు ధరింప చేసి స్మగ్లర్లు ఇక్కడకు పంపుతున్నారు. అయితే వాటికి సరైన ఆధారాలు చూపలేనప్పుడు, విమానాశ్రయాల్లో అధికారులకు దొరికిపోతున్నారు. ఇలా కేసుల్లో ఇరుక్కునే వారి సంఖ్యా పెరుగుతోంది.
పన్ను తగ్గితే దొంగ రవాణా అరికట్టొచ్చా?
దిగుమతి సుంకం తగ్గిస్తే, స్మగ్లింగ్ తగ్గించవచ్చని పసిడి ఆభరణ పరిశ్రమ భావిస్తోంది. అయితే పసిడి బిల్లు రూపేణ, కరెంటు ఖాతా లోటు పెరుగుతున్నందున, దిగుమతులు తగ్గించేందుకే పన్ను విధిస్తున్నామని ప్రభుత్వం అంటోంది. విదేశాలకు, మన దగ్గర ధరల్లో అధిక తేడా మాత్రం అక్రమార్కుల పంట పండిస్తోందనే చెప్పాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న