ఆఫీసు స్థలానికి గిరాకీ అంతంతే
ఆఫీసు స్థలానికి ఈ ఏడాది పెద్ద గిరాకీ ఉండకపోవచ్చని కొలియర్స్ ఇండియా-ఫిక్కీ నివేదిక అంచనా వేసింది.
ఈ ఏడాదిపై ఫిక్కీ- కొలియర్స్ ఇండియా నివేదిక
ఈనాడు, హైదరాబాద్: ఆఫీసు స్థలానికి ఈ ఏడాది పెద్ద గిరాకీ ఉండకపోవచ్చని కొలియర్స్ ఇండియా-ఫిక్కీ నివేదిక అంచనా వేసింది. 2023లో 35-38 మి.చదరపు అడుగుల ఆఫీసు స్థలాన్ని మాత్రమే వ్యాపార సంస్థలు అద్దెకు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. గతేడాది లీజుకు తీసుకున్న 50.3 మి.చదరపు అడుగులతో పోలిస్తే, ఇది 25-30% తక్కువని పేర్కొంది. ఒకవేళ ఆర్థిక మాంద్యం చోటుచేసుకుంటే అద్దెకు తీసుకునే ఆఫీసు స్థలం 30-33 మి.చదరపు అడుగులకు పరిమితం కావచ్చని విశ్లేషించింది. ఈ నివేదిక కోసం దిల్లీ-ఎన్సీఆర్, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణెల్లోని స్థిరాస్తి ధోరణులను విశ్లేషించారు.
లేఆఫ్లతో ఐటీలో కోత: లేఆఫ్లు అధికంగా ఉన్నందున ఐటీ రంగం నుంచి ఈ ఏడాదిలో ఆఫీసు స్థలానికి ఆశించినంత గిరాకీ ఉండదని నివేదిక విశ్లేషించింది. అయితే ఇంజినీరింగ్, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల కంపెనీలు తమ ప్రణాళికల ప్రకారమే ఆఫీసు స్థలాన్ని అద్దెకు తీసుకుంటాయని పేర్కొంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార, ఆర్థిక పరిస్థితులు సర్దుకుంటాయని, అప్పటి నుంచి ఆఫీసు స్థలాన్ని అద్దెకు తీసుకోవటం పెరుగుతుందని వివరించింది.
ఈ అంశాలూ కారణమే: ఫ్లెక్స్ స్పేసెస్, హైబ్రిడ్ వర్క్ మోడ్ వంటి విధానాల వల్ల కూడా కంపెనీలకు ఆఫీసు స్థలం అవసరాలు గతంలో మాదిరి అధికంగా ఉండటం లేదని నివేదిక పేర్కొంది. వ్యయాలు తగ్గించుకునే వీలున్నందున, ఈ నూతన పని విధానాలను ఐటీ కంపెనీలు అనుసరిస్తున్నాయని వివరించింది. గత ఏడాది సెప్టెంబరులో ‘హైబ్రిడ్ పని విధానా’న్ని అమలు చేస్తున్న కంపెనీల సంఖ్య 63% వరకు ఉంది. మున్ముందు ఈ పద్ధతి ఇంకా పెరుగుతుందని కొలియర్స్ ఇండియా సీనియర్ డైరెక్టర్ విమల్ నాడార్ పేర్కొన్నారు.
ప్రథమ శ్రేణి నగరాల్లోనే ఇళ్లకు అధిక గిరాకీ
దేశంలోని ప్రథమ శ్రేణి నగరాల్లోనే ఇళ్లకు అధిక గిరాకీ ఉన్నట్లు ప్రాప్ఈక్విటీ నివేదికలో విశ్లేషించింది. గత ఏడాదిలో ద్వితీయ శ్రేణి నగరాలతో పోల్చితే ప్రథమ శ్రేణి నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 250% అధికంగా నమోదైనట్లు పేర్కొంది. ప్రథమ శ్రేణి నగరాల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, కోల్కతా, ముంబయి, థానే, పుణె ఉన్నాయి. ఈ నగరాల్లో గత ఏడాదిలో 4.53 లక్షల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. అదే సమయంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో అమ్మకాలు 1.83 లక్షలే. ద్వితీయ శ్రేణి నగరాల్లో అహ్మదాబాద్, వడోదర, అమృత్సర్, భోపాల్, భువనేశ్వర్, విశాఖపట్నం తదితర నగరాలున్నాయి. కొత్త ప్రాజెక్టులు ప్రథమశ్రేణి నగరాల్లో అధికంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగావకాశాలు, మెరుగైన సదుపాయాలు ఉండటం వల్లే ఈ నగరాల్లో ఇళ్ల కొనుగోలుకు ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నట్లు ప్రాప్ఈక్విటీ ఎండీ సమీర్ జాసుజా వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’