క్రెడిట్ సూయిజ్ సంక్షోభానికి తెర
క్రెడిట్ సూయిజ్ బ్యాంక్.. 166 ఏళ్ల ఘన చరిత ఉన్న స్విస్ అతిపెద్ద బ్యాంకు ఇది. ఈ బ్యాంక్ పతనం అంచులకు చేరడంతో ఐరోపా బ్యాంకులన్నీ బెంబేలెత్తిపోయాయి.
3.25 బి. డాలర్లతో కొననున్న యూబీఎస్
ఈ నేపథ్యంలో భారీగా క్షీణించిన షేర్లు
ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ షేర్లపై ప్రభావం
క్రెడిట్ సూయిజ్ బ్యాంక్.. 166 ఏళ్ల ఘన చరిత ఉన్న స్విస్ అతిపెద్ద బ్యాంకు ఇది. ఈ బ్యాంక్ పతనం అంచులకు చేరడంతో ఐరోపా బ్యాంకులన్నీ బెంబేలెత్తిపోయాయి. అప్పటికే అమెరికాలో ఎస్వీబీ, సిగ్నేచర్ బ్యాంకులు దివాలా తీసిన నేపథ్యంలో.. రంగంలోకి దిగిన స్విస్ ప్రభుత్వం యూబీఎస్తో చర్చించి క్రెడిట్ సూయిజ్ బ్యాంక్ను కొనుగోలు చేసేలా పావులు కదిపింది. 3.25 బి. డాలర్లతో క్రెడిట్ సూయిజ్ను కొనుగోలు చేస్తున్నట్లు యూబీఎస్ ప్రకటించింది. ఈ పరిణామాలతో క్రెడిట్ సూయిజ్ బ్యాంక్ షేరు 63%, యూబీఎస్ షేరు 14% వరకు కుంగాయి. (సోమవారం ట్రేడింగ్ చివరకు ఇవి వరుసగా 56% నష్టంతో, 1.26% లాభంతో ముగిశాయి.) ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా బ్యాంకు షేర్లపైనా కనిపించింది.
ఎందుకు పతనమైందంటే..
1856లో స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ కేంద్రంగా ఏర్పాటైన క్రెడిట్ సూయిజ్ బ్యాంక్ తొలుత రైల్ నెట్వర్క్కు నిధులు సమకూర్చడమే లక్ష్యంగా ప్రారంభమైంది. తర్వాత ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్గా ఎదిగింది. ప్రపంచంలోని అత్యుత్తమ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల్లో ఎనిమిదో స్థానానికి చేరింది. స్విట్జర్లాండ్లో యూబీఎస్ తర్వాత రెండో అతి పెద్ద బ్యాంక్గా నిలిచింది. ఈ బ్యాంక్కు ఎలా కష్టాలొచ్చాయంటే..
* పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్న కంపెనీలు బోర్డులు తిప్పేయడం.. బ్యాంకు అధికారుల్లో కొందరి అవినీతి.. డిపాజిటర్లలో విశ్వాసం నింపాల్సిన యాజమాన్యం కొద్ది రోజుల వ్యవధిలోనే కుర్చీ దిగిపోవడం వంటివి ప్రధాన కారణాలుగా చెప్పాలి. కొన్నేళ్ల క్రితమే ఇందుకు బీజం పడింది.
* అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఆర్కిగోస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ కంపెనీకి భారీగా రుణాలివ్వగా.. ఆ సంస్థ 2021లో కుప్పకూలింది. దీంతో బ్యాంక్కు 5.5 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. భారీగా అప్పులు తీసుకున్న గ్రీన్సిల్ క్యాపిటల్ అనే సప్లయ్ చైన్ నెట్వర్క్ సైతం దివాలా తీయడంతో నష్టం మరింత పెరిగింది. ఈ రెండు ఎదురు దెబ్బల కారణంగా క్రెడిట్ సూయిజ్ ఏకంగా 10 బి.డాలర్లు నష్టపోయింది.
* మొజాంబిక్లో అవినీతి ఆరోపణలు, మాజీ ఉద్యోగులపై గూఢచర్యం ఆరోపణలు ఉన్నాయి. అమెరికా, బ్రిటన్లలో కేసుల వల్ల భారీగా పరిహారాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంక్ను గాడిన పెట్టాల్సిన ఉన్నత యాజమాన్యం ఎప్పటికప్పుడు మారడమూ బ్యాంక్కు గట్టి దెబ్బగా మారింది.
భయాలతో డిపాజిట్లు వెనక్కి..
క్రెడిట్ సూయిజ్లో చోటుచేసుకున్న వరుస పరిణామాలతో ఖాతాదార్లు తమ డిపాజిట్లను వెనక్కి తీసుకోవడం మొదలు పెట్టారు. ఫలితంగా ఒక్క 2022లోనే 7.8 బిలియన్ ఫ్రాంక్ల నష్టాన్ని చవిచూసింది. దీనికి తోడు క్రెడిట్ సూయిజ్లో పెద్ద వాటాదారైన సౌదీ నేషనల్ బ్యాంక్ తాము మరిన్ని నిధులను ఇవ్వలేమని తేల్చిచెప్పడం భయాలను మరింత పెంచింది. దీంతో ఒక్కరోజే క్రెడిట్ సూయిజ్ షేరు 63% పతనమై, మరోసారి బ్యాంకింగ్ సంక్షోభానికి ఆజ్యం పోశాయి. దీంతో స్విస్ ప్రభుత్వం రంగంలోకి దిగాల్సి వచ్చింది.
9000 మంది ఇంటికి!
కొనుగోలు అనంతరం వ్యయ నియంత్రణ కోసం 9,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపాలని యూబీఎస్ నిర్ణయించింది. రెండు బ్యాంకులకు కలిపి ప్రస్తుతం లక్షా 25 వేలమంది ఉద్యోగులు ఉన్నారు. క్రెడిట్ సూయిజ్ను లాభదాయకతలోకి తీసుకురావాలంటే ఉద్యోగుల కోత తప్పదని సంబంధిత వర్గాలు అంటున్నాయి.
సిగ్నేచర్ బ్యాంకు కూడా బయటపడినట్లే!
అమెరికాలో కుప్పకూలిన సిగ్నేచర్ బ్యాంక్ను కొనుగోలు చేయడానికి న్యూయార్క్ కమ్యూనిటీ బ్యాంక్ అంగీకరించింది. సోమవారం నుంచి సిగ్నేచర్ బ్యాంక్కు చెందిన 40 శాఖలు న్యూయార్క్ కమ్యూనిటీ బ్యాంక్ అనుబంధ సంస్థల్లో ఒకటైన ఫ్లాగ్స్టార్ బ్యాంక్ కిందకు వస్తాయి. సిగ్నేచర్ బ్యాంక్కు చెందిన 38.4 బిలియన్ డాలర్ల ఆస్తులను కొనుగోలు చేస్తారు. వారం కిందట ఈ బ్యాంకు వైఫల్యం చెందడానికి ముందున్న విలువలో ఇది మూడో వంతు కంటే కాస్త ఎక్కువ.
ఎస్వీబీ బిడ్డింగ్కు మరింత గడువు: అమెరికాలో ఈనెలలో తొలుత కుప్పకూలిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ను పూర్తిగా, పాక్షికంగా విక్రయించడానికి చేపట్టిన బిడ్డింగ్ ప్రక్రియకు ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్ప్(ఎఫ్డీఐసీ) మరింత గడువు ఇచ్చింది. అదే సమయంలో సిలికాన్ వ్యాలీ బ్రిడ్జ్ బ్యాంక్, అనుబంధ సంస్థ సిలికాన్ వ్యాలీ ప్రైవేట్ బ్యాంక్లకు విడివిడిగా, వరుసగా శుక్రవారం, బుధవారంలోగా బిడ్లు దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మాతృ సంస్థ ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ ఇప్పటికే దివాలా పిటిషన్ దాఖలు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం