కార్.. డిమాండ్ కొన్ని మోడళ్లకే
కార్ల విక్రయాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. తమకు కావాల్సిన కారు కోసం కొందరు వినియోగదార్లు నెలల తరబడి వేచి ఉండే పరిస్థితి కొన్ని మోడళ్లలో నెలకొంటే, మరికొన్ని మోడళ్ల కార్ల నిల్వలు డీలర్ల వద్ద పేరుకుపోతున్నాయి.
ఆర్డరు ఇచ్చాక డెలివరీకి నెలలు కూడా
డీలర్ల వద్ద పేరుకుంటున్న చిన్నకార్లు
2019 తర్వాత ఇప్పుడే అధికం
ఈనాడు, హైదరాబాద్: కార్ల విక్రయాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. తమకు కావాల్సిన కారు కోసం కొందరు వినియోగదార్లు నెలల తరబడి వేచి ఉండే పరిస్థితి కొన్ని మోడళ్లలో నెలకొంటే, మరికొన్ని మోడళ్ల కార్ల నిల్వలు డీలర్ల వద్ద పేరుకుపోతున్నాయి. డెలివరీ ఇవ్వాల్సిన కార్ల సంఖ్య 8 లక్షల మేర ఉందని కంపెనీలు చెబుతుండగా, డీలర్ల వద్ద అమ్మకాలు సాగాల్సిన కార్లు 3 లక్షల మేర ఉన్నాయని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక మందగమనం, వడ్డీ రేట్లు పెరుగుతుండటం, ఉద్యోగాల్లో కోత వల్ల తాజా బుకింగ్ల్లోనూ మునుపటి వేగం కనిపించడం లేదు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న బీఎస్6 రెండోదశ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా కంపెనీలు తమ మోడళ్లను ఆధునికీకరించాయి. చిన్న కార్లకు గిరాకీ తగ్గుతోందని, స్పోర్ట్స్ వినియోగ వాహనా (ఎస్యూవీ)లకు గిరాకీ ఎక్కువగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంటే ద్రవ్యోల్బణ ప్రభావం అంతగా ఉండని, అధికాదాయ వర్గాల వారే కార్లు కొనేందుకు ముందుకు వస్తున్నారు.
జనవరి నుంచి కార్ల బుకింగ్ల కోసం షోరూంలకు వచ్చే వారి సంఖ్య 8-10% తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. డీలర్ల దగ్గర దాదాపు 3,00,000 కార్లు (సుమారు రూ.20వేల కోట్ల విలువైన) నిల్వ ఉన్నాయని అంచనా. 2019 తర్వాత ఈ స్థాయిలో నిల్వలుండటం ఇప్పుడేనని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. 2022 డిసెంబరులో కనిష్ఠంగా 1,00,000 కార్లే నిల్వ ఉండటం గమనార్హం. కొవిడ్ పరిణామాల నుంచి సొంత వాహనం కొనుగోలుకు అత్యధికులు ఉత్సాహం చూపారు. అప్పట్లో వడ్డీరేట్లు తక్కువగా ఉండటమూ కలిసొచ్చింది. అయితే చిప్సెట్ల కొరత వల్ల ఆమేర తయారీ జరగలేదు. ఫలితంగా కొత్త కార్ల కోసం దాదాపు 8లక్షలకు పైగా బుకింగ్ ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బుకింగ్ల వృద్ధి రేటు పెరిగిన నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది నెమ్మదిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
త్వరగా పొందేందుకు
కొన్ని ఎస్యూవీల కోసం 18 నెలలు, ఇంకొన్ని కార్లకు 4-6 వారాలు ఎదురుచూడాల్సి వస్తోంది. ‘గిరాకీ ఉన్న మోడళ్లను తొందరగా సొంతం చేసుకునేందుకు, ఒక్కో వినియోగదారుడు ఇద్దరు-ముగ్గురు డీలర్ల వద్ద, 2-3 మోడళ్లను బుక్ చేసుకుంటున్నారు. ఇవి బుకింగ్ గణాంకాలు పెరిగేందుకు కొంత కారణం కావచ్చు. వీటిల్లో కొన్ని రద్దయ్యే అవకాశమూ ఉంద’ని ఒక డీలర్ తెలిపారు.
చిన్న కార్లకు చిక్కులు: భారత్ స్టేజ్ 6 (బీఎస్6) ఉద్గార ప్రమాణాలకు మారడం, భద్రతా పరమైన మరికొన్ని నిబంధనల కోసం తయారీలో మార్పులు చేయాల్సి రావడంతో, ప్రారంభస్థాయిగా పేర్కొనే చిన్న కార్ల ధరలను కంపెనీలు ఏడాదిలో మూడు సార్లు పెంచాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రుణ రేట్లు 2.50% పెరిగాయి. కొనుగోలుదార్ల సెంటిమెంట్ను ఈ పరిణామాలు ప్రభావితం చేస్తున్నాయి. ఆర్థిక మందగమనం, అధిక ద్రవ్యోల్బణ ప్రభావం మధ్యతరగతి వర్గీయులపై ప్రభావం చూపుతున్నందునే.. వీరు ఆసక్తి చూపే చిన్న కార్ల విక్రయాలు తగ్గుతున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిన్నకార్లు విలాసవంతమైనవి కావు కనుక, వీటిపై జీఎస్టీని 28% నుంచి 18 శాతానికి తగ్గించాలని పరిశ్రమ వర్గాలు అభ్యర్థిస్తున్నాయి. అప్పుడు గిరాకీ పెరిగి, డీలర్ల వద్ద ఉన్న కార్ల విక్రయాలు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ఎస్యూవీలకే గిరాకీ..
కొత్త మోడళ్లు, ఎస్యూవీలకు గిరాకీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా టయోటా హైక్రాస్, మహీంద్రా థార్, టయోటా హైరైడర్, మహీంద్రా స్కార్పియో, మహీంద్రా ఎక్స్యూవీ 700, కియా కారెన్స్, మారుతీ బ్రెజ్జా, కియా సోనెట్, హ్యుందాయ్ క్రెటా, మారుతీ గ్రాండ్ విటారా తదితర మోడళ్ల కోసం 6-18 నెలల పాటు వేచి చూడాల్సి వస్తోంది. మరోవైపు కొన్ని మోడళ్ల విద్యుత్ కార్లను సొంతం చేసుకోవాలంటే ఏడాది వరకూ ఎదురుచూడాలని పేర్కొంటున్నారు.
* మొత్తంమీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్ల అమ్మకాలు గతేడాది కంటే 26% పెరిగి 38 లక్షలకు చేరొచ్చన్నది పరిశ్రమ అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే