ఆసియా అపర కుబేరుడు అంబానీ
అంతర్జాతీయ అగ్రగామి 10 మంది కుబేరుల్లో మన దేశం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఒక్కరే ఉన్నారు.
అంతర్జాతీయ సంపన్నుల్లో 9వ స్థానం
వారానికి రూ.3,000 కోట్లు కోల్పోయిన గౌతమ్ అదానీ
దిల్లీ: అంతర్జాతీయ అగ్రగామి 10 మంది కుబేరుల్లో మన దేశం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఒక్కరే ఉన్నారు. భారత్తో పాటు ఆసియా అపర కుబేరుడుగా కూడా ఉన్న అంబానీ 82 బిలియన్ డాలర్ల నికర సంపదతో, ‘ది 2023 ఎం3ఎం హురున్ అంతర్జాతీయ కుబేరుల జాబితా’లో 9వ స్థానం పొందారు. అంబానీ సంపద విలువ ఏడాది క్రితం కంటే 20% (21 బిలియన్ డాలర్లు) తగ్గినా, అదానీ సంపద విలువ అంతకంటే ఎక్కువగా క్షీణించడంతో, దేశీయ కుబేరుల్లో మళ్లీ అగ్రస్థానాన్ని పొందారు. ముకేశ్ అంబానీ 20 ఏళ్ల నేతృత్వంలో ఆర్ఐఎల్ ఆదాయాలు 17 రెట్లు, నికరలాభం 20 రెట్లు పెరిగాయి.
హిండెన్బర్గ్ ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 140 బిలియన్ డాలర్లకు పైగా ఆవిరవ్వకముందు, గౌతమ్ అదానీ అంతర్జాతీయ సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. తదుపరి గ్రూప్ కంపెనీలతో పాటు ఆయన వ్యక్తిగత సంపదా కరిగిపోయింది. తాజాగా 53 బి.డాలర్ల సంపదతో అదానీ కుటుంబం ఈ జాబితాలో 23వ స్థానంలో నిలిచింది. అదానీ సుమారు 28 బి.డాలర్ల (35 శాతం) సంపదను ఏడాది వ్యవధిలో కోల్పోయారు. 2022-23లో వారానికి రూ.3,000 కోట్ల చొప్పున అదానీ నష్టపోయారని నివేదిక తెలిపింది.
* గత పదేళ్లలో చూసుకుంటే అంబానీ సంపద 356%, అదానీ సంపద విలువ 1225% పెరిగాయి.
అత్యధికంగా కోల్పోయింది బెజోస్: ఏడాది కాలంలో నికర సంపదను ఎక్కువమొత్తంలో కోల్పోయిన వారిలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మొదటి స్థానంలో ఉన్నట్లు హురున్ నివేదిక పేర్కొంది. ఆయన సుమారు 70 బి.డాలర్ల సంపదను కోల్పోయారు. అంబానీ, అదానీ కలిపి పోగొట్టుకున్న సంపద కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. అత్యధికంగా సంపదను కోల్పోయిన వారి జాబితాలో అదానీ, అంబానీ 6, 7 స్థానాల్లో ఉన్నారు. ఆసియా అపర కుబేరుల్లో రెండో స్థానాన్ని కూడా గౌతమ్ అదానీ కోల్పోయారు. చైనాకు చెందిన ఝోంగ్ శాన్శాన్ ఈ స్థానం దక్కించుకున్నారు.
* భారత్లో గత ఏడాది కుబేరుల సంఖ్య 15 శాతానికి పైగా పెరిగి 187కు చేరింది. ఇందులో ముంబయిలో 66 మంది నివసిస్తున్నారు. అంతర్జాతీయంగా ఉన్న భారత సంతతి కుబేరులనూ లెక్కలోకి తీసుకుంటే మొత్తం సంఖ్య 217గా ఉంది. అత్యధిక సంఖ్యలో కుబేరులు ఉన్న దేశంగా చైనా నిలిచింది. భారత్ కంటే 5 రెట్లు అధికంగా కుబేరులు చైనాలో ఉన్నారు. భారత అపర కుబేరుల్లో తొలి 10 స్థానాల్లో ఉన్నవారు, వారి సంపద, ప్రపంచ సంపన్నుల జాబితాలో వారి ర్యాంక్ పట్టికలో..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. నాలుగో త్రైమాసికంలో రూ.17,622 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. -
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మస్క్(Elon Musk) భారత్ పర్యటన మరింత ఆలస్యం కానుంది. -
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?