ఆక్వాలో చేజారుతున్న అగ్రస్థానం
రొయ్యలు, చేపల (ఆక్వా) ఎగుమతుల్లో మనదేశం ఎన్నో ఏళ్లుగా అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా అమెరికాకు అత్యధికంగా సముద్ర ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది మనదేశమే.
అమెరికాకు తగ్గిన ఎగుమతులు
ఈక్వెడార్, వియత్నాం నుంచి అనూహ్య పోటీ
కష్టాల్లో ఏపీ రొయ్యల రైతులు, వ్యాపారులు
ఈనాడు - హైదరాబాద్
రొయ్యలు, చేపల (ఆక్వా) ఎగుమతుల్లో మనదేశం ఎన్నో ఏళ్లుగా అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా అమెరికాకు అత్యధికంగా సముద్ర ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది మనదేశమే. అనూహ్యంగా ఇప్పుడు ఈ స్థానాన్ని ఈక్వెడార్ ఆక్రమిస్తోంది. తక్కువ ధరకే మత్య్స ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ మనదేశాన్ని పక్కకు నెట్టేస్తోంది. దీంతో పాటు వియత్నాం నుంచీ పోటీ పెరిగింది. ఈ పరిస్థితి మనదేశంలో రొయ్యలు, చేపలను చెరువుల్లో సాగుచేస్తున్న రైతులకు శరాఘాతంగా మారింది. దేశీయంగా చూస్తే, ఈ విభాగంలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో రొయ్యలు, చేపల సాగు రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఏటా రూ.58,000 కోట్ల ఎగుమతులు
ఏటా దాదాపు 7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.58,000 కోట్ల) విలువైన సముద్ర ఉత్పత్తులను మనదేశం ఎగుమతి చేస్తోంది. ఇందులో రొయ్యలు, శీతలీకరించిన సముద్ర ఉత్పత్తుల వాటా సగానికంటే అధికం. మనదేశం నుంచి జరుగుతున్న సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో నాలుగో వంతు అమెరికాకే చేరతాయి. తరవాత స్థానాల్లో ఆగ్నేయ ఆసియా, ఐరోపా దేశాలున్నాయి. ఇంతవరకూ ఉన్న పరిస్థితి ఇది. తాజాగా లాటిన్ అమెరికా దేశమైన ఈక్వెడార్ నుంచి మనదేశానికి గట్టి పోటీ ఎదురవుతోంది. యూఎస్కు మనదేశం నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు తగ్గిపోతుండగా, ఈక్వెడార్ నుంచి భారీగా ఎగుమతి అవుతున్నాయి. రొయ్యలు, చేపల చెరువుల సాగుకు ఆ దేశ ప్రభుత్వం నుంచి పెద్దఎత్తున ప్రోత్సాహం లభించడం దీనికి ప్రధాన కారణం. కానీ మనదేశంలో చూస్తే రొయ్యలు, చేపల రైతులు ఎన్నో రకాల సమస్యలతో సతమతం అవుతున్నారు. ప్రభుత్వం నుంచి లభిస్తున్న మద్దతూ అంతంత మాత్రమే.
తక్కువ ధరకు ఇస్తూ..
ఎంతో కాలంగా ఈక్వెడార్ నుంచి చైనాకు రొయ్యలు, చేపలు భారీగా ఎగుమతి అవుతున్నాయి. ‘కొవిడ్’ తరవాత పరిస్థితి మారింది. లాక్డౌన్ నిబంధనలు, అంతర్జాతీయ రవాణాపై ఆంక్షల కారణంగా ఈక్వెడార్ నుంచి చైనాకు ఎగుమతులు తగ్గాయి. దీంతో ఈక్వెడార్ వ్యాపారులు అమెరికాకు తమ ఉత్పత్తులను మళ్లించారు. మనదేశంతో పోల్చితే ఎంతో తక్కువ ధరకే రొయ్యలు, చేపలను అమెరికాకు పంపుతున్నారు. పైగా అమెరికాకు ఎంతో దగ్గరగా ఉండటం వారికి కలిసొచ్చింది. ఈ ఏడాదిలో ఉత్పత్తి పెంచి, రొయ్యలు, చేపలను యూఎస్కు అధికంగా ఎగుమతి చేస్తేనే మనస్థానం నిలుస్తుందని, లేనిపక్షంలో శాశ్వతంగా ఈక్వెడార్కు వెనుకే ఉండిపోవాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు వివరిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో 2.12 లక్షల హెక్టార్లలో
మనదేశం నుంచి అమెరికా, చైనా, ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తున్న చేపలు, రొయ్యల్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంతో అధికం. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని చెరువుల్లో చేపలు, రొయ్యలు సాగవుతున్నాయి. లక్షన్నర మంది రైతులు దీనిపై ఆధారపడి ఉన్నారు. చేపలు, రొయ్యలను నిల్వ చేయడానికి అవసరమైన కోల్డ్ స్టోరేజీ యూనిట్లు కూడా 100కు పైగా ఉన్నాయి. కానీ రెండేళ్లుగా రొయ్యలు, చేపల సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఎగుమతులు మూడో వంతుకు పడిపోయాయి. ఆకర్షణీయ ధర లభించకపోవడం.. అదే సమయంలో మేత ఖర్చులు, చెరువుల నిర్వహణ వ్యయాలు భారంగా మారడంతో, గిట్టుబాటు కాక ఎంతో మంది రైతులు చెరువుల సాగు విరమించుకుంటున్నారు. సాధారణంగా ఏడాది చివర్లో.. నవంబరు, డిసెంబరులలో ఆక్వా ఎగుమతులు గరిష్ఠ స్థాయిలో ఉంటాయి. కానీ 2022 చివర్లో ఈ జోరు కనిపించలేదు. అంతర్జాతీయ విపణిలో మనదేశం వెనుకబడిపోవడానికి, రాష్ట్రంలో ఆక్వా పరిశ్రమ మందగమనం కూడా ఒక కారణమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
Resume Tips: రెజ్యూమె ప్రిపేర్ చేసే సమయంలో చేయకూడని మూడు తప్పుల గురించి మాట్లాడారు గూగుల్ మాజీ రిక్రూటర్ నోలన్ చర్చ్. -
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
కోటక్ మహీంద్రా బ్యాంక్పై ఆర్బీఐ పలు ఆంక్షలు విధించింది. ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లో లోపాలు గుర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. -
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
తమ బ్రాండ్ పేరు, లోగోతో కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తున్నారని, వీటితో అప్రమత్తంగా ఉండాలని ఎల్ఐసీ సూచించింది. -
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 114 పాయింట్లు, నిఫ్టీ 34 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
Realme Narzo: రియల్మీ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వీటి ధర రూ.11,999 నుంచి ప్రారంభమైంది. ఫీచర్లు, వేరియంట్లు, వాటి ధరలు, ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్కు దీటుగా ప్రత్యేక వేదికను తెచ్చేందుకు ఎలాన్ మస్క్కు చెందిన ‘ఎక్స్’ సిద్ధమవుతోంది. -
ఎయిర్టెల్ కొత్త రోమింగ్ ప్యాక్స్.. 184 దేశాలకు ఒకే ప్యాక్
ఎయిర్టెల్ కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లు తీసుకొచ్చింది. రోజుకు రూ.133 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమవుతాయని ఎయిర్టెల్ తెలిపింది. -
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
Tesla: భారత్లోకి టెస్లా ప్రవేశం సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. మంగళవారం చేసిన ఓ కీలక ప్రకటనే అందుకు కారణం. ఆ ప్రకటనేంటి? దానికీ.. కంపెనీ భారత ప్రణాళికలకు సంబంధం ఏంటో చూద్దాం! -
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
Anil Agarwal: తన దినచర్యను తెలపడంతో పాటు యువతకు ఆరోగ్య సూత్రాలను పంచుకున్నారు వేదాంత అధిపతి అనిల్ అగర్వాల్. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 159 పాయింట్ల లాభంతో 73,898 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 22,412 దగ్గర కొనసాగుతోంది. -
ఇస్రో కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్ఈసీ ఇండస్ట్రీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) వినియోగించే జీఎస్ఎల్వీ మార్క్-3 లాంచ్ వెహికల్ కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్ (ఐటీఎస్)ను ఎస్ఈసీ ఇండస్ట్రీస్ రూపొందించింది. -
మూడో రోజూ ముందుకే
వరుసగా మూడో రోజూ దేశీయ సూచీలు రాణించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో టెలికాం, టెక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే చమురు ధరలు పెరగడానికి తోడు విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. -
మా ఉత్పత్తులపై నిషేధం లేదు
తమ అన్ని ఉత్పత్తులు భద్రమైనవి, అత్యంత నాణ్యమైనవని ఎవరెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్స్ తెలిపింది. ఈ సంస్థ ఎగుమతి చేస్తున్న స్పైస్-మిక్స్ ఉత్పత్తుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, కంపెనీ పై విధంగా స్పందించింది. -
బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు ‘అమరరాజా’ సహా 7 కంపెనీల బిడ్
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద బ్యాటరీ ప్లాంట్లు స్థాపించేందుకు అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సహా 7 కంపెనీల నుంచి బిడ్లు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
కాస్త దిగొచ్చిన బంగారం
ఇటీవలి గరిష్ఠాలతో పోలిస్తే బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొంతమేర చల్లారడం ఇందుకు కారణం. -
ఇండిగోలో ఇన్ఫ్లైట్ వినోదం
మే 1 నుంచి దిల్లీ-గోవా విమానాల్లో, తన యాప్ ద్వారా ఇన్-ఫ్లైట్ వినోద కంటెంట్ను విమానయాన సంస్థ ఇండిగో ఆవిష్కరించనుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ద్రవ్యోల్బణానికి వాతావరణ ముప్పు
దీర్ఘకాలం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం.. వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ముడి చమురు ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ బులెటిన్ అభిప్రాయ పడింది. -
ఇంటిపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు ఇండియన్ బ్యాంక్తో టాటా పవర్ భాగస్వామ్యం
నివాస గృహాల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు, టాటా వపర్ సోలార్ సిస్టమ్స్ ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
వచ్చే 6 నెలల్లో మ్యాజిక్పిన్లో 250 నియామకాలు
ఫ్యాషన్, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు.. ఇలా వివిధ విభాగాల్లో బ్రాండ్లు, వ్యాపార సంస్థల అన్వేషణకు ఉపయోగపడే ఇ-కామర్స్ సంస్థ మ్యాజిక్పిన్ వచ్చే ఆరు నెలల్లో 250 మందిని నియమించుకునే యోచనలో ఉంది. -
నేటి నుంచి నిఫ్టీ నెక్స్ట్50లో డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్
నిఫ్టీ నెక్స్ట్ 50 సూచీలో డెరివేటివ్ కాంట్రాక్టులను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) బుధవారం ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్