బిస్కెట్కే రూ.లక్ష అక్రమార్జన!
దేశంలోకి దొంగచాటుగా బంగారం తీసుకురావడం (స్మగ్లింగ్) అంతకంతకూ పెరుగుతోంది. దేశీయంగా పసిడి లభ్యత తక్కువగా ఉన్నందున, విదేశాల నుంచి దిగుమతులే మనకు అత్యధికం.
పసిడి దొంగచాటు రవాణాకు ఇదే కారణం
2021లో 2,383 కిలోలు.. 2022లో 3,502 కిలోల పట్టివేత
దిల్లీ: దేశంలోకి దొంగచాటుగా బంగారం తీసుకురావడం (స్మగ్లింగ్) అంతకంతకూ పెరుగుతోంది. దేశీయంగా పసిడి లభ్యత తక్కువగా ఉన్నందున, విదేశాల నుంచి దిగుమతులే మనకు అత్యధికం. మేలిమి బంగారం (24 క్యారెట్లు-999 స్వచ్ఛత) గ్రాము ధర దాదాపు రూ.6,000కు చేరింది. పుత్తడిపై పన్నురేటు 18.45% కావడంతో, గ్రాముపై రూ.1100 రూపాయలు భారం పడుతోంది. అంటే 100 గ్రాముల మేలిమి బంగారం బిస్కెట్ దొంగచాటుగా తెచ్చినా, రూ.లక్షకు పైగా మిగులుతుందనే భావనతో స్మగ్లర్లు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. దీనిని అడ్డుకునేందుకు ప్రభుత్వం నిఘా, తనిఖీలు పెంచుతోంది.
గతేడాది 47% అధికం: దేశంలోకి విమానాశ్రయాలు, ఓడరేవులు, భూమార్గం ద్వారా దొంగచాటుగా బంగారం తెస్తుంటారు. తనిఖీల్లో 2020లో 2,154.58 కిలోలు, 2021లో 2,383.38 కిలోల పసిడిని అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. 2022లో ఈ మొత్తం 47% అధికమై 3,502 కిలోలకు పెరగడం గమనార్హం. ఈ ఏడాది తొలి 2 నెలల్లోనే 916.37 కిలోల పసిడిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) స్వాధీనం చేసుకుంది.
ఈ మార్గాల్లో: విదేశాల నుంచి సాధారణ ప్రయాణికుల తరహాలో బంగారం బిస్కెట్లను, కరిగించి పేస్ట్ రూపంలో తెస్తుంటారు. కొందరు స్మగ్లర్లు ప్రయాణికులకు నగదు ఇచ్చి, ఇక్కడి తమ వారికి బంగారం చేరేలా చూస్తుంటారు. సరకు రవాణా మార్గాల్లోనూ పంపుతుంటారు. ఇలా పట్టుబడిన కేసులు 2021లో 2,445 అయితే, 2022లో 3,982కు చేరాయి. కేరళలో 4 అంతర్జాతీయ విమానాశ్రయాలుండగా, 2021లో 586.95 కిలోలు, 2022లో 755.81 కిలోల అక్రమ బంగారం పట్టుబడింది. 2022లో మహారాష్ట్రలో 535.65 కిలోలు, తమిళనాడులో 519 కిలోల బంగారం ఇలా దొరికిపోయింది.
ఇంతగా పట్టుబడుతున్నా ఎందుకంటే..: భారత్లో బంగారంపై బేసిక్ కస్టమ్స్ సుంకం 12.5% ఉంది. అంటే విదేశాల్లో ధర కంటే, మన దగ్గర ఇంతమేర అధికం. దీనికి వ్యవసాయ మౌలిక వసతుల సుంకం 2.5%, జీఎస్టీ 3% కలిపితే 18% అవుతుంది. మరికొన్ని సుంకాలు 0.45% ఉన్నందున, మొత్తం 18.45% పన్ను భారం బంగారంపై పడుతుంది. అంటే ప్రతి రూ.100 విలువకు రూ.18.45 పన్ను రూపేణానే అవుతోంది. విదేశాల నుంచి దొంగచాటుగా తేగలిగితే ఇదంతా మిగులుతుంది కనుకే అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. విదేశాల నుంచి మన దేశానికి వచ్చే కొందరు అమాయక ప్రయాణికులకు కూడా నగదు ఆశ చూపి, వారికి ఆభరణాలు ధరింప చేసి స్మగ్లర్లు ఇక్కడకు పంపుతున్నారు. అయితే వాటికి సరైన ఆధారాలు చూపలేనప్పుడు, విమానాశ్రయాల్లో అధికారులకు దొరికిపోతున్నారు. ఇలా కేసుల్లో ఇరుక్కునే వారి సంఖ్యా పెరుగుతోంది.
పన్ను తగ్గితే దొంగ రవాణా అరికట్టొచ్చా?
దిగుమతి సుంకం తగ్గిస్తే, స్మగ్లింగ్ తగ్గించవచ్చని పసిడి ఆభరణ పరిశ్రమ భావిస్తోంది. అయితే పసిడి బిల్లు రూపేణ, కరెంటు ఖాతా లోటు పెరుగుతున్నందున, దిగుమతులు తగ్గించేందుకే పన్ను విధిస్తున్నామని ప్రభుత్వం అంటోంది. విదేశాలకు, మన దగ్గర ధరల్లో అధిక తేడా మాత్రం అక్రమార్కుల పంట పండిస్తోందనే చెప్పాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు